బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మే 28న న్యూఢిల్లీలో ఉపరితల బొగ్గు, లిగ్నైట్‌ వాయువీకరణ ప్రాజెక్టులపై బొగ్గు మంత్రిత్వ శాఖ రోడ్‌షో

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 4:43PM by PIB Hyderabad

రూ37,500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రారంభించిన ఉపరితల బొగ్గులిగ్నైట్ వాయువీకరణ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై రేపు ప్రత్యేక రోడ్‌షో నిర్వహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందిదేశంలోని విస్తారమైన బొగ్గులిగ్నైట్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికిబొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియను స్వచ్ఛమైనపర్యావరణహిత మార్గంగా ప్రోత్సహించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక చర్యగా నిలవనుంది.

ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డితో పాటు కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారువీరితో పాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝాఇతర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలనే మంత్రిత్వ శాఖ నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఈ రోడ్‌షోను నిర్వహిస్తున్నారుఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విధాన నిర్ణేతలురాష్ట్ర ప్రభుత్వ అధికారులుపారిశ్రామికవేత్తలుపెట్టుబడిదారులుసాంకేతిక నిపుణులుఆర్థిక సంస్థలుఇతర కీలక భాగస్వాములందరూ ఒకే వేదికపైకి రానున్నారుదేశంలో బొగ్గు వాయువు ఉత్పత్తి రంగంలో పుట్టుకొస్తున్న సరికొత్త అవకాశాలుభాగస్వామ్యాలుభవిష్యత్తు కార్యాచరణపై వీరంతా సుదీర్ఘంగా చర్చించనున్నారు.

 

2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును వాయువుగా మార్చాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ పథకం కీలకంగా వ్యవహరించనుందిఇది దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడమే కాకుండా ఎల్‌ఎన్‌జీయూరియాఅమ్మోనియామిథనాల్‌ వంటి కీలక పదార్థాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.

 

ఈ పథకం ద్వారా సుమారు రూ2.5 నుంచి లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.  దేశంలోని బొగ్గు నిక్షేప ప్రాంతాల్లో చేపట్టబోయే సుమారు 25 ప్రాజెక్టుల ద్వారా సుమారు 50,000 మందికి ప్రత్యక్షంగాపరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.  దాదాపు 75 మిలియన్‌ టన్నుల బొగ్గులిగ్నైట్‌ను వినియోగించడం ద్వారా జీఎస్టీఇతర పన్నుల ద్వారా లభించే అదనపు అనుబంధ ఆదాయంతో పాటుఏటా దాదాపు రూ6,300 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.

 

2021లో ప్రారంభించిన జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్,  2024 జనవరిలో ఆమోదించిన రూ8,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకాలకు కొనసాగింపుగా ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చారుఇప్పటికే పాత పథకం కింద కూ6,233 కోట్ల ప్రోత్సాహకాలతో ఎనిమిది ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయిఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త పథకం దేశంలో బొగ్గు వాయువీకరణ కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతునునిధులను భారీగా విస్తరిస్తుంది.

 

మన దేశంలో దొరికే బొగ్గులిగ్నైట్‌లను సింథసిస్ వాయువుమిథనాల్అమ్మోనియాసింథటిక్‌ సహజ వాయువుపర్యావరణహిత ఇంధనాలురసాయనాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలుగా మార్చడానికి ఈ బొగ్గు వాయువీకరణ ఒక అద్భుతమైన మార్గంగా మారుతోందిఈ కార్యక్రమం ద్వారా దేశంలో పారిశ్రామిక వృద్ధికి  కొత్త మార్గాలు తెరుచుకుంటాయనివనరుల వాడకాన్ని పెంచడంతోపాటు దేశీయ దీర్ఘకాలిక ఇంధన అవసరాలకు ఎంతో మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.

 

తాజాగా ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకం ద్వారా రాబోయే కొత్త అవకాశాల గురించి చర్చించడానికిఉపరితల బొగ్గులిగ్నైట్‌ వాయువీకరణ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసే మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సు సంబంధిత భాగస్వాములందరికీ ఒక మంచి వేదికను అందిస్తుందిపర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలను ప్రోత్సహించడందేశ ఇంధన భద్రతను పెంచడంఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేయడంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2266285) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil