గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళల నేతృత్వంలోని సంస్థలను ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా బలోపేతం చేయటానికి ఎంఓఆర్డీ, పీసీఐ ఇండియా మధ్య ఆర్థికేతర అవగాహనా ఒప్పందం
प्रविष्टि तिथि:
29 JUL 2026 6:16PM by PIB Hyderabad
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్డీ), దీన్దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా మహిళా నేతృత్వంలోని సంస్థలను (డబ్ల్యూఎల్ఈలు) ముఖ్యంగా స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ) ఆధ్వర్యంలోని సంస్థలను ప్రభుత్వ కొనుగోళ్లు, మార్కెట్ అనుసంధానంతో కూడిన సంస్థాగత అభివృద్ధి ద్వారా బలోపేతం చేయటానికి ప్రాజెక్ట్ కన్సర్న్ ఇంటర్నేషనల్ (పీసీఐ) ఇండియాతో నేడు ఆర్థికేతర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన ఈ అవగాహన ఒప్పందం జరిగింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (గ్రామీణ జీవనోపాధులు) శ్రీ స్వాతి శర్మ, పీసీఐ ఇండియా సీఈఓ, జాతీయ సంచాలకుడు శ్రీ ఇంద్రజిత్ చౌధురి ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బీఎంజీఎఫ్) మద్దతుతో "మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ కొనుగోళ్ల విధాన వినియోగం" ద్వారా 2022లో ప్రారంభించిన సహకారాన్ని ఈ అవగాహన ఒప్పందం లాంఛనప్రాయం చేస్తుంది. మహిళా నేతృత్వంలోని, ఎస్హెచ్జీ సంస్థలకు సంస్థాగత సంసిద్ధత, సామర్థ్య పెంపు, మార్కెట్ వసతులను కల్పించటం ద్వారా ప్రభుత్వ, సంస్థాగత కొనుగోళ్లలో భాగస్వామ్యాన్ని మెరుగుపరచాలని ఈ ఒప్పందం ఉద్దేశం.
2026-2029 కాలానికి సంబంధించిన మూడేళ్ల ఎంఓయూకు ఆర్థికేతర స్వభావం ఉంది. ఇరువర్గాల మధ్య ఎలాంటి నిధుల బదిలీ లేదా ఆర్థిక బాధ్యత ఉండదు. ఈ ఒప్పందం ద్వారా చేపట్టే కార్యకలాపాల కోసం ప్రతి వర్గం ఖర్చులను స్వయంగా భరిస్తాయి.
డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం ద్వారా నేషనల్ రిసోర్స్ సెల్ (ఎన్ఆర్సీ), ప్రభుత్వ కొనుగోళ్లు, వ్యాపార నమూనా మద్దతు విభాగం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ భాగస్వామ్యంలో కీలక అంశం. దీనికి పీసీఐ ఇండియా సాంకేతిక మద్దతు అందిస్తుంది. ఈ విభాగం.. ఎస్ఆర్ఎల్ఎమ్ల్లో కొనుగోలు అనుసంధాన వాణిజ్య వ్యవస్థలను బలోపేతం చేయటానికి వ్యూహాత్మక, కార్యాచరణ మద్దతును అందిస్తుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా సంస్థాగత ఇంక్యుబేషన్ ఫ్రేమ్వర్కులు, ఎస్ఓపీలు, ఆపరేషనల్ టూల్కిట్లు, ప్రామాణిక సామర్థ్య పెంపు మాడ్యూళ్ల అభివృద్ధికి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ (జెమ్) ఆన్బోర్డింగ్, టెండర్లలో పాల్గొవటం, నాణ్యతా ప్రమాణాలు, డాక్యుమెంటేషన్, కొనుగోళ్ల సమ్మతిపై ఎస్ఆర్ఎల్ఎమ్ బృందాలకు, ఎస్హెచ్జీ సంస్థలకు శిక్షణ, చేదోడువాదోడుగా నిలవటం వంటి వాటిని ఇది సులభతరం చేస్తుంది. పునరుత్పాదక ఇంధన ఏకీకరణ, స్థిరమైన ఉత్పత్తి పద్ధతులు, సంబంధిత ప్రభుత్వ సంస్థలతో అనుసంధానం ద్వారా స్థిరమైన సంస్థాగత మోడళ్లను ఈ సహకారం మరింత అన్వేషించి, ప్రోత్సహిస్తుంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇతర రాష్ట్రాలతో విస్తృతమైన భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూనే.. మొదటగా అస్సాం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక సాంకేతిక సహాయం అందించాలని ప్రతిపాదించారు. జాతీయ సాంకేతిక అభ్యాస సెషన్లు, అంతర్-రాష్ట్రాల మధ్య జ్ఞానాన్ని పంచుకోవటం, ఎంటర్ప్రైజ్ అవకాశాల మ్యాపింగ్, కొనుగోలు-అనుసంధాన వ్యాపార నమూనాల అభివృద్ధిని కూడా చేపడతాయి.
ఎస్హెచ్జీ వ్యాపారాలకు ప్రభుత్వ కొనుగోలు మార్కెట్లలో ప్రవేశం కల్పించేందుకు స్థిరమైన, విస్తృతమైన వ్యాపారాల నిర్వహణకు, మహిళల ఆర్థిక సాధికారతను ముందుకు తీసుకెళ్లేందుకు సాంకేతిక మద్దతును అందించటంలో ఈ ఎంఓయూ కీలక ముందడుగా నిలుస్తుంది. ఈ భాగస్వామ్యం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం లక్ష్యాలకు.. స్థిరమైన, వ్యాపార ఆధారిత, మార్కెట్-అనుసంధాన జీవనోపాధుల ద్వారా 6 కోట్ల మంది లఖ్పతి దీదీలను సృష్టించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంది.
గ్రామీణ మహిళలకు సమ్మిళిత, స్థిరమైన, మార్కెట్-ఆధారిత జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించటం ద్వారా వికసిత్ భారత్-2047, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, భారతదేశ నెట్ జీరో ఆశయాల వంటి విస్తృత జాతీయ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ సహకారం తోడ్పడుతుంది.
***
(रिलीज़ आईडी: 2291512)
आगंतुक पटल : 12