ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 20 OCT 2021 9:14AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 99.12 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 14,623 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.15% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 19,446 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,34,78,247 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.52% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098. ఇది 229 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.34%) గత 117 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.10%) గత 51 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 59.44 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

****



(Release ID: 1765100) Visitor Counter : 151