ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోల్‌కతాలో ఆదాయ పన్ను విభాగం తనిఖీలు

Posted On: 11 MAR 2021 12:43PM by PIB Hyderabad

కోల్‌కతాకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో ఆదాయ పన్ను అధికారులు బుధవారం సోదాలు జరిపారు. కమీషన్‌ తీసుకుని ఇతరుల నగదును నిందితులు నిర్వహించేవారు. ఆదాయ పన్ను అధికారులకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు ఈ తనిఖీలు జరిగాయి. 

    సరైన పత్రాలు లేని రూ.121.50 లక్షలను ఈ సోదాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

 

***
 



(Release ID: 1704132) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Hindi , Bengali