ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రికి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం “ఒలియ్ దరజాలి దోస్తిలిక్”

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2026 5:50PM by PIB Hyderabad

 ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షవ్కత్ మిర్జియోయేవ్ నేడు ఆ దేశ అత్యున్నత విదేశీ పౌర పురస్కారం “ఒలియ్ దరజాలి దోస్తిలిక్” (అత్యున్నత మైత్రీ పురస్కారం)ను నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రదానం చేశారుభారత్‌ఉజ్బెకిస్థాన్‌ మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ప్రధాని చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారువిదేశీ నాయకులకు ఉజ్బెకిస్తాన్ అందించే అత్యున్నత గౌరవం ఇదే.

 

ఈ గౌరవాన్ని స్వీకరించిన ప్రధాని శ్రీ మోదీ.. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయ ప్రజలకు అంకితం చేశారుఇరు దేశాలుసంస్కృతుల మధ్య కొనసాగుతున్న చిరకాల స్నేహానికి ఈ అవార్డు నిదర్శనమని పేర్కొన్నారుఅధ్యక్షుడు మిర్జియోయెవ్‌ తనపై కురిపించిన  ప్రశంసలు.. భారత్‌ఉజ్బెకిస్థాన్‌ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహానికిఉమ్మడి వారసత్వానికి నివాళి అని తెలిపారుప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వాములుగా ఉజ్బెకిస్థాన్‌తో కలిసి పనిచేసే అదనపు బాధ్యతను ఈ గౌరవం భారత్‌పై నిలిపిందని ఆయన పేర్కొన్నారు.

 

“ఒలియ్ దరజాలి దోస్తిలిక్” పురస్కార ప్రదానం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక సంబంధాలనుక్రమంగా విస్తరిస్తున్న భారత్-ఉజ్బెకిస్తాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2304790) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil