భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2026 జూలై 10 నాటికి పీఎం-ఈబస్ సేవా పథకం కింద దేశవ్యాప్తంగా 523 ఎలక్ట్రిక్ బస్సులు
प्रविष्टि तिथि:
04 AUG 2026 6:34PM by PIB Hyderabad
2026 జూలై 10 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 38,000 ఈ-బస్సులలో 27,555 ఈ-బస్సులు పీఎం-ఈబస్ సేవా-పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్ఎం) పథకంలో భాగంగా ఉన్నాయి. వీటిలో 10,000 ఈ-బస్సులు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్యూఏ) పీఎం-ఈబస్ సేవా పథకం కింద.. 14,000 ఈ-బస్సులు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) పీఎం- ఈ డ్రైవ్ పథకం కింద.. 3,555 ఈ-బస్సులు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర రవాణా సంస్థల (ఎస్టీయూ) కింద ఉన్నాయి.
2026 జూలై 10 నాటికి పీఎం-ఈబస్ సేవా–పీఎస్ఎం పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 523 ఈ-బస్సులను రంగంలోకి దించారు. పీఎస్ఎం పథకం పరిధిలోకి వచ్చే ఎంఓహెచ్యూఏ అమలు చేస్తోన్న పీఎం-ఈబస్ సేవా పథకం కింద ఒడిశా రాష్ట్రానికి 400 ఈ-బస్సులను కేటాయించారు. అయితే 2026 ఆగస్టు 3 నాటికి ఒక్క బస్సు కూడా సర్వీసులోకి రాలేదు.
భారత్లో అధునాతన వాహన ఉత్పత్తుల (ఏఏటీ) తయారీ సామర్థ్యాలను పెంపొందించడం కోసం వాహన, వాహన కాంపోనెంట్ పరిశ్రమ విషయంలో పీఎల్ఐ పథకాన్ని (పీఎల్ఐ- ఆటో స్కీమ్) 2021 సెప్టెంబరు 23న రూ. 25,938 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ప్రభుత్వం ఆమోదించింది. అన్ని రాష్ట్రాలలో పీఎల్ఐ-ఆటో పథకం అమలు పరిస్థితి కింది విధంగా ఉంది:
|
అంశం
|
31.03.2026 వరకు సంచిత వ్యయం
|
|
పెట్టుబడి (రూ. కోట్లు)
|
44,326
|
|
అదనపు అమ్మకాలు (ఆధార సంవత్సరం 2019-20 ఆర్థిక సంవత్సరం) (రూ. కోట్లు)
|
52,414
|
|
ఉపాధి కల్పన (సంఖ్య)
|
67,820
|
|
పంపిణీ చేసిన ప్రోత్సాహకం (రూ. కోట్లు)
|
2,386.36
|
ఫేమ్ ఇండియా పథకం రెండో దశ 2024 మార్చి 31తో విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ‘ఫేమ్-III’ పేరుతో ఎలాంటి పథకం అమల్లో లేనప్పటికీ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి పీఎం- ఈ డ్రైవ్ (పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించటం కొనసాగుతోంది. ఈ పీఎం ఈ-డ్రైవ్ పథకం రూ. 10,900 కోట్ల మొత్తం బడ్జెట్తో 2024 సెప్టెంబరు 24న నోటిఫై అయింది.
భారతీయ మూలధన వస్తు రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించే పథకం కింద భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఇండస్ట్రీ 4.0'ని ప్రోత్సహించడానికి 4 సమర్థ్ (స్మార్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ హబ్) కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద ఎంహెచ్ఐ ఏర్పాటు చేసిన సమర్థ్ కేంద్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
-
సెంటర్ ఫర్ ఇండస్ట్రీ 4.0 (సీ4ఐ4) ల్యాబ్, పుణె;
-
ఐఐటీడీ-ఏఐఏ ఫౌండేషన్ ఫార్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐఐటీ ఢిల్లీ;
-
ఐ-4.0 ఇండియా, ఐఐఎస్సీ బెంగళూరు;
-
స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డెమో- డెవలప్మెంట్ సెల్, సీఎంటీఐ బెంగళూరు.
ఇంకా 2023 జనవరి నుంచి సమర్థ్ కేంద్రాలు సాధించిన పురోగతి వివరాలు:
-
సందర్శించిన వ్యక్తుల సంఖ్య: 26,372
-
శిక్షణ పొందిన వ్యక్తుల సంఖ్య: 33,751
-
నిర్వహించిన కోర్సులు, శిక్షణ కార్యక్రమాల సంఖ్య: 332
(ఇ): భారత మూలధన వస్తు రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించే పథకం- ఫేజ్ II కింద కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ల సంఖ్యను పెంచే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదు.
***
(रिलीज़ आईडी: 2294641)
आगंतुक पटल : 15