రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారతీయ నౌకాదళానికి చెందిన నౌకల సింగపూర్ యాత్ర విజయవంతం

प्रविष्टि तिथि: 05 JUL 2026 4:58PM by PIB Hyderabad

భారత నౌకాదళ నిర్వహణ పూర్వక మోహరింపులో భాగంగాతూర్పు నౌకాదళానికి చెందిన ‘ఉదయగిరి’, ‘శక్తి’లతో పాటు ‘కవరత్తి’లు రియర్ అడ్మిరల్ ఆలోక్ ఆనంద్ నాయకత్వంలో సింగపూర్లోని చాంగీ నౌకాదళ స్థావరానికి నౌకాశ్రయ యాత్రను విజయవంతంగా ముగించాయిఈ కార్యక్రమం భారత్సింగపూర్‌ పక్షాల మధ్య వ్యూహాత్మకనౌకావాణిజ్య భాగస్వామ్యాన్ని దృఢతరం చేసింది.
ఆసియాన్-భారత్ నౌకావాణిజ్య సహకార సంవత్సరంభారత్ ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్ విధానం’ లక్ష్యాలకు అనుగుణంగా  ఈ కార్యక్రమం  మూడు రోజుల పాటు సాగిందిరెండు నౌకాదళాల మధ్య అంతరనిర్వహణీయతనీనౌకాదళ సంబంధిత సహకారాన్నీ పటిష్ఠపరుచుకొనే ఉద్దేశంతో క్రాస్-డెక్ యాత్రలు సహా అనేక వృత్తి నైపుణ్య ప్రధాన సమావేశాలను నిర్వహించారుఐఎన్ఎస్ కవరత్తిని పాఠశాల విద్యార్థులు చూశారువారు నౌకాదళ కార్యకలాపాలుయుద్ధనౌకలో జీవితంభారతీయ నౌకాదళానికి మార్గదర్శకంగా ఉండే విలువల గురించి తెలుసుకున్నారు.
విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమం భారత్సింగపూర్ మధ్య అంతకంతకు విస్తరిస్తున్న నౌకావాణిజ్య సహకారంలో మరో కీలక ప్రగతి ప్రస్థానాన్ని సూచిస్తోందినౌకాశ్రయం వద్ద నిర్వహించిన సమావేశాలతో వృత్తినైపుణ్యానికి సంబంధించిన అవగాహనను పెంపొందింప చేసుకోవడంనిర్వహణ కార్యకలాపాల పరంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో శాంతినీసుస్థిరత్వాన్నీభద్రతనీ పరిరక్షించడానికి ఉమ్మడి ప్రయత్నాల్ని ప్రోత్సహించుకోవడానికీ తోడ్పాటు లభించినట్లయింది.

 

***


(रिलीज़ आईडी: 2281442) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil