వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ఆర్ధిక మండళ్లపై కరోనా ప్రభావం
Posted On:
16 SEP 2020 4:29PM by PIB Hyderabad
ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ప్రత్యేక ఆర్ధిక మండళ్ల (ఎస్.ఈ.జెడ్.) నుండి వాణిజ్య ఎగుమతులకు సంబంధించి ఒక తులనాత్మక ప్రకటన ఈ విధంగా ఉంది :
వాణిజ్య ఎగుమతులు
(ఏప్రిల్ - ఆగష్టు, 2020)
|
గత ఏడాది ఇదే కాలంలో
వాణిజ్య ఎగుమతులు
(ఏప్రిల్ - ఆగష్టు, 2019)
|
రూ. 81,481 కోట్లు
|
రూ. 1,30,129 కోట్లు
|
అయితే, సేవల ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ 2020 నుండి ఆగస్టు 2020 వరకు 9 శాతం వృద్ధిని నమోదుచేశాయి.
సెజ్ డెవలపర్లు / కో-డెవలపర్లు / యూనిట్లను సులభతరం చేయడానికి, కోవిడ్ -19 వ్యాప్తి సమయంలో ఈ క్రింది చర్యలు తీసుకున్నారు:
31. వివిధ నివేదికలు దాఖలు చేసే చివరి తేదీని 31.03.2020 నుండి 30.06.2020 కు పొడిగించారు. ఉదాహరణకు: త్రైమాసిక ప్రగతి నివేదిక (క్యూ.పి.ఆర్.), సాఫ్ టెక్స్ ఫారం మరియు వార్షిక పనితీరు నివేదికలు (ఏ.పి.ఆర్.).
32. కోవిడ్ మహమ్మారి సమయంలో, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా, కాలపరిమితితో గడువు ముగియడానికి షెడ్యూల్ చేయబడిన అనుమతుల పత్రం (ఎల్.ఓ.ఏ.ఎస్) మరియు ఇతర నివేదికలు విస్తరించడానికి అభివృద్ధి కమిషనర్లు (డి.సి. లు) ఆదేశించారు. అంతేకాకుండా, ఈ అంతరాయం ఉన్న కాలంలో చెల్లుబాటు గడువు ముగిసినందున డెవలపర్ / కో-డెవలపర్ / యూనిట్లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేదని నిర్ధారించడానికి ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా పొడిగింపును మంజూరు చేయలేని సందర్భాల్లో డి.సి.లు ఆదేశించారు. మరియు 30.06.2020 వరకు ఎటువంటి పక్షపాతం లేకుండా గడువు తేదీ యొక్క తాత్కాలిక పొడిగింపు / వాయిదా ఇవ్వబడింది.
* ఐ.టి. / ఐ.టి.ఈ.ఎస్. యూనిట్లతో పాటు, సెజ్ లలో ఉన్న ఐ.టి. / ఐ.టి.ఈ.ఎస్. కాని యూనిట్లు కూడా ఇంటి నుండి పని చేయడానికి సెజ్ నుండి వెలుపలకు డెస్కు టాప్ / ల్యాప్ టాప్ తీసుకు వెళ్ళడానికి అనుమతించబడ్డాయి. లాక్ డౌన్ ఉన్నప్పటికీ సానుకూల వృద్ధిని నమోదు చేయడానికి ఇది ముఖ్యంగా ఐ.టి / ఐ.టి.ఈ.ఎస్. రంగంలో ఎగుమతులకు అవకాశం కల్పించింది.
1. ఆమోద కమిటీ పోస్ట్-ఫాక్టో ధృవీకరణకు లోబడి మాస్కులు, శానిటైజర్, గౌన్లు మరియు ఇతర రక్షణ / నివారణ ఉత్పత్తులు / సాధన వంటి ముఖ్యమైన వస్తువులను తయారుచేసేటప్పుడు బ్రాడ్-బ్యాండింగ్ కోసం అధికారాన్ని అభివృద్ధి కమిషనర్లకు అప్పగించారు.
2. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ సెజ్ లోని యూనిట్లకు లీజు అద్దె పెంపు ఉండకూడదని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
3. మొదటి త్రైమాసికంలో లీజు అద్దె చెల్లింపును 2020 జూలై, 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ సెజ్ లోని అన్ని యూనిట్లకు వాయిదా వేశారు. అంతేకాకుండా, 2020 అక్టోబర్ 1వ తేదీ నుండి ఆరు సమాన వాయిదాలలో లీజు అద్దె యొక్క మొదటి రెండు త్రైమాసిక వాయిదాలను క్లియర్ చేయడానికి యూనిట్లను అనుమతించాలని అభివృద్ధి కమిషనర్లను అభ్యర్థించారు.
* అభివృద్ధి కమిషనర్లు తమ మండలాల్లో ఇలాంటి సహాయక చర్యలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ / ప్రైవేట్ సెజ్ల డెవలపర్లలకు సూచించాలని కోరారు.
ఎలక్ట్రానిక్ విధానంలో పని సంస్కృతిని అవలంబించడానికి మరియు ఔషధాల తయారీ, అవసరమైన వస్తువులు మొదలైన వాటితో సహా యూనిట్లకు అవసరమైన సహాయాన్ని అందించడానికి మరియు కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాలని డి.సి.లు అందరికీ సూచించడమయ్యింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
*****
(Release ID: 1655452)