జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జల రంగంలో పరిశోధన, అభివృద్ధి అంశాలపై జాతీయ వర్క్‌షాప్..


జల భద్రత సాధనకు అనుసరించాల్సిన చర్యల మార్గసూచీకి రూపకల్పన

‘మహా ఆన్ వాటర్’, భారత్-విన్ స్టార్టప్‌లకు పిలుపు..

‘జన్ సంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్’ పోర్టల్ ప్రారంభం..

ఎమ్ఓయూను కుదుర్చుకున్న జల శక్తి శాఖ, ఇస్రో

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2026 6:54PM by PIB Hyderabad

జల రంగంలో పరిశోధనఅభివృద్ధిపై ఏర్పాటు చేసిన జాతీయ వర్క్‌షాప్‌లో ప్రభుత్వంవిద్యారంగంపరిశోధన సంస్థలుపరిశ్రమల రంగంసూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలతో పాటు అంకుర సంస్థలతో ముడిపడిన 500 కన్నా ఎక్కువ ఆసక్తిదారులు పాల్గొన్నారుభారత జల పరిశోధననూతన ఆవిష్కరణలకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్టం చేయడంపై వీరు చర్చించారుజల భద్రతవాతావరణ మార్పులను తట్టుకోవడానికి చేయాల్సిన ఏర్పాట్లను నిర్ధారించడం లక్ష్యంగా ఈ చర్చలు సాగాయివర్క్‌షాప్‌లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్పాటిల్సైన్స్టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదాడాక్టర్ జితేంద్ర సింగ్జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరిఅంతరిక్ష విభాగం కార్యదర్శిఇస్రో చైర్మన్ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ డాక్టర్ వినారాయణన్సీనియర్ సెక్రటరీలుశాస్త్రవేత్తలునిపుణులుదేశవ్యాప్త పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్పాటిల్ ప్రసంగిస్తూ, ‘‘నీరు మన నాగరికతకీఅభివృద్ధికీ ప్రతీక’’ అని వర్ణించారునీటికి సంబంధించిన సరికొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశోధనసాంకేతిక నూతన ఆవిష్కరణలుప్రజల భాగస్వామ్యం.. ఈ మూడిటి సాయంతో ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారుపరిశోధనలనీనూతన ఆవిష్కరణలనీ ప్రోత్సహించే దిశగా మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన వివరిస్తూ జల రంగంలో 315 కన్నా ఎక్కువ పరిశోధనఅభివృద్ధి పథకాల్ని మొదలుపెట్టినట్లూవాటిలో మంత్రిత్వ శాఖ నేరుగా తోడ్పాటును అందిస్తున్న పథకాలు 113 వరకూ ఉన్నట్లూ తెలిపారు.

జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్‌జేబీప్రచార ఉద్యమంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారుదేశమంతటా 1.5 కోట్ల కన్నా ఎక్కువ జల సంరక్షణకు సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేశారని తెలిపారుజల్ సంచయ్ జన్ భాగీదారీక్యాచ్ ది రెయిన్ (జేఎస్‌జేబీ:సీటీఆర్పోర్టల్ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారుఇది దేశమంతటికీ ఉద్దేశించిన కార్యక్రమమన్నారుపౌరులుపరిశ్రమలుప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రభుత్వ ఏజెన్సీల భాగస్వామ్యంతో సముదాయ సేవ ఆధారితంగా నీటి సంరక్షణని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన చెప్పారుశాస్త్రీయ పద్ధతుల్లో నీటి నిర్వహణకీనీటి వనరుల స్థిరత్వానికీ ప్రోత్సాహాన్ని అందించడంలో భూ-స్థానిక (జియోస్పేషియల్సాంకేతికతలతో పాటు భాగస్వామ్యాలు కూడా పాత్రను పోషించాల్సివుంటుందని మంత్రి స్పష్టం చేశారు

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, 2047 కల్లా ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలన్న భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే విద్యారంగంపరిశ్రమఎమ్ఎస్ఎమ్ఈలుఅంకుర సంస్థలను కలుపుకొని ముందుకు పోతూ ‘ఏకోన్ముఖ ప్రభుత్వం’, ‘ఏకోన్ముఖ జాతీయ విధానం’.. వీటిని అవలంబించడం ముఖ్యమన్నారునీటి నిర్వహణలో విజ్ఞానశాస్త్రంసాంకేతికత పాత్ర అంతకంతకూ పెరుగుతోందంటూనీటికి సంబంధించిన ‘మహా ఆన్ వాటర్’ (మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్ ఫర్ వాటర్)ను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారుజల శక్తి శాఖ, ‘ఇస్రో’ పరస్పరం సహకరించుకోవడానికి ముందుకు రావడాన్ని స్వాగతించారునీటికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో అంతరిక్ష ఆధారిత సేవలు (అప్లికేషన్స్సహా ఆధునిక సాంకేతికతలు అందించే అవకాశాలకు కీలక పాత్ర ఉంటుందని ఆయన అన్నారుగత 12 సంవత్సరాల్లో జల శక్తి మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను ఆయన ప్రశంసించారుజల వనరుల నిర్వహణవాతావరణ మార్పు వేళల్లో అందుకు దీటైన చర్యలను తీసుకోవడంతాగునీటి భద్రత.. వీటిలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్య నిర్ణయంగా ‘మహా మిషన్‌’ను ఆవిష్కరించినట్లు వెల్లడించారుజల రంగాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశోధనల-ఆధారితవిస్తృత స్థాయి పరిష్కారాలకు వేగాన్ని అందించడానికి ఏఎన్ఆర్ఎఫ్జల శక్తి శాఖ ఒక సంయుక్త పరిశోధనను చేపట్టాయని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.

శ్రీ రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, ‘‘నీరు ఒక మౌలిక వనరు.. ఇది వ్యవసాయంబతుకుతెరువుప్రజారోగ్యంఆర్థికాభివృద్ధిపర్యవరణ సంబంధిత స్థిరత్వాలకు ఆధారం’’ అని స్పష్టం చేశారుజల రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర దృష్టికోణాన్ని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారుదేశం నలు మూలలా దీర్ఘకాలిక స్థిరత్వంతో కూడిన నీటి నిర్వహణ పద్ధతుల్ని పటిష్టపరచడంలో శాస్త్రీయ పరిశోధనలుసాంకేతికతఆధారిత విధానాల రూపకల్పనకార్యాచరణలకు తోడు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారునూతన ఆవిష్కరణలుఫలితాలను రాబట్టగల విధానాలను తీసుకురావడంజన్ భాగీదారీ.. ఇవి దీర్ఘ కాలంలో జల భద్రతను నిర్ధారించడంలోనూవికసిత్ భారత్ ఆశయ సాధనలోనూ కీలకం అవుతాయన్నారు.

జల వనరులు, నదీ వికాసంగంగా నది పునరుద్ధరణ విభాగ కార్యదర్శి శ్రీ వి.ఎల్కాంతా రావు మాట్లాడుతూ జలం ఒక వ్యూహాత్మక వనరనీదీని సంరక్షణకు పరిశోధనల్లోనూతన ఆవిష్కరణల్లో నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారుతాగునీటి భద్రతభూగర్భ జల నిర్వహణవరదలను ముందుగా అంచనా వేయడంనదీజలాల సంరక్షణవాతావరణ మార్పులకు తగినట్లుగా ఉండే వ్యూహాలను అమలుచేసే విషయాల్లో అత్యాధునిక పరిష్కారాలను కనుగొనడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సివుందన్నారునిలకడతనంతో కూడిన నీటి నిర్వహణే లక్ష్యంగా సాంకేతికత-ఆధారిత పరిష్కారాల్ని అన్వేషించడానికి అంతరిక్ష విభాగండీఎస్‌టీఏఎన్ఆర్ఎఫ్సీఎస్ఐఆర్తదితర సంస్థలు ఒకదానితో మరొకటి సహకరించుకుంటూ ముందుకుపోవడం ముఖ్యమని ఆయన అన్నారు.

అంతరిక్ష విభాగం కార్యదర్శి, ఇస్రో చైర్మన్ డాక్టర్ వినారాయణన్ మాట్లాడుతూజల వనరుల నిర్వహణలో అంతరిక్ష సాంకేతికతరిమోట్ సెన్సింగ్జియోస్పేషల్ అప్లికేషన్లు పెనుమార్పులను తీసుకురాగలుగుతాయన్నారుజల శక్తి శాఖ-ఇస్రో భాగస్వామ్యాన్ని ఆయన స్వాగతించారుఫలితాల-ఆధారిత జల నిర్వహణను దృఢతరంగా తీర్చిదిద్దడానికి ఉపగ్రహ-ఆధారిత పరిశీలనలను క్షేత్ర స్థాయి గణాంకాలతో ఏకీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

తాగునీరు, స్వచ్ఛత విభాగం కార్యదర్శి శ్రీ అశోక్ మీనా మాట్లాడుతూజల్ జీవన్ మిషన్‌లో భాగంగా వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్నీతాగు నీటి భద్రతనీజల వనరుల స్థిరత్వాన్నీ బలోపేతం చేయడం కోసం పరిశోధనల పరంగానూసాంకేతికంగానూ సాధించిన ప్రగతిని వ్యావహారికక్షేత్ర స్థాయి పరిష్కారాల రూపంలోకి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారునీటి నాణ్యతకీవనరుల స్థిరత్వానికీ సంబంధించి స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి అంకితమైన పరిశోధనఅభివృద్ధి (ఆర్ అండ్ డీకమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలనూకేంద్రపాలిత ప్రాంతాలనూ ఆయన కోరారుడేటాపై ఆధారపడి నీటి నిర్వహణను చేపట్టాల్సి ఉందని చెబుతూ ఇస్రోబీఐఎస్ఏజీ-ఎన్‌లతో మంత్రిత్వ శాఖ సహకారం గ్రామ స్థాయిలో మ్యాపింగ్శాస్త్రీయ ప్రణాళికల ప్రక్రియల్లో సహాయకారి అవుతోందన్నారుదీనిలో గ్రామం మొదలు జాతీయ స్థాయి వరకూ నిరంతర జల వనరుల నిర్వహణ పటిష్టమవుతుందన్నారు.

ఏఎన్ఆర్ఎఫ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ శివ్‌కుమార్ ‘మహా ఆన్ వాటర్’ (మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్ప్రాధాన్యాన్ని వివరించారుజల రంగంలో భారత్ పరిశోధననూతన ఆవిష్కరణలతో ముడిపడిన విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడానికి పెనుమార్పులను తీసుకురాగలిగిన కార్యక్రమంగా ఈ మిషన్‌ను ప్రవేశపెట్టారని ఆయన అన్నారుజల వనరుల నిర్వహణతాగునీటి భద్రతవాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యంతాజా సాంకేతికతల వంటి ప్రాధాన్య రంగాల్లో అధిక ప్రభావాన్ని ప్రసరించగల పరిశోధనలను ఈ మిషన్ ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారుదీంతో పాటువిద్యారంగ ప్రముఖులుపరిశోధన సంస్థలుపరిశ్రమఅంకుర సంస్థలుప్రభుత్వ ఏజెన్సీల మధ్య సహకారాన్ని పెంపొందింపచేస్తుందని కూడా వివరించారు. ‘జలం విషయంలో భద్రమైనసుస్థిర భవిష్యత్తును పొందడానికి నూతనవిస్తరణ యోగ్య పరిష్కారాలను కనుగొనేవాటిని వేగంగా ఆచరించగల సామర్థ్యం ‘మహా ఆన్ వాటర్’ (మిషన్‌)కు ఉందని డాక్టర్ శివ్‌కుమార్ అన్నారు.

ప్రధాన కార్యక్రమాల ప్రారంభం.. వ్యూహాత్మక ప్రకటనలు

జల రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధన ఫలితాల కార్యాచరణసాంకేతికతను అమలుపరచడంలో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ వర్క్‌షాపులో అనేక వ్యూహాత్మక కార్యక్రమాలను మొదలుపెట్టారు.

మహా ఆన్ వాటర్’ (మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్)ను సహకారం ప్రధానంగా ఉండే ఓ వేదికగా ప్రవేశపెట్టారుమిషన్-ఆధారిత పరిశోధననూతన ఆవిష్కరణల ద్వారా సరికొత్త జల సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీలువిద్యాసంస్థలుపరిశోధన సంస్థలుపరిశ్రమఅంకుర సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు దీనిని తీసుకువచ్చారు.

భారత్ వాటర్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్ (భారత్-విన్)ను కూడా ప్రారంభించారుఇది అంకుర సంస్థలుఎమ్ఎస్ఎమ్ఈలకు ఉద్దేశించిన ఓ బహిరంగ ఆహ్వాన కార్యక్రమంజల రంగంలో ఉత్పాదనప్రోటోటైప్ అభివృద్ధిని ప్రోత్సహించడం దీని ఉద్దేశంజల సంరక్షణజల వినియోగ దక్షతవనరుపరమైన స్థిరత్వంనీటి నాణ్యత నిర్వహణవాతావరణ మార్పులను ఎదుర్కొనే జల ప్రణాళికలకు సంబంధించి వినూత్న పరిష్కారాలను గుర్తించడంప్రోత్సహించడంవిస్తరించడం కూడా ఈ కార్యక్రమం ధ్యేయాలేనూతన ఆవిష్కర్తలుపరిశోధన సంస్థలుపరిశ్రమ భాగస్వాములుప్రభుత్వ కార్యక్రమాలతో పాటు చివరి స్థాయి వినియోగదారుల మధ్య సహకారానికి మార్గాన్ని సుగమం చేయడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందిఆశాజనక సాంకేతికతలను అమలుపరచడంతో పాటు వాటిని వేగంగా విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

ఈ వర్క్‌షాపులో జల్ సంచయ్ జన్ భాగీదారీ: క్యాచ్ ది రెయిన్ (జేఎస్‌సీబీసీటీఆర్పేరిట ఒక జాతీయ స్థాయి భాగస్వామ్య ఉద్యమాన్ని కూడా ప్రారంభించారుసముదాయాలు నాయకత్వం వహించే జల సంరక్షణ ప్రయత్నాలను మరింత బలపరచడం దీని ఉద్దేశంజల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం సఫలం అయ్యే క్రమంలో ఈ వెబ్‌సైట్ పౌరుల భాగస్వామ్యాన్నీజ్ఞానాన్నీ పంచుకోవడానికీజల సంరక్షణకు చేపట్టే పనులకు సంబంధించిన కథనాల్నీఅత్యుత్తమ పద్ధతుల్నీ దేశం అంతటా ప్రచారం చేయడానికి సహకరిస్తుంది.

అంతరిక్ష సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ఉపగ్రహ ఆధారిత పరిశీలనలుజియోస్పేషల్ సమాచారాన్ని ఉపయోగించుకొని జల వనరుల సంబంధిత ప్రణాళిక రచనపర్యవేక్షణలతో పాటు విధాన నిర్ణయాలను తీసుకోవడానికి ఒక అవగాహన ఒప్పందంపై జల శక్తి శాఖఇస్రో సంతకాలు చేయడం కీలక ప్రగతి ప్రస్థానమని చెప్పవచ్చుఈ భాగస్వామ్యం శాస్త్రీయ జల నిర్వహణకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటుమన్నికైన జల నిర్వహణ కోసం డేటా-ఆధారిత విధానాల్ని దృఢతరం చేయడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.

జాతీయ ప్రాధాన్యాలపైనా, భావి పరిశోధన దిశలపైనా సాంకేతిక కార్యక్రమాల్లో చర్చలు

ఈ సాంకేతిక కార్యక్రమాల్లో కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలువిద్యాసంస్థలుపరిశోధన సంస్థలుపరిశ్రమఅంకుర సంస్థలుఅభివృద్ధి భాగస్వాములతో పాటు పౌర సమాజ సంస్థలను ఒక చోట సమావేశపరిచారుఈ సమావేశం జల రంగంలో సరికొత్త సవాళ్లురాబోయే కాలంలో పరిశోధనల్లో పెద్దపీట వేయాల్సిన అంశాలపై చర్చించడానికి ఒక అవకాశాన్ని అందించింది.

హిమాలయ ప్రాంత విస్తారిత అనుబంధ వ్యవస్థలు, నదీపరివాహక ప్రాంతాలుభూగర్భ జలంపై ఆధారపడిన ప్రాంతాలుకోస్తా తీర ప్రాంతాలుపట్టణ కేంద్రాలుదుర్భిక్ష బాధిత భూభాగాలు సహా దేశ వ్యాప్తంగా వివిధ జలవాతావరణ సంబంధితభౌగోళిక సందర్భాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయివాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలను తీసుకోవడంభూగర్భ జలాలు అడుగంటి పోకుండా జాగ్రత్త చర్యలను చేపట్టడంసాగునీటి సమర్థ వినియోగంనీటి నాణ్యతను కాపాడుకోవడంనదుల్నీజలాశయాల్నీ పరిరక్షించుకోవడానికి తీసుకోవలసిన చర్యలువరదఅనావృష్టి పరిస్థితులను తట్టుకుని నిలిచే సామర్థ్యంపర్యావరణ సమతౌల్య పునరుద్ధరణపట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవడంజియోస్పేషల్ సాంకేతికతలుకృత్రిమ మేధ సేవల వినియోగంనీటి నిర్వహణకు డిజిటల్ పరిష్కారాలు వంటి కీలక విషయాలపై చర్చల్లో దృష్టిని కేంద్రీకరించారు.

పరిశోధన సంస్థలకూ, అమలుపరిచే సంస్థలకూ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి అవకాశాలు ఉన్నాయాఅనే అంశంతో పాటుసాంకేతికత బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేయడంనూతన ఆవిష్కరణల మద్దతుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు పోవడాన్ని ప్రోత్సహించడంశాస్త్రీయ జ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలుపరిచేందుకు అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను చర్చల్లో పాల్గొన్న వారు పరిశీలించారుజాతీయ ప్రాధాన్యాలను లెక్కలోకి తీసుకుంటూ ప్రాంతం వారీ సవాళ్లను సమర్థంగావిస్తృత ప్రాతిపదికస్థానిక అనుకూలతలతో కూడిన పరిష్కారాలను కనుగొనడంపై దృష్టిని కేంద్రీకరించారు.

ప్రభుత్వం, విద్యారంగంపరిశ్రమసముదాయాల మధ్య మరింత ఎక్కువ సమన్వయం ఎంతైనా అవసరమని చర్చల్లో స్పష్టం చేశారుఈ విధమైన సమన్వయాన్ని ఏర్పరిచినప్పుడు మెరుగైన జల భద్రతవాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలు తీసుకోవడంవనరులను దీర్ఘకాలిక ప్రాతిపదికన నిర్వహించడంతో పాటు ఫలితాల ఆధారిత విధాన రూపకల్పనకు పరిశోధన ఫలితాలు నేరుగా దోహదపడతాయని తేల్చారు.

సరికొత్తగా తెర మీదకు వస్తున్న సాంకేతికతలు, అత్యుత్తమ పద్ధతులతో ఎగ్జిబిషన్ నిర్వహణ

జల రంగంలో వినూత్న సాంకేతికతలు, పరిశోధన ఫలితాలుజియోస్పేషల్ అప్లికేషన్స్డిజిటల్ ప్లాట్‌ఫారాలుఅంకుర సంస్థ-ఆధారిత పరిష్కారాలు, క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు

ఫలప్రదమైన తీరుతెన్నులను కళ్లకు కట్టిన ఒక ఎగ్జిబిషన్‌ను కూడా వర్క్‌షాప్‌లో భాగంగా ప్రారంభించారు. పరిశోధకులుటెక్నాలజీ డెవలపర్లువిధాన రూపకర్తలుపరిశ్రమ ప్రతినిధులుచివరి స్థాయి వినియోగదారుల మధ్య మాటామంతీకి ఒక వేదికను ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచారుఈ వేదికను .. జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికీసహకారంసేవల విస్తరణకున్న అవకాశాలను గుర్తించడానికీ మార్గాన్ని సుగమం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.

గత 12 సంవత్సరాల్లో జల రంగంలో పరిశోధనలునూతన ఆవిష్కరణలకు సంబంధించిన విజయాలనీఫలితాలనీ వివరించే ఒక లఘు చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారుభూగర్భజల నిర్వహణవాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలు తీసుకోవడంసాగునీటిని తగినంతగా అందించగలగడంరిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లుజల నిర్వహణ రంగంలో నమోదైన ప్రగతిని ఈ లఘు చిత్రంలో వివరించారు.

ఈ వర్క్‌షాపు నిర్వహణతో.. జాతీయ ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వానికీసైన్సుకీపరిశ్రమకీసమాజానికీ సంబంధించిన శక్తుల్ని ఉమ్మడిగా ఉపయోగించాలన్న గౌరవ ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసే దిశలో కీలక అడుగును వేసినట్లయిందివిధాన రూపకర్తలుపరిశోధకులుఅంకుర సంస్థలఎమ్ఎస్ఎమ్ఈలుపరిశ్రమ ప్రముఖులుసమాజంలో ఆసక్తిదారు వర్గాలను ఒక చోటులో సమావేశపరిచి ఈ వర్క్‌షాపు మరింత ఎక్కువ ఏకీకృతసహకారపూర్వకపరిశోధనల-ఆధారిత జల రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థకు పునాది వేసింది.

చర్చలను ముగించిన తరువాత చేసిన సిఫార్సులతో భవిష్యత్తులో జల పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో పెట్టే పెట్టుబడులకు ఒక దిశ లభించడంవేర్వేరు రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపరిశోధనల ఫలితాల్ని ఆచరణీయ పరిష్కారాల రూపంలోకి మార్చే ప్రక్రియలు వేగం పుంజుకోవడంతో పాటు దీర్ఘకాలిక జల నిర్వహణకు ఆధునిక సాంకేతికతల్ని అనుసరించడంలోనూ ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారువర్క్‌షాపు అందించే ఫలితాలతో అత్యాధునిక సాంకేతికతల ఉపయోగం పెరుగనుందిజల భద్రతవాతావరణ మార్పు వేళల్లో దీటైన చర్యలు తీసుకోగలగడంతో పాటు 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పాటు లభించనుంది.

***


(రిలీజ్ ఐడి: 2267968) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी