వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాది సంబంధిత కాలంతో పోల్చితే ఈ సారి ఎంఎస్‌పిలో 13.54% ఎక్కువ వరిని సేకరించారు

ప్రస్తుత కెఎంఎస్‌లో ఇప్పటివరకు 688.02 ఎల్‌ఎంటి వరిని సేకరించారు

పంజాబ్ ఒక్కటే 202.82 ఎల్ఎంటిని అందించింది. మొత్తం సేకరణలో ఇది 29.47%

సుమారు 101.45 లక్షల మంది రైతులు ఎంఎస్పి విలువ ద్వారా రూ.1,29,898.14 ప్రయోజనం పొందారు.

రూ.2,054.15 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన పప్పుధాన్యాలు, నూనె గింజలను ప్రభుత్వ సంస్థలు సేకరించాయి

Posted On: 25 MAR 2021 7:34PM by PIB Hyderabad

గత సీజన్లలో చేసినట్లుగా ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2020-21లో ప్రస్తుత ఎంఎస్పి పథకాల ప్రకారం ప్రభుత్వం రైతుల నుండి ఖరీఫ్ 2020-21 పంటలను సేకరిస్తోంది.

ఖరీఫ్ 2020-21 కోసం వరి సేకరణ సజావుగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ & కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు త్రిపురలలో 24.03.2021 వరకు 688.02 ఎల్‌ఎమ్‌టిల వరిని కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది 605.94 ఎల్‌ఎమ్‌టి కొనుగోలుతో పోలిస్తే ఇది 13.54% పెరుగుదల. 688.02 ఎల్‌ఎమ్‌టి మొత్తం కొనుగోలులో పంజాబ్ ఒక్కటే 202.82 ఎల్‌ఎమ్‌టిని అందించింది. ఇది మొత్తం సేకరణలో 29.47%.

ఇప్పటికే కొనసాగుతున్నకెఎంస్‌ సేకరణ కార్యకలాపాల నుండి సుమారు 101.45 లక్షల మంది రైతులు ఎంఎస్పి విలువ ప్రకారం రూ.1,29,898.14 ప్రయోజనం పొందారు.

ఇంకా రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతిపాదన ఆధారంగా ధరల మద్దతు పథకం (పిఎస్‌ఎస్) కింద తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 & రబీ మార్కెటింగ్ సీజన్ 2021 యొక్క 107.08 ఎల్ఎంటి పప్పుధాన్యాలు మరియు ఆయిల్ సీడ్స్ కొనుగోలుకు అనుమతి లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టి కొప్రా (శాశ్వత పంట) సేకరణకు అనుమతి ఇచ్చారు. ఇతర రాష్ట్రాలు / యుటిల  పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు కొప్రాలను పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలను స్వీకరించినప్పుడు కూడా ఆమోదం లభిస్తుంది. తద్వారా ఈ పంటల యొక్క ఎఫ్‌ఏక్యూ గ్రేడ్ సేకరణ 2020-21 సంవత్సరానికి  హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే రైతులు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సంబంధిత రాష్ట్రాలు / యుటిలలో నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ నుండి నేరుగా పొందవచ్చు.

ఖరీఫ్ 2020-21 & రబీ 2021 కింద  24.03.2021 వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా  సేకరించిన 3,85,433.12 మెట్రిక్ టన్నుల పెసర, మినప, కంది, గ్రామ్, వేరుశనగ పాడ్లు మరియు సోయాబీన్లను ఎంఎస్పి విలువ రూ .2,054.15 కోట్లుగా ఉంది. తద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రాప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 2,27,644 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది.

అదేవిధంగా 24.03.2021 వరకు రూ .52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొప్రా (శాశ్వత పంట) సేకరణ  కర్ణాటక, తమిళనాడులలోని 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి  పప్పుధాన్యాలు మరియు నూనె గింజల రాక ఆధారంగా సంబంధిత రాష్ట్ర /యుటి ప్రభుత్వాలు సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్పి ఆధ్వర్యంలో సీడ్ కాటన్ (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. 24.03.2021 వరకు రూ .26,719.51 కోట్ల విలువైన 91,89,378 కాటన్ బేల్స్ ద్వారా 18,86,498 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

****



(Release ID: 1707711) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi , Punjabi