రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ దళాల కోసం సుమారు రూ.1.10 లక్షల కోట్ల మూలధన సమీకరణ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 4:15PM by PIB Hyderabad
రక్షణమంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సెప్టెంబర్ 07, 2026న జరిగిన రక్షణ సేకరణ మండలి (డీఏసీ) సమావేశంలో దాదాపు రూ.1,10,000 కోట్ల అంచనా వ్యయంతో రక్షణ దళాల వివిధ సమీకరణ ప్రతిపాదనలకు అవసరాన్ని అంగీకరించి (ఏఓఎన్) అంటే... తాత్కాలిక పరిపాలనాపరమైన ఆమోదం లభించింది. ఇందులో భాగంగా భారత సైన్యం కోసం రసాయన, జీవ, రేడియోలాజికల్, అణు (సీబీఆర్ఎన్) శోధన వాహనాలు, హై మొబిలిటీ వెహికల్స్ (హెచ్ఎంవీ), సెల్ఫ్-ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్స్ (ఎంఎంఎల్), తేలికపాటి అత్యాధునిక హెలికాప్టర్లు (ఏఎల్హెచ్), యుద్ధ ట్యాంకులు, సర్వత్రా బ్రిడ్జ్ సిస్టమ్ కొనుగోలుకు ఆమోదం లభించింది.
సీబీఆర్ఎన్ ఏజెంట్లతో కలుషితమైన ప్రాంతాలను కనిపెట్టేందుకు, విశ్లేషించటానికి, పర్యవేక్షించటానికి, గుర్తించటానికి వీలుగా సీబీఆర్ఎన్ శోధన వాహనాలుంటాయి. కఠినమైన భూభాగాల్లో కార్యాచరణ సామర్థ్యాలను, రవాణా మద్దతును, చలనశీలతను హెచ్ఎంవీలు మెరుగుపరుస్తాయి. ఎంఎంఎల్లు కావలసిన కార్యాచరణ సామర్థ్యాన్ని అందిస్తాయి. భారత సైన్య వైమానిక దళం కోసం అన్ని భూభాగాల్లో, కార్యాచరణ పరిస్థితుల్లో సంక్లిష్టమైన మిషన్లను ఏఎల్హెచ్లు నిర్వహిస్తాయి. వివిధ భూభాగాల్లో ఆపరేషన్ల సమయంలో యుద్ధ విభాగానికి సంయుక్త మార్గాలను అందించేందుకు యుద్ధ ట్యాంకులు, బ్రిడ్జ్ సిస్టమ్ ఉపయోగపడతాయి.
భారత నౌకాదళం కోసం ఆరుద్ర రాడార్ల సేకరణ, సముద్ర గ్యాస్ టర్బైన్ల (ఎంజీటీ) రూపకల్పన, అభివృద్ధికి ఏఓఎన్ ఆమోదం లభించింది. వివిధ నేవల్ ఎయిర్ స్టేషన్లలో ప్రస్తుతమున్న ఎయిర్ రూట్ నిఘా రాడార్ల స్థానాన్ని ఆరుద్ర రాడార్ భర్తీ చేస్తుంది. యుద్ధనౌక ప్రొపల్షన్ వ్యవస్థ అయిన ఎంజీటీ ద్వారా విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం తగ్గుతుంది.
భారత వైమానిక దళం కోసం యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా యుద్ధ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన వివిధ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. గ్రౌండ్-బేస్డ్ మల్టీ-పర్పస్ జామర్ ( జీబీఎంపీజే)ను కొనుగోలు చేసేందుకు, డిఫెన్స్ ఫోర్సెస్ సెక్యూర్ యాక్సెస్ కార్డ్ (డీఈఎఫ్ఎస్ఏసీ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం లభించింది. శత్రు రాడార్లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన జామింగ్ను జీబీఎంపీజే అందిస్తుంది. ప్రస్తుతమున్న కాగితం ఆధారిత గుర్తింపు కార్డులు, పాసులు, పర్మిట్ల స్థానంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత స్మార్ట్కార్డ్ వ్యవస్థను డీఈఎఫ్ఎస్ఏసీ ప్రవేశపెడుతుంది.
మంజూరైన మొత్తం ఏఓఎన్ల్లో సుమారు 98 శాతం భారత పరిశ్రమల నుంచే కొనుగోళ్లు జరుగుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2307611)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11