ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎన్ఎంఎల్సీ ద్వారా విశాఖపట్నంలో ఆర్ఐఎన్ఎల్ కు చెందిన 459 భూభాగాల ఈ - వేలం
పారదర్శక విధానం ద్వారా హెచ్బి కాలనీ, ఆటో నగర్లలో విస్తరించి ఉన్న 93,572.21 చదరపు గజాల అత్యంత విలువైన భూముల ఈ - వేలం
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 7:11PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి (డీపీఈ) చెందిన కేంద్ర ప్రభుత్వ పూర్తి యాజమాన్య సంస్థ… నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎంఎల్సీ) ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ - ఆర్ఐఎన్ఎల్) చెందిన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన భూముల ఈ-వేలాన్ని ప్రకటించింది.
మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 459 భూభాగాల (ల్యాండ్ పార్శిల్స్) ను ఎలాంటి వివాదాలు, హక్కు దావాలు లేని (ఎన్కంబరెన్స్-ఫ్రీ) ప్రభుత్వ టైటిల్స్ తో పూర్తిస్థాయి విక్రయం కోసం ప్రతిపాదిస్తున్నారు. ఇందులో వ్యక్తిగత ప్లాట్ల పరిమాణం సుమారు 128.94 చదరపు గజాల నుంచి 2,728 చదరపు గజాల వరకు ఉంది. ఈ వేలం ప్రక్రియను సులభతరం చేసేందుకు క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్) ను ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్గా నియమించారు.
వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన భూముల వివరాలు
-
హెచ్బి కాలనీ, మద్దిలపాలెం: అన్ని రకాల పౌర, సామాజిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందిన పట్టణ నివాస ప్రాంతంలో... 456 నివాస ఎంఐజి/ఎల్ఐజి ప్లాట్లు ఉన్నాయి. ఈ స్థలాలకు 24 నుంచి 60 అడుగుల కాంక్రీట్ ప్రవేశ రహదారులు ఉండటమే కాకుండా, ఇవి జాతీయ రహదారి 16 కి అత్యంత సమీపంలో ఉన్నాయి.
-
ఆటో నగర్, గాజువాక: బ్లాక్ 2 లో జాతీయ రహదారి 16 కి 0.5 కిలోమీటర్ల దూరంలో వాణిజ్య, రవాణా/ అవసరాలకు అనువుగా ఉండే 2,728 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన అత్యంత విలువైన స్థలంతో పాటు, బ్లాక్ 3 లో రెండు నివాస ప్లాట్లు ఉన్నాయి.
పారదర్శక ఈ-వేలం ప్రక్రియ
పోటీతత్వంతో కూడిన ఈ బిడ్డింగ్ ప్రక్రియను రైల్టెల్ ఈ - నివిద ఈ - ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్పై రెండు విడతలుగా… 2026 అక్టోబర్ 12, 2026 అక్టోబర్ 16 తేదీలలో నిర్వహించనున్నారు
ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల బిడ్డర్లు నిర్దేశిత గడువులోగా అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, కేవైసీ పూర్తి చేయాలి. ప్లాట్కు రూ. రెండు లక్షల చొప్పున నిర్ణయించిన అడ్వాన్స్ మనీ డిపాజిట్ సమర్పించాలి.
ఈ-వేలం పోర్టల్, ఆర్ఎఫ్పీ వివరాలు: https://eauction.enivida.com
ప్రభుత్వ ఆస్తుల విలువ నిర్ధారణ
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న అదనపు భూములు, ఇతర ఆస్తులకు క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానం ద్వారా నగదు విలువ (మోనిటైజ్) కట్టే ఎన్ఎల్ఎమ్సీ ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ డిజిటల్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అర్హులైన పెట్టుబడిదారులు, డెవలపర్లు, వ్యక్తిగత భాగస్వాములకు విశాఖపట్నంలో అభివృద్ధి చెందిన, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను సురక్షితంగా సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎంఎల్సీ) గురించి
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు/సంస్థల వద్ద ఉన్న అదనపు భూములు, సాధారణ ఆస్తులకు మానిటైజేషన్ నిర్వహించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం కింద ఏర్పాటైన 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ నేషనల్ ల్యాండ్ మోనిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎంఎల్సీ).
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) గురించి
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కింద పనిచేస్తున్న నవరత్న సంస్థ- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.
***
(రిలీజ్ ఐడి: 2305837)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12