శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లకు త్వ‌ర‌లోనే కిట్‌ రూపొందించ‌నున్న సిసిఎంబి

కోవిడ్ -19 వైర‌స్ కల్చ‌ర్‌కు ప్ర‌య‌త్నిస్తున్న సిసిఎంబి

Posted On: 25 MAR 2020 11:48AM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హమ్మారిని నియంత్రించేందుకు ప్రాథ‌మిక ద‌శ‌లోనే పెద్ద ఎత్తున ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీనివ‌ల్ల కోవిడ్ మ‌హమ్మారిని ప్రారంభంలోనే గుర్తించి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌వ‌చ్చ‌ని అంటోంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పిలుపునకు అనుగుణంగా  , సెంట‌ర్ ఫ‌ర్ సెల్యులార్‌, మాలుక్యులార్ బ‌యాల‌జీ (సిసిఎంబి) త‌క్కువ ఖ‌ర్చుతో , ఖ‌చ్చిత‌మైన ఫ‌లితాలు క‌నుగొనే విధంగా వ్యాధి నిర్ధార‌క కిట్‌ను ఎక్కువ‌మందికి అందుబాటులోకి తెచ్చేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తోంది.

అంతా స‌జావుగా సాగితే రెండు , మూడు వారాల‌లో మంచి కిట్‌లు రూపొంద‌గ‌ల‌మ‌న్న విశ్వాసాన్ని సిసిఎంబి డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.కె. మిశ్రా వ్య‌క్తం చేశారు. ఈ కిట్‌లు నాణ్య‌మైన‌విగా , ఖ‌చ్చిత‌మైన ఫ‌లితాలు ఇచ్చేవిగా ఉండడం అత్యంత ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ కిట్‌లు నూరు శాతం ఫ‌లితాలు ఇచ్చిన‌ప్పుడే వాటిని ఆమోదిస్తామ‌న్నారు.
 అలాగే వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌ ఖ‌ర్చు గురించి కూడా తాము ఆలోచిస్తున్నామ‌ని, ఇది వెయ్యి ర‌పాయ‌ల‌కంటే త‌క్కువ ఉండాల‌న్న‌ది త‌మ ఆలోచ‌న అని చెప్పారు.  400-500 రూపాయ‌ల చౌక కిట్స్ గురించిన ఆలోచ‌న కూడా ఉంద‌ని , అయితే ప్ర‌స్తుతం తాము ఇందుకు హామీ ఇవ్వ‌లేమ‌ని ఆయ‌న చెప్పారు.అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది ప్రామాణీకృత కిట్ అని  డాక్ట‌ర్ మిశ్రా చెప్పారు.

అలాగే కోవిడ్‌-19 వైర‌స్ ను క‌ల్చ‌ర్ చేసేందుకు కూడా సిసిఎంబి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్టు డాక్ట‌ర్ మిశ్రా తెలిపారు. ఇందుకు సిసిఎంబిలో స‌దుపాయాలు ఉన్నాయ‌ని , ఇందుకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి కూడా వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పారు.  వైర‌స్ క‌ల్చ‌ర్ ప్రారంభించేందుకు తాము ఇంకా శాంపిళ్లు, కిట్‌ అందుకోవ‌ల‌సి ఉంద‌ని డాక్ట‌ర్ మిశ్రా  తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలోప్ర‌భుత్వం నిర్దేశించిన 5 టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. సిసిఎంబి 25 మందికి శిక్ష‌ణ ఇచ్చింది. దీనితో వీరు ఈ కేంద్రాల‌లో ప‌రీక్ష‌లు చేయ‌డానికి వీలు క‌లుగుతుంది.
కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల స‌దుపాయం హైద‌రాబాద్‌లోని నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌), గాంధీ ఆస్ప‌త్రి, ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి, స‌ర్ రోనాల్డ్ రోస్ ఇన్ స్టిట్యూట్  ఆఫ్ ట్రాపిక‌ల్ అండ్ క‌మ్యూనిక‌బుల్ డిసీజెస్ లేదా ఫీవ‌ర్ ఆస్ప‌త్రి, అలాగే వ‌రంగల్ ఆస్ప‌త్రిలో ఉంది. సెంట‌ర్ ఫ‌ర్ డిఎన్ఎ ఫింగ‌ర్ ప్రింటింగ్ అండ్ డ‌యాగ్న‌స్టిక్స్ (సిడిఎఫ్‌డి) కూడా ఈ కేంద్రాల జాబితాలో చేర‌నుంది.

 ఇక ఈ వైర‌స్‌ను ఎదుర్కోవ‌డానికి వాక్సిన్‌, ఔష‌ధాలు త‌యారు చేయ‌డం మ‌రో అంశం. ప్ర‌స్తుతానికి  వాక్సిన్ లేదా ఔష‌ధాల అభివృద్ధిపై తాము ప‌నిచేయ‌డం లేద‌ని డాక్ట‌ర్ మిశ్రా చెప్పారు.



(Release ID: 1608280) Visitor Counter : 135