పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భారతదేశానికి, ఫిలిప్పీన్స్ కు మధ్య సవరించిన వైమానిక సేవల ఒప్పందం పై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
प्रविष्टि तिथि:
23 DEC 2020 4:44PM by PIB Hyderabad
భారతదేశానికి, ఫిలిప్పీన్స్ కు మధ్య సవరించిన వైమానిక సేవల ఒప్పందం పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలిపింది.
ఈ సవరించిన వైమానిక సేవల ఒప్పందం రెండు దేశాల మధ్య పౌర విమానయాన సంబంధాలలో ఒక ముఖ్యమైన ఘటన గా నిలవనుంది. ఇది ఇరు పక్షాలకు మధ్య ఎలాంటి అంతరాయం ఎదురవని, ఇప్పటికంటే ఎక్కువ గా విమానాల రాక పోకల కు అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. దీని ద్వారా మెరుగైన భద్రత కు, సురక్ష కు పూచీ లభించడం తో పాటు, రెండు దేశాల వైమానిక సంస్థలకు వాణిజ్య సరళి అవకాశాలు కూడా అందుబాటు లోకి రాగలవు. ఈ ఒప్పందం తో రెండు దేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడి, పర్యటన, సాంస్కృతిక ఆదాన- ప్రదానాలు మరింత ఎక్కువ గా చోటు చేసుకొనేందుకు అవకాశం ఉంది.
***
(रिलीज़ आईडी: 1683080)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam