ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో సత్య నికేతన్లో భవనం కూలి ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 8:24PM by PIB Hyderabad
ఢిల్లీలో సత్య నికేతన్లో ఓ భవనం కూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.
ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. అధికారులు ఘటన స్థలంలో చురుకుగా పనిచేస్తున్నారనీ, ఘటనతో ప్రభావితులైన వారికి సహాయాన్ని అందిస్తున్నారనీ ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా తెలిపింది:
‘‘ఢిల్లీలోని సత్య నికేతన్లో ఓ భవనం కూలిన ఘటన బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు ఘటన స్థలంలో పనిచేస్తున్నారు. ఘటనతో ప్రభావితులైన వారికి సహాయాన్ని అందిస్తున్నారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.
***
(రిలీజ్ ఐడి: 2307358)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam