ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
26 OCT 2021 9:23AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 102.94 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 12,428 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 238 రోజుల కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.19% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 15,951 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,35,83,318 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.48% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,63,816. ఇది 241 రోజుల కనిష్ట స్థాయి.
వారపు పాజిటివిటీ రేటు (1.24%) గత 32 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.10%) గత 22 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 60.19 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1766647)
Visitor Counter : 148