గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీడీయూ-జీకేవై 2.0 పురోగతిని సమీక్షించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్


సకాలంలో అమలు సహా, డిజిటల్ సంస్కరణలూ చేపట్టాలని పిలుపు

కొత్త డిజిటల్ కార్యక్రమాలు, పౌర కేంద్రిత సంస్కరణలతో డీడీయూ-జీకేవై 2.0 అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం

प्रविष्टि तिथि: 04 AUG 2026 7:45PM by PIB Hyderabad

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవైపథకం వివిధ జీవనోపాధి అవకాశాలు కల్పించడం... పేదరిక నిర్మూలన లక్ష్యంగా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎంకింద అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో ఒకటిఉద్యోగ కల్పనతో ముడిపడిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ యువతకు పలు నైపుణ్యాలకు సంబంధించి శిక్షణనివ్వడంవారి సుస్థిర జీవనోపాధిని ప్రోత్సహించడం డీడీయూ-జీకేవై లక్ష్యం.

 

గ్రామీణాభివృద్ధిసమాచార శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సంచార్ భవన్‌లో ఈ రోజు డీడీయూ-జీకేవై అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి సంయుక్త కార్యదర్శి (గ్రామీణ నైపుణ్యాలు-II) శ్రీమతి ఎం.జిజయశ్రీడైరెక్టర్ (నైపుణ్యాలుశ్రీ సంతోష్ కె తివారీఎన్‌ఐసి డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి దీపికా అగర్వాల్ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

 

2014-15లో ప్రారంభమైన ఈ పథకం కింద మొత్తం 18.45 లక్షల మంది గ్రామీణ పేదలకు శిక్షణ అందించారుఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో 12.35 లక్షల మంది వేతనంతో కూడిన ఉపాధిని పొందారుప్రాజెక్టు అమలు సంస్థల (పీఐఏలద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయిఈ కార్యక్రమాన్ని మరింత సమర్థంగాపారదర్శకంగా మార్చడం కోసం 2025లో పథకం మార్గదర్శకాలను సవరించారుడీడీయూ-జీకేవై 2.0 కోసం... పీఐఏ ఆన్‌బోర్డింగ్ప్రాజెక్టు సమర్పణప్రాజెక్టు మూల్యాంకనంశిక్షణ కేంద్రం/బ్యాచ్/అభ్యర్థి నిర్వహణఅంచనాధ్రువీకరణఆర్థిక నిర్వహణప్రాజెక్టు పర్యవేక్షణఉద్యోగ కల్పన/ఉద్యోగ ట్రాకింగ్ మొదలైన శిక్షణ ఉద్యోగ కల్పన దశలన్నింటినీ సులభతరం చేసే ఒక సమగ్ర డిజిటల్ పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు.

డీడీయూ జీకేవై 2.0 పురోగతినికీలక డిజిటల్ సంస్కరణలనూ గౌరవ సహాయ మంత్రి సమీక్షించారుడీడీయూ జీకేవై 2.0 కింద కేటాయించిన లక్ష్యాల ప్రకారం శిక్షణఉద్యోగ కల్పనను సకాలంలో పూర్తి చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేశారుఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం చర్చించిన ఇతర అంశాల్లో కింది కార్యక్రమాలూ భాగంగా ఉన్నాయి:

ఆమోదం పొందిన ప్రాజెక్టుల వేగవంతమైన అమలును నిర్ధారించడానికి శిక్షణ బృందాలను సకాలంలో ప్రారంభించడం.

కార్యక్రమ పనితీరును ఎప్పటికప్పుడునిశితంగా పర్యవేక్షించడం కోసం అధునాతన డాష్‌బోర్డ్‌లువిశ్లేషణాత్మక నివేదికలను రూపొందించడం.

గ్రామీణ యువత తమ ఆసక్తిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికిశిక్షణ అవకాశాలను శోధించడానికిప్రాజెక్ట్ అమలు ఏజెన్సీల (పీఐఏలపని తీరు రేటింగ్‌లను వీక్షించడానికి వీలు కల్పించడం... తద్వారా సమాచారంతో కూడిన ఎంపికలుపారదర్శకతను ప్రోత్సహించే ఒక ఆన్‌లైన్ అభ్యర్థి నమోదు పోర్టల్.

 

ప్రాజెక్టు మదింపును వేగవంతం చేయడానికిఆమోదాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అదనపు మదింపు సంస్థలను ఏర్పాటు చేసే అవకాశం.

 

కార్యక్రమ అమలును బలోపేతం చేయడం కోసం ఆటోమేటెడ్ పీఆర్ఎన్ జనరేషన్ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారంబ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికేట్ వెరిఫికేషన్రియల్-టైమ్ అసెస్‌మెంట్ డాష్‌బోర్డులుప్రక్రియను సరళీకరించే ఇతర చర్యలు సహా సాంకేతికత-ఆధారిత సంస్కరణలు.

 

సమీకృత ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంరియల్-టైమ్ అసెస్‌మెంట్ డాష్‌బోర్డులువాస్తవిక సందర్భాల్లో ముఖ ధ్రువీకరణ ఆధారిత హాజరుఅర్హులైన అభ్యర్థుల కోసం మళ్లీ నమోదు చేసుకోగల నిబంధనలుకోర్సు వివరాలను స్వయంచాలకంగా ధ్రువీకరించడం కోసం ఎస్ఐడీహెచ్‌తో అనుసంధానం ద్వారా పౌర సేవలను బలోపేతం చేయడం.

 

ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కేంద్ర సహాయమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధిఉపాధిసుస్థిర జీవనోపాధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ డీడీయూ-జీకేవై పురోగతిని సమీక్షించాం’’.

***


(रिलीज़ आईडी: 2294629) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी