వ్యవసాయ మంత్రిత్వ శాఖ
అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీలు)
प्रविष्टि तिथि:
04 AUG 2026 6:10PM by PIB Hyderabad
రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రతియేటా వ్యవసాయ వ్యయాలు-ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 22 నిర్ధిష్ట వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీలు) నిర్ణయిస్తుంది.
కనీస మద్దతు ధరలను ఉత్పత్తి వ్యయానికి కనీసం ఒకటిన్నర రెట్ల స్థాయిలో ఉంచాలనే ముందస్తు సూత్రాన్ని 2018-19 సంవత్సర కేంద్ర బడ్జెట్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా, ప్రభుత్వం 2018-19 సంవత్సరం నుంచి అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్తో... నిర్దేశిత ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటలన్నింటి కోసం ఎంఎస్పీలను పెంచింది.
మొత్తం ఉత్పత్తిలో... ఈ ఉత్పత్తుల మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయినప్పుడు, మార్కెట్ చేయదగిన మిగులు మాత్రమే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా సేకరణకు అందుబాటులో ఉంటుంది. రైతులకు ధరల మద్దతును అందించడానికి ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర నిర్దేశిత రాష్ట్ర ఏజెన్సీల ద్వారా ధాన్యాలు, ముతక ధాన్యాలను సేకరిస్తుంది. పప్పుధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరి సేకరణ... ఈ ఉత్పత్తుల మార్కెట్ ధర ఎంఎస్పీ కంటే తక్కువకు పడిపోయినప్పుడు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు, సంబంధిత మార్గదర్శకాల ప్రకారం, ప్రధాన పథకమైన ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (పీఎం-ఆశా) పథకం కింద అనుబంధ పథకమైన ధరల మద్దతు పథకానికి అనుగుణంగా జరుగుతుంది. పీఎం-ఆశా పథకం కింద నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్)లు సేకరణ ఏజెన్సీలుగా ఉంటాయి. పత్తి, జనపనారనూ ప్రభుత్వం వరుసగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) ద్వారా కనీస మద్దతు ధరకు సేకరిస్తుంది.
దీనికి అదనంగా... ఉత్పత్తి, మార్కెట్ చేయదగిన మిగులు, రైతుల సౌలభ్యం, నిల్వ, రవాణా వంటి ఇతర సరుకు రవాణా, మౌలిక సదుపాయాల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా తగినన్ని సేకరణ కేంద్రాలను తెరుస్తారు. ఇప్పటికే ఉన్న మండీలు, డిపోలు, గోదాములకు అదనంగా, కీలక ప్రదేశాల్లో తాత్కాలిక కొనుగోలు కేంద్రాలనూ ఏర్పాటు చేస్తారు. సేకరణ ప్రక్రియ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఎంఎస్పీ ఆధారిత సేకరణ ప్రక్రియలు ఎంతగానో మెరుగయ్యాయి. ఎంఎస్పీని నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు చెల్లించడం... ఆధార్, భూమి రికార్డులను రాష్ట్రాల సేకరణ పోర్టల్లతో అనుసంధానించడం ద్వారా ఎంఎస్పీ ఆధారిత కొనుగోలు ప్రయోజనాలను రైతులు నేరుగా పొందుతున్నారు.
పప్పుధాన్యాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, వాటిలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం 2030-31 వరకు 'పప్పుధాన్యాల్లో స్వయం-సమృద్ధి మిషన్'ను ప్రారంభించింది. పప్పుధాన్యాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు... పీఎం-ఆశా పథకం కింద ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి కంది, మినుములు, మసూర్ పప్పులను కేంద్ర నోడల్ ఏజెన్సీలైన నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది.
ప్రధానమంత్రి-ఆశా పథకం కింద ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకాన్నీ (ఎమ్ఐఎస్) అమలు చేస్తోంది. ఇది త్వరగా పాడైపోయే, ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) పరిధిలోకి రాని వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తుల సేకరణ కోసం ఉద్దేశించినది. పంట దిగుబడి అధికంగా ఉన్న సమయంలో ఆర్థిక స్థాయిలు, ఉత్పత్తి వ్యయాల కంటే ధరలు తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు రైతులు వీటిని నష్టానికి అమ్ముకోకుండా రక్షించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీని కోసం గత సంవత్సరంతో పోలిస్తే, ప్రస్తుత మార్కెట్ ధరల్లో కనీసం 10 శాతం తగ్గుదల ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ పథకాన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల అభ్యర్థన మేరకు అమలు చేస్తారు.
ప్రభుత్వం 2024-25 సీజన్ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ధరల వ్యత్యాస చెల్లింపు (పీడీపీ) అనే కొత్త విభాగాన్నీ ప్రవేశపెట్టింది. త్వరగా పాడైపోయే స్వభావం గల పంట ఉత్పత్తులను పండించిన రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసానికి సమాన మొత్తాన్ని నేరుగా చెల్లిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంటను స్వయంగా సేకరించడం లేదా ఎమ్ఐపీ, అమ్మకపు ధర మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రైతులకు చెల్లించడం అనే రెండు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా 2024-25 సీజన్ నుంచి... ప్రధాన పంటలైన టమాటా, ఉల్లి, బంగాళాదుంపలను ఉత్పత్తి చేసే రాష్ట్రం నుంచి వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయడం కోసం అయ్యే నిల్వ, రవాణా ఖర్చులను కేంద్ర నోడల్ ఏజెన్సీలకు, రాష్ట్ర నియమిత ఏజెన్సీలకు తిరిగి చెల్లించడం కోసం ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మరో విభాగాన్నీ చేర్చింది.
పెరిగిన కనీస మద్దతు ధర దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చింది. సేకరణ, రైతులకు చెల్లించిన ఎంఎస్పీల మొత్తం డేటా ద్వారా ఇది స్పష్టంగా తెలుస్తుంది. 2021-22 నుంచి 2025-26 (జూన్, 2026 వరకు) వరకు సేకరణ, రైతులకు చెల్లించిన ఎంఎస్పీల మొత్తం వివరాలు కింది విధంగా ఉన్నాయి:
గత ఐదేళ్లలో సేకరణ, రైతులకు చెల్లించిన ఎంఎస్పీల మొత్తం
|
2021-22 నుంచి 2025-26
|
|
మొత్తం సేకరణ (ఎల్ఎంటీలలో)
|
మొత్తం ఎంఎస్పీ విలువ (లక్షల కోట్లలో)
|
|
5781
|
14.58
|
మొత్తం 22 పంటల కనీస మద్దతు ధర ఆధారిత సేకరణ 2004-14 మధ్య 6,987 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది 2014-26 (జూన్ 2026 వరకు) కాలంలో 12,819 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 2004-14 మధ్య రూ. 7.41 లక్షల కోట్లుగా ఉంది. ఇది 2014-26 (జూన్ 2026 వరకు) కాలంలో రూ. 27.80 లక్షల కోట్లకు పెరిగింది.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, సాగు వ్యయాన్ని తగ్గించడానికి, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, లాభదాయకమైన రాబడిని అందించడానికి, రైతులకు ఆదాయ మద్దతును అందించడానికి ప్రభుత్వం అనేక విధానాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ వివిధ పథకాలు, కార్యక్రమాలు... రుణాలు, బీమా, ఆదాయ మద్దతు, మౌలిక సదుపాయాలు, ఉద్యానవన పంటలు సహా వివిధ పంటలు, విత్తనాలు, యాంత్రీకరణ, మార్కెటింగ్, సేంద్రీయ-ప్రకృతి వ్యవసాయం, రైతు సంఘాలు, నీటిపారుదల, విస్తరణ కార్యకలాపాలు, పంటల సేకరణ, డిజిటల్ వ్యవసాయం మొదలైన వ్యవసాయ రంగంలోని అన్ని అంశాలనూ కవర్ చేస్తాయి.
ఈ సమాచారాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్నాథ్ ఠాకూర్ ఈ రోజు లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2294535)
आगंतुक पटल : 13