మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
చేపల ఉత్పత్తి
प्रविष्टि तिथि:
28 JUL 2026 4:07PM by PIB Hyderabad
దేశంలో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల సమగ్ర అభివృద్ధి కోసం 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను (పీఎంఎంఎస్వై) కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, క్షీర అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని మత్స్య విభాగం అమలు చేస్తోంది. గత ఆరు సంవత్సరాల్లో మత్స్య శాఖ 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఇతర అమలు సంస్థలకు సంబంధించి రూ. 21,461 కోట్ల విలువైన మత్స్య అభివృద్ధి ప్రాజెక్టులను ఆమోదించింది. ఇందులో కేంద్ర వాటా రూ. 9,571 కోట్లు కాగా పీఎంఎంఎస్వై కింద ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 6,206 కోట్లు విడుదలయ్యాయి. ఆమోదించిన ప్రాజెక్టుల వ్యయం, కేంద్ర వాటా, విడుదల చేసిన నిధుల రాష్ట్రాల వారీ వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.
గత ఐదేళ్లుగా చేపల ఉత్పత్తిలో వృద్ధి, మత్స్య ఎగుమతుల పెంపుదల, జీవనోపాధి - ఉపాధి అవకాశాల కల్పనలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కీలకమైన పాత్ర పోషించింది. దేశంలో 2019-20లో 141.64 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25 నాటికి 197.75 లక్షల టన్నులతో సరికొత్త రికార్డు స్థాయికి పెరిగింది. మత్స్య, ఆక్వాకల్చర్ సంబంధిత కార్యకలాపాల ద్వారా 58 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించింది. 2019-20లో రూ. 46,663 కోట్లుగా ఉన్న మత్స్య ఎగుమతులు 2025-26 నాటికి రూ. 73,890 కోట్లకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్.. ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను అధ్యయనం చేసింది. మత్స్య రంగంలో పీఎంఎంఎస్వై సృష్టించిన ప్రభావాన్ని ప్రశంసిస్తూ ఈ పథకాన్ని కొనసాగించాలని అది సిఫార్సు చేసింది. దీనితో పీఎంఎంఎస్వైని ప్రస్తుతం ఉన్న రూపంలోనే 2026 సెప్టెంబర్ వరకు అమలు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను ఈ పథకానికి రూ. 2,500 కోట్ల కేంద్ర బడ్జెట్ను కేటాయించారు.
కేంద్ర ప్రభుత్వ మత్స్య విభాగం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా మత్స్యకారులు- చేపల పెంపకందారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మార్కెట్లో వారి బేరసారాల శక్తిని పెంచడానికి చేపల రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్ఎఫ్పీఓ) ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26 వరకు) కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖ దేశంలో 2,195 ఎఫ్ఎఫ్పీఓల ఏర్పాటు కోసం రూ. 544.86 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది. ఇంక్యుబేషన్ వ్యయం, నిర్వహణ వ్యయం, ఈక్విటీ గ్రాంట్ రూపంలో ఈ సహాయాన్ని అందిస్తున్నారు.
లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, క్షీర అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ఈ సమాచారాన్ని అందించారు.
చేపల ఉత్పత్తికి సంబంధించిన ప్రకటన: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద గత ఆరు సంవత్సరాల్లో ఆమోదించిన ప్రాజెక్టులు, కేంద్ర వాటా, విడుదల చేసిన కేంద్ర నిధుల రాష్ట్రాల వారీ వివరాలు
(రూ. కోట్లలో)
|
క్ర. సం.
|
రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం
|
ప్రాజెక్ట్ వ్యయం
|
కేంద్ర వాటా
|
విడుదలైన కేంద్ర నిధులు
|
కేంద్ర ప్రభుత్వ బాధ్యత
|
|
1
|
అండమాన్ నికోబార్ దీవులు
|
269.84
|
245.33
|
17.09
|
228.24
|
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
2,328.89
|
681.38
|
444.95
|
236.43
|
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
230.31
|
159.18
|
127.09
|
32.19
|
|
4
|
అస్సాం
|
541.63
|
298.44
|
218.51
|
81.37
|
|
5
|
బీహార్
|
579.62
|
193.12
|
121.93
|
71.19
|
|
6
|
ఛత్తీస్గఢ్
|
956.86
|
321.01
|
272.37
|
48.64
|
|
7
|
ఢిల్లీ
|
5.33
|
2.86
|
1.63
|
1.23
|
|
8
|
గోవా
|
147.24
|
72.19
|
53.05
|
24.15
|
|
9
|
గుజరాత్
|
910.75
|
346.74
|
173.35
|
173.39
|
|
10
|
హర్యానా
|
760.87
|
262.16
|
162.75
|
99.42
|
|
11
|
హిమాచల్ ప్రదేశ్
|
156.03
|
79.93
|
78.91
|
1.03
|
|
12
|
జమ్మూ కాశ్మీర్
|
154.57
|
81.43
|
79.61
|
1.82
|
|
13
|
జార్ఖండ్
|
472.63
|
166.58
|
118.5
|
50.19
|
|
14
|
కర్ణాటక
|
1,053.60
|
380.32
|
328.29
|
52.03
|
|
15
|
కేరళ
|
1,329.63
|
570.49
|
432.22
|
138.26
|
|
16
|
లడఖ్
|
33.49
|
20.1
|
12.17
|
7.93
|
|
17
|
లక్షద్వీప్
|
62.45
|
44.22
|
14.42
|
29.8
|
|
18
|
మధ్యప్రదేశ్
|
910.81
|
305.51
|
292.27
|
13.23
|
|
19
|
మహారాష్ట్ర
|
1,601.44
|
593.33
|
392.11
|
201.22
|
|
20
|
మణిపూర్
|
201.82
|
95.84
|
29.92
|
65.94
|
|
21
|
మేఘాలయ
|
132.62
|
74.26
|
65.44
|
11.35
|
|
22
|
మిజోరాం
|
154.17
|
85.61
|
83.52
|
2.73
|
|
23
|
నాగాలాండ్
|
168.33
|
109.56
|
89.17
|
20.39
|
|
24
|
ఒడిశా
|
1,301.19
|
484.66
|
361.35
|
123.29
|
|
25
|
పుదుచ్చేరి
|
351.26
|
296.44
|
92.4
|
204.04
|
|
26
|
పంజాబ్
|
162.23
|
46.96
|
29.46
|
17.58
|
|
27
|
రాజస్థాన్
|
70.38
|
24.53
|
8.9
|
15.63
|
|
28
|
సిక్కిం
|
83.68
|
51.7
|
43.98
|
7.68
|
|
29
|
తమిళనాడు
|
1,236.21
|
474.99
|
223.02
|
253.12
|
|
30
|
తెలంగాణ
|
353.02
|
112.69
|
41.19
|
71.5
|
|
31
|
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ
|
6.31
|
3.58
|
1.79
|
1.79
|
|
32
|
త్రిపుర
|
262.93
|
150.6
|
91.45
|
59.14
|
|
33
|
ఉత్తర ప్రదేశ్
|
1,294.32
|
412.3
|
336.61
|
75.69
|
|
34
|
ఉత్తరాఖండ్
|
317.25
|
170.2
|
166.68
|
3.53
|
|
35
|
పశ్చిమ బెంగాల్
|
546.38
|
223.19
|
87.04
|
136.21
|
|
ఏ
|
మొత్తం (సీఎస్ఎస్)
|
19,148.11
|
7,641.42
|
5,093.16
|
2,561.36
|
|
బీ
|
పీఎంఎంఎస్వై కేంద్ర రంగ పథకం భాగం
|
2,312.92
|
1,929.68
|
1,112.62
|
817.06
|
|
ఏ+బీ
|
మొత్తం (సీఎస్ఎస్ + సీఎస్)
|
21,461.03
|
9,571.09
|
6,205.78
|
3,378.42
|
(रिलीज़ आईडी: 2290828)
आगंतुक पटल : 11