ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 08 JUL 2026 1:47PM by PIB Hyderabad

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ప్రదేశంయోగ్యకర్తలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారుగౌరవ సూచకంగా ప్రధానమంత్రితో కలిసి ఇండోనేషియా అధ్యక్షుడు గౌరవ శ్రీ ప్రబోవో సుబియాంటో ఆలయ సందర్శనకు వెళ్లారుఈ ఆలయ సముదాయంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐచేపట్టనున్న పరిరక్షణపునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభానికి గుర్తుగా ఇరుదేశాల నాయకులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

9వ శతాబ్దంలో నిర్మించిన ప్రంబనన్ ఆలయ సముదాయం ఇండోనేషియాలోనే అతిపెద్ద ఆలయ సముదాయంత్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు దీన్ని అంకితమిచ్చారుభారత్ఇండోనేషియా మధ్య ఉమ్మడి నాగరికతసాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా ఈ ఆలయ సముదాయం నిలుస్తుంది.

అధ్యక్షుడు ప్రబోవో 2025లో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇరుదేశాల నేతల నిర్ణయం మేరకు ఈ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతోందిప్రంబనన్ ఆలయ సముదాయ పునరుద్ధరణకు భారత్ నుంచి సహాయాన్ని పొందేందుకు ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది.

ఆగ్నేయాసియాలోని పలు ప్రపంచ వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణపరిరక్షణలో భారతదేశానికి మంచి గుర్తింపు ఉందిగతంలో ఇండోనేషియాలోని బోరోబుదూర్ ఆలయ సముదాయానికి సంబంధించి పత్రాల నమోదు పనులను ఏఎస్ఐ విస్తృతంగా చేపట్టిందిప్రంబనన్ ఆలయ సముదాయం పునరుద్ధరణపరిరక్షణకు భారత్ అందిస్తున్న మద్దతు ఇరుదేశాల మధ్యనున్న ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని కాపాడటంలో భారతదేశానికున్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

 

***

(रिलीज़ आईडी: 2282455) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Kannada , Malayalam