గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

శాస్త్రీయంగా మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వ‌హ‌ణ‌ను అభ్యస‌నం చేస్తున్న‌ 4,372 పట్టణ స్థానిక సంస్థలు/ నగరాలు

Posted On: 05 AUG 2021 1:58PM by PIB Hyderabad

మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వ‌హ‌ణ (ఎంఎస్‌డ‌బ్ల్యు) నిబంధ‌న‌లు -2016 ప్రకారం శాస్త్రీయంగా మునిసిపల్‌ల ఘన వ్యర్థాల నిర్వ‌హ‌ణ అంశాన్ని 4372 ప‌ట్ట‌ణ స్థానిక‌ స్వ‌ప‌రిపాల‌న సంస్థ‌లు (యుఎల్‌బీ)/ న‌గ‌రాలు చేప‌ట్టాయి.
వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్ఎండ‌బ్ల్యు) కార్యాచరణ రకం

అమ‌లు చేస్తున్న వార్డులు

మొత్తం వార్డులు

పురోగతి శాతం

ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ

86,228

88,803

97.10 %

100 % మూల వ్యర్థాల విభజన.

72,493

88,803

81.63 %

 

దేశంలో రోజుకు 1,40,980 టన్నుల మునిసిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 68% అంటే 96,259 టీపీడీల మేర వ్య‌ర్థాలు శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేయబడుతున్నాయి.
దేశంలో ఎంఎస్‌డబ్ల్యు నిర్వ‌హ‌ణ‌కు గాను మౌలిక సదుపాయాల క‌ల్ప‌నలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ, 100 శాతం మేర‌ మూలాలను వేరు చేయడం మరియు వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం వంటి కార్య‌క‌లాపాలు ఉన్నాయి. వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. వ్యర్థాల నుండి కంపోస్ట్, విద్యుత్ ఉత్పత్తి, బయో-మిథనైజేషన్, మెటీరియల్ రికవరీ సౌకర్యాలు మరియు నిర్మాణం మరియు కూల్చివేత (సీ అండ్ డీ) వ్యర్థాల రీసైక్లింగ్ మొదలైనవి ఉన్నాయి. ఎస్‌బీఎ-యు కింద ఎస్‌డబ్ల్యుఎం ప్రాజెక్ట్‌ల యొక్క మొత్తం ఆమోదించబడిన ఖర్చులో.. 35 శాతం మేర‌ వ్య‌యాన్ని కేంద్ర స‌హాయం (సీఏగా) రూపంలో విడుదల చేస్తోంది. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వ వాటా జోడించిన తర్వాత సంబంధించిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత పరిపాలన వ్య‌వ‌స్థ‌ల ద్వారా సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్‌లు/ యుఎల్‌బీలకు బదిలీ చేయబడుతుంది.

సామాజిక న్యాయం మ‌రియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా తెలియజేయబడినట్లుగా, గుర్తించబడిన మాన్యువల్ స్కావెంజర్‌లు మరియు వారి ఆధారపడినవారు వారి పునరావాసం కోసం క్రింది ప్రయోజనాలను అందిస్తారు:
(i) కుటుంబంలో గుర్తించిన పారిశుద్ధ్య కార్మికుడికి (మాన్యువల్ స్కావెంజర్‌కి) ఏక మొత్తంగా రూ.40,000/- సాయం

(ii) గుర్తించ‌బ‌డిన‌ మాన్యువల్ స్కావెంజర్ మ‌రియు వారిపై ఆధార‌ప‌డిన వారికి నెల‌కు రూ.3000 చొప్పున స్టైఫండ్‌తో సహా నైపుణ్య అభివృద్ధి శిక్ష‌ణ‌.

(iii) స్వయం ఉపాధి ప్రాజెక్టులకు దాదాపు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మూలధన సబ్సిడీతో కూడిన రాయితీ రుణం.
 
(iv) 'జాతీయ సఫాయి కరంచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' స్వచ్ఛత ఉద్యోగ యోజన కింద పారిశుద్ధ్య కార్మికులు, మాన్యువల్ స్కావెంజర్‌లు వారిపై ఆధార‌ప‌డిన వారు మురుగునీటిని, సెప్టిక్ ట్యాంకులు యాంత్రికంగా శుభ్రపరిచేందుకు అవ‌స‌ర‌మైన పారిశుధ్య సంబంధిత పరికరాలు/వాహనాల కొనుగోలుకు రూ.5.00 లక్షల వరకు మూలధన సబ్సిడీతో కూడిన రాయితీ రుణాల అంద‌జేత‌.

 
ఈ సమాచారాన్ని గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ స‌హాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక స‌మాధానంలో  తెలిపారు. 

 

*****



(Release ID: 1742873) Visitor Counter : 139


Read this release in: English , Bengali , Punjabi