రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ దళాల్లో తొలి (వైద్యేతర) మహిళా టూ-స్టార్ అధికారిగా చరిత్ర సృష్టించిన ఏవీఎం శక్తి శర్మ
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 6:01PM by PIB Hyderabad
భారత వైమానిక దళ చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ భారత రక్షణ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ (తత్సమాన) హోదాను పొందిన తొలి మహిళా అధికారిణి (వైద్యేతర విభాగం) అయ్యారు. 01 సెప్టెంబర్ 2026న, ఆమె ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)గా బాధ్యతలు స్వీకరించారు.
1994 జూన్ 18న ఐఏఎఫ్ విద్యా విభాగానికి నియమితులైన ఏవీఎం శక్తి శర్మ... శిక్షణ సంస్థలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్ వంటి విభిన్న బాధ్యతల్లో పనిచేసిన అపార అనుభవంతో ఈ నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. తన కెరీర్ మొత్తంలో విద్యా, వ్యూహాత్మక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి ఐఐటీ కాన్పూర్, పూణే విశ్వవిద్యాలయంలో ఐఏఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన సహా, కీలకమైన సంస్థాగత కార్యక్రమాలకూ ఆమె నాయకత్వం వహించారు. కపుర్తలాలోని సైనిక్ పాఠశాలకు ప్రిన్సిపాల్గా పనిచేస్తూ, త్రివిధ దళాల నుంచి ఒక సైనిక్ పాఠశాలను కమాండ్ చేసిన తొలి మహిళా అధికారిగానూ ఆమె చరిత్ర సృష్టించారు.
ఈ చరిత్రాత్మక విజయం భారత రక్షణ దళాల మహిళా అధికారుల ప్రస్థానంలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె... "అత్యున్నత శక్తి, సామర్థ్యాలు, అచంచల సంకల్పంతో భారత గగనతలాన్ని రక్షించాలనే కర్తవ్యం"తో తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2305849)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6