ఆయుష్

నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు

प्रविष्टि तिथि: 15 MAR 2021 3:54PM by PIB Hyderabad

 

ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్ మరియు మూలికా పరిశ్రమ సంస్థలతో ఎన్‌ఎంపిబి ఒక అవగాహన ఒప్పందం

కుదుర్చుకుంది:


        1. ఆయుర్వేద ఔషధ తయారీదారుల సంస్థ (AMMOI)
        2. ఆయుర్వేద ఔషధ తయారీ సంఘం (ADMA)
        3. అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ (AMAM)
        4. అసోసియేషన్ ఆఫ్ హెర్బల్ అండ్ న్యూట్రాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఇండియా (AHNMI)
   5. పిహెచ్‌డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI)
        6. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI)

నేషనల్ బయోడైవర్శిటీ అథారిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం, జీవ వనరుల ప్రాప్యతను నియంత్రించడానికి మరియు /కొన్ని కార్యకలాపాలకు

అనుబంధ సమాచారం నియంత్రించడానికి భారత ప్రభుత్వం జీవ వైవిధ్య చట్టం, 2002 ను అమలు చేసింది. జీవ వనరుల వినియోగదారుడు

ప్రయోజనాలను సరసమైన మరియు సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఆయుష్ పరిశ్రమ యజమానులు / తయారీదారులు / ఎగుమతిదారులు మొదలైనవారు ఔషధ మొక్కల పెంపకంలో తిరిగి కొనుగోలు

ఒప్పందం మరియు ముందుగా నిర్ణయించిన ధరతో పాటు వాల్యూమ్‌తో పాల్గొంటారు. రైతులు / సమూహాలు మరియు పరిశ్రమ

యజమానులు మొదలైన పార్టీలకు అంగీకరించే నిబంధనలపై సాగు వ్యయాన్ని కూడా వారు పంచుకుంటారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం జాతీయ ఆయుష్ మిషన్ (నామ్) యొక్క కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేస్తోంది. గుర్తించబడిన క్లస్టర్

/ జోన్లలో ప్రాధాన్యత కలిగిన ఔషధ మొక్కల పెంపకానికి తోడ్పడే ఎన్‌ఏఎం పథకం యొక్క ‘మెడిసినల్ ప్లాంట్స్’ భాగం కింద, ఎంచుకున్న

రాష్ట్రాల జిల్లాలలో మరియు దేశవ్యాప్తంగా మిషన్ మోడ్‌లో అమలు చేయబడుతుంది. పథకం మార్గదర్శకాల ప్రకారం, దీనికి మద్దతు

అందించబడుతుంది:

        1. రైతు భూమిలో ప్రాధాన్యత కలిగిన ఔషధ మొక్కల పెంపకం.
        2. నాణ్యమైన మొక్కలను పెంచడానికి మరియు సరఫరా చేయడానికి అవసరమైన సహకారంతో నర్సరీల ఏర్పాటు.
        3. ఫార్వర్డ్ లింకేజీలతో పంటకోత నిర్వహణ.
        4. ప్రాథమిక ప్రాసెసింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు మొదలైనవి.

 ఈ పథకం కింద, రైతు భూమిలో 140 ప్రాధాన్యత గల ఔషధ మొక్కలను సాగు చేయడానికి 30%, 50% మరియు 75% ఖర్చుతో సబ్సిడీ

ఇవ్వబడుతుంది.

మంచి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ (ఎన్‌ఎంపిబి)

నవంబర్ 22, 2017 న 'వాలంటరీ సర్టిఫికేషన్ స్కీమ్‌ ఫర్ మెడిసినల్‌ ప్లాంట్స్‌ ప్రొడ్యూస్‌'(విసిఎస్ఎంపిపి) పథకాన్ని ప్రారంభించింది. ఈ

పథకం ఔషధ మొక్కలలో ఫీల్డ్ కలెక్షన్ ప్రాక్టీసెస్(జిఎఫ్‌సిపి)పెంపొందిస్తుంది.  దేశంలో ధృవీకరించబడిన నాణ్యమైన ఔషధ మొక్కల ముడి

పదార్థాల లభ్యతను పెంచుతుంది మరియు వాటి ఎగుమతిని పెంచుతుంది. తద్వారా ప్రపంచ మూలికల ఎగుమతిలో భారతదేశ వాటాను

పెంచుతుంది.


కేంద్ర సహాయ మంత్రి (ఆయుర్వేద, యోగా & ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి మంత్రిత్వ శాఖ), ఎస్‌హెచ్‌. కిరెన్ రిజిజు

(అదనపు ఛార్జ్) ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1704982) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu