ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUN 2026 9:45PM by PIB Hyderabad
తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం కోసం మరింత అంకితభావం, విశ్వసనీయత, నిబద్ధతతో పనిచేసేందుకు ఈ సందర్భం తనకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“గౌరవనీయ హరివంశ్ గారూ, మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భం దేశం పట్ల మరింత అంకితభావంతో, విశ్వాసంతో, నిబద్ధతతో పనిచేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’.
***
(रिलीज़ आईडी: 2271492)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam