ప్రధాన మంత్రి కార్యాలయం

2021 ఆగస్టు 29 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 80 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 29 AUG 2021 11:36AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం.  ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి అనే సంగతి మనకు అందరికి తెలుసు.  ఆయన జ్ఞాపకార్థం దీనిని దీనిని జాతీయ క్రీడా దినోత్సవంగా మన దేశం జరుపుకొంటున్నది.  ఈ సమయం లో మేజర్ ధ్యాన్ చంద్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నప్పటికీ, చాలా సంతోషం గా ఉండి ఉంటుందని నేను అనుకొంటున్నాను.  ఎందుకంటే ప్రపంచం లో భారతదేశం హాకీ కి పేరు తెచ్చింది ధ్యాన్ చంద్ గారు ఆడిన హాకీ నే.  నాలుగు దశాబ్దాల తరువాత- దాదాపుగా 41 సంవత్సరాల అనంతరం- భారతదేశం లోని యువత- భారతదేశం కుమారులు, కుమార్తెలు హాకీ కి మళ్లీ  ప్రాణం పోశారు.  ఎన్ని పతకాలు గెలిచినప్పటికీ, హాకీ లో పతకం వచ్చే వరకు భారతదేశంలోని ఏ పౌరుడు/పౌరురాలు విజయాన్ని ఆస్వాదించజాలరు; మరి ఈ సారి ఒలింపిక్స్ లో హాకీ పతకం దక్కింది, అదీ నాలుగు దశాబ్దాలు గడిచాక.  మేజర్ ధ్యాన్ చంద్ గారి మనస్సు, ఆయన ఎక్కడ ఉన్నా కూడా, అక్కడ ఎంత ఆనందం కలిగివుంటుందో మీరు ఊహించవచ్చు.  ధ్యాన్ చంద్ గారు వారి జీవితాన్నంటిని క్రీడలకే అంకితం చేశారు. ఈ కారణం గా, ఈ రోజు దేశం యువత లో, మన కుమారుల లో, కుమార్తెల లో క్రీడలంటే ఆకర్షణ కనుపిస్తోంది.  పిల్లలు ఆటలో ముందుకు వెళ్తుంటే తల్లితండ్రులకు కూడా సంతోషం గా అనిపిస్తున్నది.  ఈ ఉత్సాహం ఏదయితే కనిపిస్తున్నదో, ఇదే నేను అనుకోవడం మేజర్ ధ్యాన్‌చంద్ గారికి పెద్ద నివాళి అని.

సహచరులారా, క్రీడల విషయానికి వస్తే, మొత్తం యువ తరం మన ముందు కనిపించడం సహజం.  మనం యువ తరాన్ని దగ్గరగా చూసినప్పుడు ఎంత పెద్ద మార్పు కనిపిస్తుంది?  యువత మనసు మారింది.  నేటి యువకుల మనస్సు పాత పద్ధతుల నుంచి వైవిధ్యంగా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటుంది.  విభిన్నంగా చేయాలని కోరుకుంటుంది.  నేటి యువత మనస్సు ఏర్పరచిన మార్గాలలో నడవడానికి ఇష్టపడదు.  వారు కొత్త మార్గాలు వేయాలనుకుంటున్నారు.  తెలియని ప్రదేశం లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు.  గమ్యం కొత్తది.  లక్ష్యం కూడా కొత్తదే. మార్గం కూడాను కొత్తది.  కోరిక కూడా కొత్తది.  పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు.  కొంతకాలం కిందట భారతదేశం అంతరిక్ష రంగానికి తలుపుల ను తెరచింది.  చూస్తూ ఉండగానే యువతరం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమైంది.  ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ప్రైవేట్ రంగం లో పనిచేసే నవ యువకులు చాలా ఉత్సాహం తో ముందుకు వచ్చారు.  రాబోయే రోజుల లో మన యువత, మన విద్యార్థులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలల్లో పనిచేసే విద్యార్థులు రూపొందించే కృత్రిమ ఉపగ్రహాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని నాకు పక్కా భరోసా గా ఉంది.

అదేవిధం గా ఈ రోజు న మీరు ఎక్కడ చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా - ఎంత ఆస్తి ఉన్న కుటుంబం అయినా, ఎంత చదువుకున్న కుటుంబం అయినా- మీరు ఆ కుటుంబం లోని యువకుడి తో మాట్లాడితే, సంప్రదాయాల కు భిన్నంగా తాను స్టార్ట్-అప్ ను మొదలు పెడతానని చెప్తారు.  స్టార్ట్-అప్‌ ల వైపు వెళ్తానని చెప్తారు.  అంటే రిస్క్ తీసుకోవడానికి వారి మనస్సు ఉవ్విళ్లూరుతోంది.  నేడు చిన్న పట్టణాలలో కూడా స్టార్ట్-అప్ సంస్కృతి విస్తరిస్తోంది.  నేను అందులో ఉజ్జ్వల భవిష్యత్తు సంకేతాలను చూస్తున్నాను.  కొద్ది రోజుల క్రితం మన దేశం లో ఆటవస్తువుల ను గురించిన చర్చ లు జరిగాయి.  అది చూసి, ఈ అంశం మన యువత దృష్టి కి వచ్చినప్పుడు వారు కూడా భారతదేశం లోని బొమ్మల కు ప్రపంచం లో ఎటువంటి గుర్తింపు ఉన్నదీ తెలుసుకొన్నారు.  అందులో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.  ప్రపంచం లో ఆటబొమ్మ ల రంగానికి భారీ బజారు ఉంది.  6-7 లక్షల కోట్ల రూపాయల విపణి ఉంది.  అందులో ప్రస్తుతం భారతదేశం వాటా చాలా తక్కువగా ఉంది.  కానీ పిల్లల మనస్తత్వ శాస్త్రం ప్రకారం బొమ్మలు ఎలా తయారు చేయాలి, వివిధ రకాల బొమ్మల లో వైవిధ్యం ఎలా ఉంటుంది, బొమ్మల లో సాంకేతికత ఏమిటి మొదలైన విషయాల పై ఈ రోజు న మన దేశం లోని యువత దృష్టి పెట్టింది.  ఈ రంగం లో ఏదైనా సహకారాన్ని అందించాలనుకుంటోంది.  సహచరులారా, మరో విషయం- ఇది మనస్సు లో ఆనందాన్ని నింపుతుంది.  విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.  అది ఏమిటి?  మీరు ఎప్పుడైనా గుర్తించారా?  మన దేశం లోని యువత మనస్సు ఇప్పుడు ఉత్తమమైన వాటి వైపు దృష్టి సారిస్తోంది.  ఉత్తమం గా కృషి చేయాలనుకొంటున్నారు.  అత్యుత్తమ మార్గం లో చేయాలనుకుంటున్నారు.  ఇది కూడా దేశాన్ని గొప్ప శక్తి గా అవతరించేలా చేస్తుంది.

సహచరులారా, ఈసారి ఒలింపిక్స్ భారీ ప్రభావాన్ని సృష్టించాయి.  ఒలింపిక్ క్రీడలు ముగిశాయి.  ఇప్పుడు పారాలింపిక్స్ జరుగుతున్నాయి.  క్రీడా జగతి లో భారతదేశం పొందినవి ప్రపంచం తో పోలిస్తే తక్కువే కావచ్చు.  కానీ ఇవి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.  యువత కేవలం క్రీడల వైపు దృష్టి పెట్టడం లేదు.  దానికి సంబంధించిన అవకాశాలను కూడా చూస్తోంది.  దాని మొత్తం పర్యావరణ వ్యవస్థ ను చాలా దగ్గర గా చూస్తోంది.  దాని సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటోంది.  ఏదో ఒక విధంగా తనను తాను జోడించాలనుకుంటోంది.  ఇప్పుడు యువత సంప్రదాయ విషయాల నుంచి ముందుకు సాగిపోయి కొత్త కొత్త విభాగాల ను అక్కున చేర్చుకొంటోంది.  మరి నా దేశ వాసులారా, ఇంతటి వేగం వచ్చింది అంటే క్రీడల ను గురించిన చర్చ ప్రతి కుటుంబం లో మొదలైంది.  మీరు చెప్పండి- ఈ వేగాన్ని ఇప్పుడు ఆపాలా? నిలిపివేయాలా? లేదు! మీరూ నాలాగే ఆలోచిస్తూ ఉండాలి.  ఇప్పుడు దేశం లో క్రీడలు, ఆటలు, క్రీడాకారుల స్ఫూర్తి ఇప్పుడు ఆగకూడదు.  ఈ వేగాన్ని కుటుంబ జీవనం లో, సామాజిక జీవనం లో, జాతీయ జీవనం లో శాశ్వతం గా ఒక స్థాయి లో ఉండేలా చేయాలి.  శక్తి తో నింపాలి.  నిరంతరం కొత్త శక్తి తో నింపాలి.  ఇల్లు, బయటి ప్రదేశం, గ్రామం, నగరం- ఎక్కడైనా మన ఆట స్థలాలు నిండి ఉండాలి.  అందరూ ఆడుకోవాలి.  అందరూ వికసించాలి.  మీకు జ్ఞ‌ాపకం ఉంది కదూ - నేను ఎర్ర కోట నుంచి చెప్పాను- ‘‘సబ్ కా ప్రయాస్’’ - ఆఁ, అవునండి, సబ్ కా ప్రయాస్.  అందరి కృషితోనే క్రీడల లో భారతదేశం తనకు హక్కు ఉన్నటువంటి శిఖర స్థాయి ని అందుకోగలుగుతుంది. మేజర్ ధ్యాన్‌చంద్ గారి లాంటి వ్యక్తులు చూపిన దారి లో ముందుకు సాగిపోవడం మన బాధ్యత గా ఉంది.  ఎన్నో సంవత్సరాల తరువాత దేశంలో తిరిగి అలాంటి సమయం వచ్చింది. క్రీడల తో కుటుంబం, సమాజం, రాష్ట్రం, యావత్తు దేశ ప్రజానీకం కావచ్చు - ఒకే మనస్సు తో  జతపడుతున్నారు.


ప్రియమైన నా నవ యువకులారా, మనం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వేరు వేరు క్రీడల లో ప్రావీణ్యాన్ని సంపాదించాలి.  గ్రామ గ్రామాన క్రీడల పోటీ లు నిరంతరం కొనసాగుతూ ఉండాలి.  స్పర్ధ నుంచే ఆటలు విస్తరిస్తాయి.  ఆట అభివృద్ధి చెందుతుంది.  క్రీడాకారులు కూడా అందులో నుంచే వెలికివస్తారు. రండి,  దేశం లోని మనం అందరం ఈ వేగాన్ని ఎంత గా మందుకు తీసుకుపోగలమో, ఎంతటి తోడ్పాటు ను మనం అందించగలమో, ‘సబ్ కా ప్రయాస్’ఈ మంత్రం తో సాకారం చేసి చూపుదాం.


ప్రియమైన నా దేశవాసులారా, రేపు జరిగే జన్మాష్టమి గొప్ప పండుగ.  ఈ జన్మాష్టమి పండుగ.. శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం.  కొంటె కన్నయ్య నుంచి విరాట్ స్వరూపాన్ని సంతరించుకొనే కృష్ణుని వరకు, శాస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుని నుంచి శస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుని వరకు- భగవంతుని అన్ని రూపాల తో మనకు పరిచయం ఉంది.  కళ అయినా, అందం అయినా, మాధుర్యం అయినా - ఎక్కడైనా శ్రీ కృష్ణుడు ఉన్నాడు. జన్మాష్టమి కి కొన్ని రోజుల ముందు నేను అలాంటి ఆసక్తికరమైన అనుభవాన్ని పొందాను.  కాబట్టి మీకు ఈ మాటలను చెప్పాలని నా మనసు కొరుకుంటోంది.  ఈ నెల 20 వ తేదీన సోమనాథ దేవాలయానికి సంబంధించిన నిర్మాణ పనుల ప్రారంభం సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.  భాల్ కా తీర్థం సోమనాథ దేవాలయం నుంచి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భాల్ కా తీర్థం శ్రీ కృష్ణుడు ఆ అవతారం లో భూమి మీద తన చివరి క్షణాల ను గడిపిన ప్రదేశం.  ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచం లో ఆయన లీలలు అక్కడ ముగిశాయి.  సోమనాథ్ ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంతం లో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.  నేను భాల్ కా తీర్థం గురించి, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాను.  అంతలో నా దృష్టి ఒక అందమైన ఆర్ట్- బుక్ పై పడింది.  ఆ పుస్తకాన్ని నా నివాసం బయట ఎవరో నాకోసం వదలి వెళ్లారు. అందులో శ్రీ కృష్ణుని అనేక రూపాలు, అనేక గొప్ప చిత్రాలు ఉన్నాయి. గొప్ప చిత్రాలు, చాలా అర్థవంతమైన చిత్రాలు ఉన్నాయి.  నేను పుస్తకం పేజీల ను తిప్పడం మొదలుపెట్టినప్పుడు, నా ఉత్సుకత మరింత పెరిగింది.  నేను ఆ పుస్తకాన్ని, ఆ చిత్రాలన్నిటిని చూసినప్పుడు, అందులో నా కోసం రాసిన ఒక సందేశాన్ని చదివినప్పుడు ఆ పుస్తకాన్ని నా ఇంటి బయట వదలిపెట్టిన వారిని నేను కలవాలని అనుకున్నాను.  మా కార్యాలయం వాళ్ళు వారిని సంప్రదించారు.  ఆ తరువాతి రోజే వారిని కలవడానికి ఆహ్వానించాను.  ఆర్ట్-బుక్ లో శ్రీ కృష్ణుని వివిధ రూపాల ను చూసి నా ఉత్సుకత అంతగా పెరిగింది.  ఆ ఉత్సుకత తో నేను జదురాణి దాసి గారి ని కలిశాను.  ఆమె అమెరికన్.  అమెరికా లో జన్మించారు. అమెరికా లో పెరిగారు.  జదురాణి దాసి గారు ఐఎస్ కెసిఒఎన్ తో జతపడి ఉన్నారు, హరే కృష్ణ ఉద్యమం తో ముడిపడి ఉన్నారు. ఆమె గొప్ప ప్రత్యేకత ఆమె భక్తి కళల లో నైపుణ్యం. కేవలం రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 1 న ఐఎస్ కెసిఒఎన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద స్వామి గారి 125 వ జయంతి అని మీకు తెలుసు.  జదురాణి దాసి గారు అందుకోసమే భారతదేశాని కి వచ్చారు.  నా ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఆమె అమెరికా లో జన్మించారు.  భారతీయ భావాల కు దూరంగా ఉన్నారు.  అలాంటి ఆమె శ్రీ కృష్ణుని అందమైన చిత్రాల ను ఎలా తయారు చేయగలిగారు అనేదే నా ప్రశ్న. నేను ఆమె తో సుదీర్ఘం గా మాట్లాడాను.  కానీ మీకు అందులో కొంత భాగాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను.

 

ప్రధానమంత్రి గారు: జదురాణి గారూ.. హరే కృష్ణ.

నేను భక్తి కళ ను గురించి కొంత చదివాను.  అయితే మా శ్రోతల కు దాని ని గురించి మరింత చెప్పండి.  దాని పట్ల మీ అభిరుచి, ఆసక్తి చాలా గొప్పవిగా ఉన్నాయి.

జదురాణి గారు: భక్తి కళ లో ఒక కథనం ఉంది. ఇది ఈ కళ మనస్సు లేదా ఊహ నుంచి కాకుండా బ్రహ్మ సంహిత వంటి ప్రాచీన వేద ధర్మ గ్రంథాల నుంచి వస్తోంది.  వేం ఓంకారాయ పతితం స్కిలతం సికంద్, వృందావన గోస్వామి నుంచి, స్వయం గా బ్రహ్మ దేవుడి నుంచి ఈ కళ వచ్చింది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః వేణువు ను ఆయన ఎలా ధరించేదీ, ఆయన ఇంద్రియాలు అన్నీ ఏ ఇతర భావాల కోసం ఎలా పని చేయగలవో చెప్తుంది. శ్రీమద్భాగవతం (టిసిఆర్ 9.09) బర్హా పీండ నటవరవపుః కర్ణయో: కర్ణికారం. ఆయన చెవి పైన కర్ణిక పుష్పాన్ని ధరించాడు. ఆయన వృందావనం అంతటా తన కమల పాదాల ముద్ర ను వేస్తారు.  ఆవుల మందలు ఆయన మహిమల ను వినిపిస్తాయి.  ఆయన వేణువు అదృష్టవంతుల హృదయాల ను, మనస్సులను ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రతిదీ ప్రాచీన వేద గ్రంథాల నుంచి వచ్చిందే.  ఈ గ్రంథాల శక్తి అతీంద్రియ వ్యక్తుల నుంచి, స్వచ్ఛమైన భక్తుల నుంచి వచ్చింది.  కళ కు వారి శక్తి ఉంది.  అందుకే దాని పరివర్తనను కలిగించేటటువంటిది, అంతే తప్ప అది నా శక్తి ఎంతమాత్రం కాదు.

ప్రధాన మంత్రి: జదురాణి గారూ.. నేను మిమ్మల్ని ఒక భిన్నమైనటువంటి ప్రశ్న ను అడుగుతున్నాను.  ఒక విధం గా చూస్తే 1966 నుంచి, ఇక 1976 నుంచి భౌతికం గా మీరు భారతదేశం తో సుదీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉన్నారు.  మీ దృష్టి లో భారతదేశం అంటే ఏమిటో నాకు చెప్తారా?

జదురాణి గారు: ప్రధాన మంత్రి గారూ.. భారతదేశం అంటే నాకు సర్వస్వం.  నేను కొన్ని రోజుల క్రితం గౌరవ రాష్ట్రపతి గారిని ఉద్దేశించి ప్రస్తావించాను అనుకుంటా- భారతదేశం సాంకేతిక అభివృద్ధి లో చాలా ముందుకు వచ్చిందని.  ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఐఫోన్‌ లు, పెద్ద భవనాలు, చాలా సదుపాయాల తో పాశ్చాత్య దేశాల ను బాగా అనుసరిస్తోందని.  కానీ అది భారతదేశపు నిజమైన కీర్తి కాదని నాకు తెలుసు.  భారతదేశాన్ని గొప్ప గా చేసేది ఏమిటంటే, కృష్ణుడు ఆ అవతారం లో ఇక్కడ కనిపించాడు. అవతారాలన్నీ ఇక్కడ కనిపించాయి- శివుడు ఇక్కడ కనిపించాడు, రాముడు ఇక్కడ కనిపించాడు.  పవిత్ర నదులన్నీ ఇక్కడ ఉన్నాయి.  వైష్ణవ సంస్కృతి కి సంబంధించిన అన్ని పవిత్ర స్థలాలు ఇక్కడ ఉన్నాయి.  కాబట్టి భారతదేశం- ముఖ్యం గా వృందాదావనం- విశ్వం లో అత్యంత ముఖ్యమైన ప్రదేశం.  వృందావనం అన్ని వైకుంఠ గ్రహాల కు మూలం.  ద్వారక కు మూలం, మొత్తం భౌతిక సృష్టి కి మూలం.  కాబట్టి నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను.

ప్రధాన మంత్రి గారు: ధన్యవాదాలు జదురాణి గారూ.. హరే కృష్ణ.

సహచరులారా, ప్రపంచ ప్రజలు ఈనాడు భారతీయ ఆధ్యాత్మికత ను గురించి, తత్వశాస్త్రాన్ని గురించి ఎక్కువ గా ఆలోచిస్తున్నారు.  ఈ సందర్భం లో ఈ గొప్ప సంప్రదాయాల ను ముందుకు తీసుకు పోవలసిన బాధ్యత మనకు ఉంది.  కాలం తో పాటు మారే విషయాల ను వదలివేసి, కాలాతీతమైన దానిని ముందుకు తీసుకు పోవాలి.  మన పండుగల ను జరుపుకొందాం.  వాటి శాస్త్రీయత ను అర్థం చేసుకుందాం.  వాటి వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకొందాం.  ఇది మాత్రమే కాదు- ప్రతి పండుగ లో ఏదో ఒక సందేశం ఉంటుంది.  ఏదో ఒక ఆచారం ఉంటుంది.  మనం వాటిని తెలుసుకొని జీవించాలి.  రాబోయే తరాల కు వారసత్వం గా అందించాలి.  దేశ ప్రజలందరికీ మరోసారి జన్మాష్టమి శుభాకాంక్షలు.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈ కరోనా కాలం లో నేను పరిశుభ్రత ను గురించి మాట్లాడవలసిన అంశాల లో కొంత కొరత ఉన్నట్లు అనిపిస్తుంది.  పరిశుభ్రత ప్రచారాన్ని కొద్దిగానైనా దూరం చేయకూడదని నేను భావిస్తున్నాను.  జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరి ప్రయత్నాలు దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయో చెప్పే ఉదాహరణ లు మనకు స్ఫూర్తి ని ఇస్తాయి. ఏదైనా చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.  కొత్త విశ్వాసాన్ని అందిస్తాయి.  మన సంకల్పానికి ప్రాణం పోస్తాయి.  స్వచ్ఛ్ భారత్ అభియాన్ విషయం వచ్చినప్పుడు ఇందౌర్ పేరు ప్రస్తావన కు వస్తుంది. ఎందుకంటే ఇందౌర్ పరిశుభ్రత కు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ను కలిగి ఉంది. ఇందౌర్ పౌరులు కూడా అభినందనలకు అర్హులు.  మన ఇందౌర్ చాలా సంవత్సరాలుగా ‘స్వచ్ఛ్ భారత్ ర్యాంకింగ్’ లో నంబర్ వన్ స్థానం లో ఉంది.  ఇప్పుడు ఇందౌర్ ప్రజలు స్వచ్ఛ్ భారత్ ర్యాంకింగ్‌ తో సంతృప్తి చెందడానికి ఇష్టపడరు.  వారు మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.  కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నారు.  వారి మనసులో నిర్ణయించుకున్న విషయం ‘వాటర్ ప్లస్ సిటీ’ గా ఆ నగరాన్ని రూపుదిద్దడం.  ఇప్పుడు వారు ఇందౌర్ ను 'వాటర్ ప్లస్ సిటీ'గా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 'వాటర్ ప్లస్ సిటీ' అంటే మురుగునీటి ని శుద్ధి చేయకుండా ఏ కాలువ లోకీ వదలరు.  అక్కడి ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ కాలువల ను మురుగునీటి కాలువల తో అనుసంధానించారు.  పరిశుభ్రత ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కారణంగా సరస్వతి, కాన్హ నదుల లో మురికి నీటి ని వదలడం కూడా గణనీయం గా తగ్గిపోయింది.  పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది.  ఈ రోజు మన దేశం స్వాతంత్ర్య భారత అమృత మహోత్సవాల ను జరుపుకుంటున్నప్పుడు స్వచ్ఛ్ భారత్ అభియాన్ సంకల్పాన్ని మందగించనివ్వకూడదని గుర్తుంచుకోవాలి.  మన దేశంలో ‘వాటర్ ప్లస్ సిటీ’ నగరాలు ఎంత ఎక్కువ సంఖ్య లో ఉంటే పరిశుభ్రత అంతగా పెరుగుతుంది.  మన నదులు కూడా శుభ్రం గా ఉంటాయి.  నీటి ని ఆదా చేసే మానవ బాధ్యత ను నెరవేర్చే సంస్కారం కూడా ఉంటుంది.

సహచరులారా, బిహార్‌ లోని మధుబని నుంచి ఒక ఉదాహరణ మన ముందుకు వచ్చింది. మధుబని లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం కలసి మంచి ప్రయత్నం చేశాయి.  రైతులు దీని తాలూకు ప్రయోజనాన్ని పొందుతున్నారు.  ఇది స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ కు కొత్త బలాన్ని ఇస్తోంది.  విశ్వవిద్యాలయం ప్రారంభించిన ఈ కార్యక్రమం పేరు ‘సుఖేత్ మాడల్’. గ్రామాల లో కాలుష్యాన్ని తగ్గించడమే సుఖేత్ మాడల్ ఉద్దేశ్యం.  ఈ పథకం లో భాగం గా పేడ ను , ఇతర గృహ వ్యర్థాల ను గ్రామం లోని రైతుల నుంచి సేకరిస్తారు.  బదులు గా గ్రామస్తులకు వంట గ్యాస్ సిలిండర్ ల కోసం డబ్బు ను ఇస్తారు.  గ్రామం నుంచి సేకరించిన చెత్త ను పారవేయడం కోసం వర్మీ కంపోస్ట్ తయారు చేసే పని కూడా జరుగుతోంది.  అంటే సుఖేత్ మాడల్ లో నాలుగు ప్రయోజనాలు నేరు గా కనిపిస్తాయి. ఒకటోది గ్రామానికి కాలుష్యం నుంచి విముక్తి. రెండోది - గ్రామానికి మురికి నుంచి విముక్తి.  మూడోది గ్రామస్తులకు ఎల్ పిజి సిలిండర్ కోసం డబ్బు లభించడం.  నాలుగోది గ్రామం లోని రైతుల కు సేంద్రియ ఎరువులు లభించడం.  అలాంటి ప్రయత్నాలు మన గ్రామాల శక్తి ని ఎంతగా పెంచుతాయో మీరు ఊహించండి.  ఇది స్వావలంబన కు సంబంధించిన విషయం.  దేశం లోని ప్రతి పంచాయతీ ఇటువంటి వాటి ని చేయాలని నేను చెప్తున్నాను.  మరి సహచరులారా, మనం ఒక లక్ష్యం తో బయలుదేరినప్పుడు ఫలితాలు లభిస్తాయని ఖచ్చితం గా చెప్పలేం.  ఇప్పుడు తమిళ నాడు లోని శివగంగ జిల్లా లో ఉన్న కాంజీ రంగాల్ పంచాయతీ ని చూడండి.  ఆ చిన్న పంచాయతీ ఏమి చేసిందో చూడండి.  చెత్త నుంచి సంపద ను సృష్టించే మరో నమూనా ను మీరు అక్కడ చూడవచ్చు.  అక్కడ గ్రామ పంచాయతీ స్థానిక ప్రజలతో కలసి తమ గ్రామం లో వ్యర్థాల నుంచి విద్యుత్తు ను ఉత్పత్తి చేసే స్థానిక ప్రాజెక్టు ను మొదలుపెట్టింది.  గ్రామం అంతటి నుంచి చెత్త ను సేకరిస్తారు.  దాని నుంచి విద్యుత్తు ను ఉత్పత్తి చేస్తారు.  మిగిలిన ఉత్పత్తులను కూడా పురుగుమందులు గా అమ్ముతారు.  గ్రామం లో ఈ పవర్ ప్లాంట్ సామర్థ్యం రోజు కు 2 టన్నుల వ్యర్థాల ను పారవేయడం.  దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు వీధిదీపాల కు, గ్రామం లోని ఇతర అవసరాల కు ఉపయోగపడుతోంది.  ఈ కారణం గా పంచాయతీ డబ్బు ఆదా అవుతోంది.  ఆ డబ్బు ఇతర అభివృద్ధి పనుల కు ఉపయోగపడుతోంది.  ఇప్పుడు చెప్పండి- తమిళ నాడు లోని శివగంగ జిల్లా లో గల ఒక చిన్న పంచాయతీ మనకు అందరికీ ప్రేరణ ను ఇస్తున్నదా లేదా.  వారు అద్భుతాలు చేశారు. కదూ!
ప్రియమైన నా దేశవాసులారా,
‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఇప్పుడు భారతదేశం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు.  ప్రపంచం లోని వివిధ మూలల్లో కూడా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ను గురించి చర్చ జరుగుతున్నది.  విదేశాల లో నివసిస్తున్న మన భారతీయ సముదాయాని కి చెందిన వ్యక్తులు ఉన్నారు.  వారు కూడా కొత్త కొత్త విషయాల ను నాకు వెల్లడి చేస్తూనే ఉన్నారు.  అలాగే ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో విదేశాల లో జరుగుతున్న ప్రత్యేకమైన కార్యక్రమాల ను కొన్నిసార్లు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.  ఈ రోజు న కూడా అటువంటి కొంతమంది ని మీకు నేను పరిచయం చేస్తాను.  కానీ అంతకు ముందు నేను మీకు ఒక ఆడియో ను వినిపించాలనుకుంటున్నాను.  శ్రద్ధ గా ఆలకించండి.
##
[రేడియో యూనిటీ నైంటీ ఎఫ్. ఎం.-2]

నమోనమః సర్వేభ్యః
మమ నామ గంగా
భవంతః శృణ్వంతు
రేడియో-యూనిటీ -నవతి-F.M-
'ఏక్ భారతం శ్రేష్ఠ భారతం' |
అహం ఏకతా మూర్తే:
మార్గ్ దర్శికా ఏవం రేడియో యూనిటీ
మాధ్యమే ఆర్. జె. అస్మి |
అద్య సంస్కృత దినం అస్తి |
సర్వేభ్య: బహవ్య: శుభ కామ్ నాః సంతి |
సర్ దార్-వల్లభ్ భాయి-పటేల్ మహోదయ:
‘లోహ పురుషః’ ఇత్యుచ్యతే.
2013-తమే వర్షే లోహ సంగ్రహస్య
అభియానం ప్రారబ్ధం |
134-టన్-పరిమితస్య
లోహస్య గలనం కృతమ్ |
ఝార్ ఖండస్య ఏక: వ్యవసాయవేత్త:
ముద్రరస్య దానం కృత్వాన్ |
భవంతః శృణ్వంతు రేడియో-యూనిటీ-నవతి-ఎఫ్. ఎం. -
‘ఏక భారతం శ్రేష్ఠ-భారతం’ |
[రేడియో యూనిటీ నైంటీ ఎఫ్. ఎం.-2]
##
సహచరులాలారా, భాష ను మీరు అర్థం చేసుకొని ఉంటారు. ఈ రేడియో లో సంస్కృతం లో మాట్లాడుతున్న వారు ఆర్ జె గంగ.  గుజరాత్ రేడియో జాకీ ల సమూహం లో ఆర్ జె గంగ సభ్యురాలు.  ఆమె తో పాటు ఆర్ జె నీలమ్, ఆర్ జె గురు, ఆర్ జె హేతల్ ల వంటి ఇతర సహచరులు కూడా ఉన్నారు. గుజరాత్‌ లో, కేవడియా లో వీరంతా కలసి ప్రస్తుతం సంస్కృత భాష విలువ ను పెంచడంలో నిమగ్నమై ఉన్నారు.  మీకు తెలుసు కదా! ప్రపంచం లోని ఎత్తైన విగ్రహం, మన దేశానికే గర్వకారణమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న కేవడియా ఇదే అనే సంగతి. నేను అదే కేవడియా ను గురించి మాట్లాడుతున్నాను అని మీకు తెలుసు.  వీరంతా ఒకేసారి అనేక పాత్రల ను పోషించే రేడియో జాకీ లు.  వారు గైడ్‌లు గా కూడా పనిచేస్తారు.  అలాగే సాముదాయక రేడియో అయిన రేడియో యూనిటీ 90 ఎఫ్. ఎమ్. ని నిర్వహిస్తారు. ఈ ఆర్ జె లు వారి శ్రోతల తో సంస్కృత భాష లో మాట్లాడుతారు. వారికి సమాచారాన్ని సంస్కృతం లో అందిస్తారు.

మిత్రులారా, మన దగ్గర సంస్కృతం గురించి ఇలా చెప్తారు -

అమృతం సంస్కృత మిత్ర,

సరసం సరళం వచః |

ఏకతా మూలకం రాష్ట్రే,

జ్ఞాన విజ్ఞాన పోషకమ్| అని.

ఈ మాటల కు, మన సంస్కృత భాష సరసమైంది, సరళమైందిగా కూడాను ఉంది అని భావం.

 

సంస్కృతం ఆ భాష ఆలోచనలు, సాహిత్యం ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంది. దేశ ఐక్యత ను పెంపొందిస్తుంది. బలపరుస్తుంది.  సంస్కృత సాహిత్యం లో ఎవరినైనా ఆకర్షించగల మానవత్వం, జ్ఞానాల దైవిక తత్వం ఉంది.  ఇటీవల విదేశాల లో సంస్కృతం బోధించే స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్న చాలా మంది గురించి నాకు తెలిసింది.  అలాంటి వారిలో ఒకరు శ్రీమాన్ రట్ గర్ కోర్టెన్‌హార్స్ట్ గారు.  ఆయన ఐర్ లండ్‌ లో ప్రసిద్ధ సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడూను.  ఆయన అక్కడి పిల్లల కు సంస్కృతం నేర్పిస్తున్నారు.  ఇక్కడ తూర్పు న భారతదేశం, థాయ్‌లాండ్ ల మధ్య సాంస్కృతిక సంబంధాల ను బలోపేతం చేయడం లో సంస్కృత భాష కూడా ముఖ్యమైన పాత్ర ను పోషిస్తున్నది.  డాక్టర్ చిరాపత్ ప్రపండవిద్య గారు, డాక్టర్ కుసుమ రక్షామణి గారు - ఇద్దరూ థాయ్‌లాండ్‌ లో సంస్కృత భాష ప్రచారం లో చాలా ముఖ్య పాత్ర ను పోషిస్తున్నారు. వారు థాయ్, సంస్కృత భాషల లో తులనాత్మక సాహిత్యాన్ని కూడా రచించారు.  రష్యాలోని మాస్కో స్టేట్ యూనివర్సిటీ లో సంస్కృతం బోధించే శ్రీమాన్ బోరిస్ జాఖరిన్ గారు అటువంటి ప్రొఫెసర్.  ఆయన అనేక పరిశోధన పత్రాల ను, పుస్తకాల ను ప్రచురించారు.  సంస్కృతం నుంచి రష్యన్ భాష లోకి అనేక పుస్తకాల ను అనువదించారు.  అదేవిధం గా ఆస్ట్రేలియా లో విద్యార్థుల కు సంస్కృత భాష బోధించే ప్రముఖ సంస్థల లో సిడ్నీ సంస్కృత పాఠశాల ఒకటి.  ఈ పాఠశాల పిల్లల కోసం సంస్కృత వ్యాకరణ శిబిరం, సంస్కృత నాటకం, సంస్కృత దినోత్సవం వంటి కార్యక్రమాల ను కూడా నిర్వహిస్తుంది.

సహచరులారా, ఇటీవలి కాలం లో చేసిన ప్రయత్నాలు సంస్కృతం విషయం లో కొత్త అవగాహన ను కల్పించాయి.  ఈ దిశ లో మన ప్రయత్నాల ను పెంచవలసిన సమయం వచ్చింది.  మన వారసత్వాన్ని సంరక్షించడం, నిర్వహించడం, కొత్త తరానికి అందించడం, భవిష్యత్తు తరాల వారికి అందించడం మన బాధ్యత.  వీటిపై భావి తరాల కు కూడా హక్కు ఉంటుంది.  ఇప్పుడు ఈ పనుల కోసం కూడా అందరి ప్రయత్నాల ను పెంచవలసిన సమయం వచ్చింది.  సహచరులారా, ఈ రకమైన ప్రయత్నం లో నిమగ్నమైన వ్యక్తి మీకు తెలిసినట్లయితే, మీకు అటువంటి సమాచారం ఏదైనా ఉంటే, దయచేసి వారికి సంబంధించిన సమాచారాన్ని సామాజిక ప్రసార మాధ్యమాల లో #CelebratingSanskrit అన్న ట్యాగ్ తో తప్పక పంచుకోగలరు.

ప్రియమైన నా దేశవాసులారా, ‘విశ్వకర్మ జయంతి’ కూడా కొద్ది రోజుల్లో రాబోతోంది. భగవాన్ విశ్వకర్మ ను ప్రపంచ సృష్టి శక్తి కి చిహ్నం గా పరిగణిస్తారు. కుట్టు-ఎంబ్రాయిడరీ అయినా, సాఫ్ట్‌వేర్ అయినా, ఉపగ్రహమైనా, ఎవరైనా తన నైపుణ్యం తో ఒక వస్తువు ను సృష్టించినా- ఇదంతా విశ్వకర్మ స్వరూపం.  ఈ రోజు ప్రపంచం లో నైపుణ్యాన్ని కొత్త మార్గం లో గుర్తిస్తున్నప్పటికీ మన రుషులు వేల సంవత్సరాల నుంచి నైపుణ్యం, కొలత ల ప్రకారం తీర్చిదిద్దడంపైన దృష్టి పెట్టారు.  వారు నైపుణ్యాన్ని, కౌశలాన్ని, విశ్వాసాన్ని మన జీవిత తత్వశాస్త్రం లో ఒక భాగంగా చేశారు.  మన వేదాలు కూడా అనేక సూక్తులను భగవాన్ విశ్వకర్మ కు అంకితం చేశాయి.  విశ్వం లోని గొప్ప సృష్టి ప్రణాళిక లు, కొత్త, పెద్ద పనులు మొదలయిన వాటి ఘనత ను మన గ్రంథాల లో భగవాన్ విశ్వకర్మ కే ఇచ్చారు.  ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం లో ఏ అభివృద్ధి, ఆవిష్కరణ జరిగినా అది నైపుణ్యాల ద్వారా మాత్రమే జరుగుతుందనేదానికి ఇది చిహ్నం.  భగవాన్ విశ్వకర్మ జయంతి, ఆయన ఆరాధన వెనుక ఉన్న స్ఫూర్తి ఇది.  మన గ్రంథాల లో ఇలా పేర్కొన్నారు. -

విశ్వస్య కృతే యస్య కర్మవ్యాపారః సః విశ్వకర్మా | అని.

 

ఈ మాటల కు సృష్టి కి మరియు నిర్మాణానికి సంబంధించిన అన్ని చర్యల ను చేసేది విశ్వకర్మ.  మన గ్రంథాల దృష్టి లో, మన చుట్టూ ఉన్న నిర్మాణాల లో, సృజన లో నిమగ్నం అయినటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తులంతా భగవాన్ విశ్వకర్మ వారసులు.  వారు లేని జీవనాన్ని మనం ఊహించలేం.  ఆలోచించండి.  చూడండి- మీ ఇంట్లో విద్యుత్తు సమస్య ఉంటే, మీకు ఎలక్ట్రీశియన్ దొరకకపోతే ఏం జరుగుతుంది? మీరు ఎంత పెద్ద సమస్య ను ఎదుర్కొంటారు!  ఇలాంటి నైపుణ్యం కలిగిన వ్యక్తుల కారణం గా మన జీవనం కొనసాగుతుంది.  లోహాల తో పని చేసే వారు, కుండల తయారీదారు, చెక్క పని వారు, ఎలక్ట్రీశియన్, హౌస్ పెయింటర్, స్వీపర్ లేదా మొబైల్-ల్యాప్‌టాప్ రిపేర్ చేసే వారు - ఎవరైనా కానివ్వండి. వారంతా మీ చుట్టూ ఆధునిక రూపం లో ఉన్న విశ్వకర్మలే.  కానీ సహచరులారా, దానిలో మరో కోణం ఉంది.  ఇది కొన్నిసార్లు ఆందోళన ను కలిగిస్తుంది.  దేశం లో సంస్కృతి, సంప్రదాయం, ఆలోచన, నైపుణ్యం ఉన్న మానవశక్తి ని విశ్వకర్మ గా భావించే రోజులుండేవి.  అటువంటి పరిస్థితులు ఎలా మారిపోయాయి?  ఒకప్పుడు మన కుటుంబ జీవనం పై, సామాజిక జీవనం పై, జాతీయ జీవనం పై కౌశల్య ప్రభావం భారీ గా ఉండేది. కానీ బానిసత్వపు సుదీర్ఘ కాలం లో నైపుణ్యానికి అటువంటి గౌరవాన్ని ఇచ్చిన భావన క్రమం గా పోయింది.  నైపుణ్యం ఆధారితమైనటువంటి పనులు చిన్నవి గా భావించే విధంగా ఆలోచన మారింది.  ఇప్పుడు  చూడండి- ప్రపంచం మొత్తం నైపుణ్యం మీద ఎక్కువగా దృష్టి ని సారిస్తోంది.  భగవాన్ విశ్వకర్మ పూజ కూడాను కేవలం లాంఛనాల తోనే  పూర్తి కాలేదు.  మనం ప్రతిభ ను గౌరవించాలి.  నైపుణ్యాన్ని సాధించాలంటే  మనం కష్టపడాలి.  నైపుణ్యం ఉన్నందుకు గర్వపడాలి.  మనం కొత్తగా ఏదైనా చేసినప్పుడు, కొత్త అంశాన్ని ఆవిష్కరించినప్పుడు, సమాజానికి ఉపయోగపడేదానిని సృష్టించినప్పుడు, ప్రజల జీవనాన్ని సులభతరం చేసినప్పుడు, మన విశ్వకర్మ పూజ సార్థకం అవుతుంది.  ఈ రోజు న ప్రపంచం లో నైపుణ్యం ఉన్న వ్యక్తుల కు అవకాశాల కొరత లేదు.  నేడు నైపుణ్యాల తో ఎన్నో ప్రగతి మార్గాలు సిద్ధం అవుతున్నాయి.  కాబట్టి రండి.. ఈసారి మనం భగవాన్ విశ్వకర్మ పూజ లో విశ్వాసం తో పాటు ఆయన సందేశాన్ని కూడా స్వీకరించే సంకల్పాన్ని చెప్పుకొందాం.  నైపుణ్యం ప్రాముఖ్యాన్ని మనం అర్థం చేసుకొనే విధం గా మన పూజ తాలూకు భావం అయితీరాలి.  అలాగే నైపుణ్యం ఉన్న వ్యక్తులకు, వారు ఏ పని చేసే వారు అయినప్పటికీ, వారికి పూర్తి గౌరవాన్ని కూడా ఇద్దాం.

ప్రియమైన నా దేశ వాసులారా, ఇది స్వాతంత్య్రాని కి 75 వ సంవత్సరం.  ఈ సంవత్సరం మనం ప్రతి రోజూ కొత్త సంకల్పాలు చేసుకోవలసిఉంది.  కొత్త గా ఆలోచించాలి.  కొత్త విషయాల ను సాధించేందుకు ప్రేరణ ను పొందాలి.  భారతదేశం స్వాతంత్య్రం సాధించి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు, మన ఈ సంకల్పాలు మాత్రమే విజయానికి పునాదిగా కనిపిస్తాయి.  కాబట్టి మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.  ఇందులో మన వంతు సహకారాన్ని అందించాలి.  ఈ ప్రయత్నాల మధ్య మనం గుర్తు పెట్టుకోవలసిన మరో విషయం ఉంది.  అదే.. మందు తో పాటు కఠిన నియమాల పాలన ను కూడా అనుసరించాలి.. అనేది.  దేశం లో 62 కోట్ల కు పైగా టీకామందు తాలూకు డోసుల ను ఇవ్వడమైంది.  అయినప్పటికీ, మనం ఇంకా జాగ్రత్త గా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. మరి ఇంకా- ఆఁ, ఎప్పటిలాగే మీరు ఏదైనా కొత్త పని ని చేసినప్పుడు కొత్త గా ఆలోచించండి.  అప్పుడు ఖచ్చితం గా నన్నుకూడా అందులో భాగస్వామి ని చేయండి.  మీ ఉత్తరాల కోసం, మీ సందేశాల కోసం నేను వేచి ఉంటాను. ఈ ఆకాంక్ష తో, మీ అందరికి రాబోయే పండుగ ల తాలూకు మరో సారి అనేకానేక శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.

నమస్కారం.



 

***



(Release ID: 1750135) Visitor Counter : 337


Read this release in: English , Urdu , Hindi