ఆర్థిక మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం బకాయిలు చెల్లింపు

Posted On: 19 JUL 2021 7:02PM by PIB Hyderabad

2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం అన్ని జీఎస్టీ పరిహార బకాయిలను రాష్ట్రాలకు చెల్లించింది. ఈ రోజు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.

జీఎస్టీ (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 లోని సెక్షన్ 8 కింద విధించే జీఎస్టీ పరిహార సెస్ జీఎస్టీ కాంపెన్సేషన్ ఫండ్ అని పిలిచే, గడువు తీరడానికి అవకాశం లేని, ఫండ్‌లోకి బదిలీ అవుతుంది. ఇది చట్టంలోని సెక్షన్ 10(1) లో ఇచ్చిన విధంగా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 10 (2) ప్రకారం పరిహార నిధి నుండి ఐదేళ్లపాటు జీఎస్టీని అమలు చేయడం వల్ల వచ్చే ఆదాయ నష్టానికి రాష్ట్రాలకు పరిహారం ఇస్తున్నారు. 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు జీఎస్టీ పరిహారం ఇప్పటికే రాష్ట్రాలకు చెల్లించారు.

మహమ్మారి ఆర్ధిక ప్రభావంతో తక్కువ జీఎస్టీ వసూలు, అదే సమయంలో జీఎస్టీ పరిహార సెస్ తక్కువ వసూలు చేయడం వల్ల అధిక పరిహారం అవసరమని మంత్రి పేర్కొన్నారు. జీఎస్టీ పరిహారంపూర్తి పరిహార అవసరాన్ని తీర్చడానికి జిఎస్‌టి పరిహార నిధిలో ఉన్న మొత్తం సరిపోకపోవడంతో ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 వరకు చెల్లించాల్సిన పరిహారాన్ని పాక్షికంగా తీర్చడానికి  రూ. 91,000 కోట్లు అన్ని రాష్ట్రాలు / యుటిలకు విడుదల అయ్యాయి. ప్రతి రాష్ట్రానికి ఇంకా విడుదల చేయాల్సిన జీఎస్టీ పరిహారం వివరాలు కూడా మంత్రి తన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

జిఎస్‌టి (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 ప్రకారం జిఎస్‌టి అమలు చేయడం వల్ల వచ్చే ఆదాయ నష్టం కారణంగా కొన్ని రాష్ట్రాలు జిఎస్‌టి పరిహారం చెల్లించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని సవరించడం, వైద్య పరికరాల సేకరణకు అదనపు నిధి మరియు అధికార పంపిణీ మంజూరు వంటివి అదనంగా రాష్ట్రాల నుంచి సాధారణ అభ్యర్థన అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించడానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇస్తున్న విషయం 41, 42 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించామని ఆయన చెప్పారు. తదనుగుణంగా, 20-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పరిహార నిధిలో సరిపోని బ్యాలెన్స్ కారణంగా పరిహారాన్ని స్వల్పంగా విడుదల చేయడం అయింది. దీని వల్ల వనరుల అంతరాన్ని తీర్చడానికి రాష్ట్రాలకు సహాయపడటానికి ప్రత్యేక విండో కింద రూ.1.1 లక్షల కోట్లు కేంద్రం రుణం తెచ్చి,  రాష్ట్రాలకు బ్యాక్-టు-బ్యాక్ రుణంగా ఇచ్చింది అని కేంద్ర మంత్రి తెలిపారు. 

43 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిపిన తరువాత, కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక విండో ద్వారా మార్కెట్ నుండి రూ. 1.59 లక్షల కోట్లు రుణ సమీకరణ చేసింది. గత సంవత్సరంలో చేసినట్లుగా తగిన మొత్తంలో బ్యాక్ టు బ్యాక్ లోన్‌గా రాష్ట్రాలు / యుటిలకు ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం రూ. 15.07.2021 న 75,000 కోట్లు రాష్ట్రాలు / యుటిలకు విడుదల చేశారు అని మంత్రి వివరించారు.

అదనంగా, పరిహార నిధిలో లభించే మొత్తాన్ని బట్టి,  జీఎస్టీ లోటును తీర్చడానికి కేంద్రం సాధారణ  జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు విడుదల చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
స్థూల జీఎస్టీ సేకరణ (ఎస్‌జిఎస్‌టి + సిజిఎస్‌టి + ఐజిఎస్‌టి + జిఎస్‌టి కాంపెన్సేషన్ సెస్) మార్చి 2020 నుంచి నెలవారీగా  వారీగా వివరాలను మంత్రి ప్రవేశపెట్టారు:

 

 

నెల 

స్థూల జీఎస్టీ సేకరణ (రూ.కోట్లలో)

2019-20

2020-21

2021-22

ఏప్రిల్ 

 

32172

139708

మే 

 

62151

102709

జూన్ 

 

90918

92849

జులై 

 

87422

 

ఆగష్టు 

 

86449

 

సెప్టెంబర్ 

 

95480

 

అక్టోబర్ 

 

105155

 

నవంబర్ 

 

104963

 

డిసెంబర్ 

 

115174

 

జనవరి 

 

119875

 

ఫిబ్రవరి 

 

113143

 

మర్చి 

97590

123902

 

 

****



(Release ID: 1737078) Visitor Counter : 182


Read this release in: English , Urdu , Marathi , Punjabi