ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో ప్రమాదం... ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
08 AUG 2026 11:52AM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో సంభవించిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో జరిగిన ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. ఈ కష్ట సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
(रिलीज़ आईडी: 2296520)
आगंतुक पटल : 3