రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రష్యాకు అధికారిక పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్


భారత్-రష్యా రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచటమే ఈ పర్యటన ఉద్దేశం

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 10:23AM by PIB Hyderabad

భారత సైన్యాధిపతి (సీఓఏఎస్జనరల్ ధీరజ్ సేత్, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు  రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారుఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్నిసైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యం.

ఈ పర్యటనలో భాగంగా సైన్యాధిపతికి లాంఛనంగా గార్డ్ ఆఫ్ హానర్ గౌరవం లభిస్తుందిఅలాగే మాస్కోలోని 'అమర జవానుల స్మారకంవద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారువృత్తిపరమైన సైనిక సహకారంశిక్షణతో సహా పరస్పర ఆసక్తిగల వివిధ అంశాలపై రష్యా సైనిక దళాల కమాండర్-ఇన్-చీఫ్ కల్నల్ జనరల్ ఆండ్రీ నికోలాయెవిచ్ మోర్ద్విచెవ్‌తో చర్చలు జరుపుతారు.

మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, రష్యా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులతో సీఓఏఎస్ సమావేశమవుతారుఈ సమావేశంలో రక్షణ పరిశ్రమసేకరణల బాధ్యతలు నిర్వర్తించే డిప్యూటీ రక్షణమంత్రి శ్రీ వాసిలీ సెర్గెవిచ్ ఓస్మాకోవ్ కూడా ఉంటారుసమకాలీన సైనిక పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవటానికి రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవటానికి ఈ సమావేశాలు చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయి.

ఈ పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను కూడా జనరల్ ధీరజ్ సేత్ సందర్శిస్తారు. అక్కడ మిఖైలోవ్‌స్కాయా మిలిటరీ ఆర్టిలరీ అకాడమీని సందర్శించిఅకాడమీని నడిపించే నాయకులనుఅధ్యాపక బృందాన్ని కలుసుకుంటారు.

నిరంతర సైనిక దౌత్యం, సైనిక సంబంధాలకు ఇరుదేశాలు ఇస్తున్న ప్రాముఖ్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందిఈ చర్చలు సైనిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తాయనిభారత్-రష్యాల మధ్య రక్షణ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నారు.


(రిలీజ్ ఐడి: 2310746) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati