వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గత సంవత్సరం ఇదే సేకరణ కాలంతో పోల్చినప్పుడు 15.30% అదనంగా ధాన్యం సేకరణ
ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజను (కెఎంఎస్)లో 645.10 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ ఎం టి) ధాన్యం సేకరణ
కెఎంఎస్ లో సేకరణ కార్యకలాపాల ద్వారా దాదాపు 92.86 లక్షల మంది ధాన్యం రైతులకు ప్రయోజనం
ప్రభుత్వం తమ నోడల్ ఏజెన్సీల ద్వారా 3,09,198.87 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలను సేకరించింది
రూ. 26,667.21 కోట్ల విలువైన 91,43,791 పత్తి బేళ్ళను సేకరించగా 18,92,818 మంది రైతులకు ప్రయోజనం కలిగింది
Posted On:
17 FEB 2021 5:55PM by PIB Hyderabad
గత సంవత్సరాల్లో పంట సీజన్ల మాదిరిగానే ప్రభుత్వం 2020-21 ఖరీఫ్ పంటలను కూడా జరుగుతున్న 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజనుకు రైతుల నుంచి ప్రస్తుతము అమలులో ఉన్న కనీస మద్దతు ధర స్కీము ప్రకారం సేకరణ కోనసాగిస్తున్నది.
ధాన్యం సేకరణ సాఫీగా సాగుతోంది. ఖరీఫ్ 2020-21 పంటకాలానికి పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ & కాశ్మీర్ , కేరళ , గుజరాత్ , ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర , బీహార్, ఝార్ఖంఢ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు త్రిపుర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ధాన్యం సేకరణ చురుకుగా కొనసాగింది. 2021 ఫిబ్రవరి 16వ తేదీ వరకు 645.10 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటి) వరి ధాన్యం కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఇదే సమయంలో చేసిన 559.46 ఎల్ ఎం టిల ధాన్యంతో పోల్చితే ఇది 15.30 % ఎక్కువ. ఈ ఏడాది కొనుగోలు చేసిన 645.10 ఎల్ ఎం టిలలో ఒక్క పంజాబ్ నుంచి మాత్రమే 202.82 ఎల్ ఎం టిలు సేకరించారు. ఇది మొత్తం సేకరణలో 31.44 %.
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజను సేకరణలో ఇప్పటివరకు 92.86 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. సేకరించిన ధాన్యం ఎంఎస్పీ విలువ రూ. 121796.64 కోట్లు.
అంతేకాకుండా ధరల మద్దతు స్కీము (పిఎస్ఎస్) కింద ఖరీఫ్ మార్కెటింగ్ సీజను 2020లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా , రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు 51.92 ఎల్ ఎం టిల పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల సేకరణకు అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల నుంచి 1.23 ;లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి (ఏడాది పొడవునా ఉండే) సేకరణకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు 2020-21రబీ మార్కెటింగ్ సీజనుకు గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల నుంచి 22.55 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజలు మరియు కొబ్బరి సేకరణకు ప్రతిపాదనలు అందినట్లయితే ధరల మద్దతు స్కీము (పిఎస్ఎస్) ప్రకారం 2020-21 సంవత్సరానికి ప్రకటించిన ఎమ్మెస్పీ ప్రకారం నమోదు చేసుకున్న రైతుల నుంచి నేరుగా సేకరణకు ఆమోదం తెలుపడం జరుగుతుంది. ఒకవేళ ఆయా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రకటిత సీజన్లో మార్కెట్ ధర తగ్గినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సేకరణ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు సేకరణ జరుపుతాయి.
తమిళనాడు, కర్ణాటక ,మహారాష్ట్ర, గుజరాత్ , హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 1,67,678 మంది రైతుల నుంచి రూ. 1665.18 కోట్ల విలువైన కనీస మద్దతు ధర చెల్లించి కేంద్రప్రభుత్వం తమ నోడల్ ఏజెన్సీల ద్వారా 16-02-2021 వరకు 3,09,198.87 మెట్రిక్ టన్నుల పెసర్లు, నినుములు, కందులు, వేరుశనగ కాయలు మరియు సోయాబీన్ సేకరించడం జరిగింది.
అదేవిధంగా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరిని (ఏడాది పొడవునా ఉండే) రూ. 52.40 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించి 16-02-2021 వరకు సేకరించడం జరిగింది. అనేక ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలలో కొబ్బరి, మినుముల మార్కెట్ ధరలు ఎమ్మెస్పీకి పైన పలుకుతున్నాయి. పప్పుధాన్యాలు మరియు నూనె గింజల పంట రాకకు అనుగుణంగా ఆయా తేదీల నుంచి సేకరణ ప్రారంభించడానికి ఆయా రాష్ట్ర / కేంద్రపాలిత ప్రభుత్వాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , ఒడిశా మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఎంఎస్పీ ప్రకారం పత్తిగింజల (పత్తి) సేకరణ పనులు సాఫీగా సాగుతున్నాయి. 16-02-2021 వరకు 91,43,791 బేళ్ళ పత్తిని సేకరించడం జరిగింది సేకరించిన పత్తి విలువ రూ. 26,667.21 కోట్లు. ఈ సేకరణ వల్ల 18,92,818 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
***
(Release ID: 1699075)