బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు మార్పిడి కేంద్రం నిర్వహణ, క్రమబద్ధమైన ధరల ఆవిష్కరణ
प्रविष्टि तिथि:
27 JUL 2026 5:10PM by PIB Hyderabad
‘బొగ్గు మార్పిడి నియమాలు-2026’ను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం- 2025 ద్వారా గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 [ఎంఎండీఆర్ చట్టం-1957]లో చేర్చిన సెక్షన్ 18(బి)(3)కు అనుగుణంగా వీటిని జూన్ 4, 2026 నాటి నోటిఫికేషన్ నంబర్ జీ.ఎస్.ఆర్ 442 (ఈ) ద్వారా భారత గెజిట్లో ప్రకటించారు.
ఎంఎండీఆర్ చట్టం-1957లోని సెక్షన్ 18బి లోని అధికారాలను ఉపయోగించి.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, డిసెంబరు 10, 2025 నాటి ఎస్.ఓ. 5730 (ఇ) నోటిఫికేషన్ ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయబోయే బొగ్గు మార్పిడి కేంద్రాలను నమోదు చేసేందుకు, నియంత్రించేందుకు బొగ్గు నియంత్రణ సంస్థను అధికార సంస్థగా నియమిస్తూ భారత గెజిట్ను ప్రచురించింది.
సొంత అవసరాలు, వాణిజ్య పరంగా బొగ్గు తవ్వకాలు జరిపే మైనింగ్ సంస్థలతో సహా ఏ సంస్థ అయినా బొగ్గు మార్పిడికి లావాదేవీలు జరపవచ్చు. వ్యాపారం చేయవచ్చు. డెలివరీ ఆధారిత ఒప్పందాల్లో ప్రవేశించవచ్చు. బొగ్గు మార్కెట్ వేదికల్లో వ్యాపారం చేసిన, లావాదేవీలు జరిపిన బొగ్గు ధరల నిర్ణయ ప్రక్రియను బొగ్గు మార్పిడి కేంద్రం చేపడుతుంది. న్యాయమైన, స్థిరమైన, పోటీతత్వంతో కూడిన, సమర్థవంతమైన ధరలను నిర్ధారించే విధానం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. బిడ్డింగ్, ధరల నిర్ణయ విధానాలు సీసీఓ ఆమోదించిన ప్రక్రియకు అనుగుణంగానే నిర్వహిస్తారు.
కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యత ఆధారంగా ఒప్పందంలో ఉన్న ధరల సవరణ పద్ధతి, బొగ్గు నమూనా పరీక్ష సంస్థ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ప్రకారం తుది ధరను సర్దుబాటు చేస్తారు. బొగ్గు మార్పిడి నియమాలు-2026 ప్రకారం ఏర్పాటు చేసిన మార్కెట్ పర్యవేక్షణ విధానం.. బొగ్గు మార్పిడి వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి, మార్కెట్ దుర్వినియోగాన్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు కూడా మార్కెట్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవటానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2290195)
आगंतुक पटल : 4