రైల్వే మంత్రిత్వ శాఖ
అయోధ్య రైల్వే స్టేషన్ స్థాయి పెంపు, ఆధునీకరణ
Posted On:
18 SEP 2020 5:29PM by PIB Hyderabad
'థార్మిక, సాంస్కృతిక ప్రాధ్యాన్యత గల ప్రాంతాల రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అయోధ్య స్టేషన్ అభివృద్ధి, పరిసరాల అభివృద్ధి' అనే పేరుతో పనులను కేటాయించడం జరిగింది. దీని వ్యయం రూ.104.77 కోట్లు. రూ.20.1 కోట్ల ఖర్చు అయింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేటాయింపు రూ.18.16కోట్లు కాగా, ఆ పనిని మెస్సేర్స్ రైట్స్ లిమిటెడ్ చేపడుతోంది.
పని పరిధిలో కొత్త స్టేషన్ భవనం, రెండు కొత్త ఆధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు, ఉన్న అన్ని ప్లాట్ఫారమ్ల మెరుగుదల, ఇప్పటికే ఉన్న సర్క్యూలేటింగ్ ప్రాంతాల అభివృద్ధి, మెరుగైన సంకేతాలు మొదలైనవి ఉన్నాయి. పని పురోగతిలో ఉంది,2020-2021 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది
ఈ సమాచారం రైల్వే, వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
*****
(Release ID: 1656536)