నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత నౌకావాణిజ్య రంగంలో 2020 తరువాత మహిళల భాగస్వామ్యంలో 340 శాతం వృద్ధి నమోదు: శ్రీ సర్బానంద సొనోవాల్


సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రోత్సహించే దిశగా

భాగస్వామ్య దేశాలన్నిటితో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉంది: సర్బానంద సొనోవాల్

నాడు పోస్టు చేయడమైనది: 07 MAY 2026 7:52PM by PIB Hyderabad

భారత నౌకావాణిజ్య రంగంలో 2020వ సంవత్సరం తరువాతి కాలంలో మహిళల భాగస్వామ్యం 340 శాతం మేర వృద్ధి చెందిందిఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులునౌకాయానజలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ఈ రోజు ఒక కార్యక్రమంలో తెలిపారుప్రభుత్వం మరింత ఎక్కువ సమ్మిళితత్వంతో  కూడినభవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు సన్నద్ధంగా ఉండేలా నౌకావాణిజ్య రంగ శ్రమశక్తిని తీర్చిదిద్దేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు.
పదో ‘హిందూ మహాసముద్ర చర్చా కార్యక్రమాన్ని’ న్యూఢిల్లీలో నిర్వహించగా శ్రీ సొనోవాల్ హాజరై కీలకపన్యాసాన్నిచ్చారుభారత నౌకావాణిజ్య అభివృద్ధి గాథలో ‘‘నారీ శక్తి’’ ఒక కీలక పాత్రను పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారుమారిషస్ విదేశాంగ మంత్రి శ్రీ ధనంజయ్ రాంఫుల్యెమెన్ సహాయ మంత్రి శ్రీ వలీద్ మొహమ్మద్ అల్-ఖదీమీ కూడా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘ 
సాగర్ మే సమ్మాన్ వంటి కార్యక్రమాలతో నౌకావాణిజ్య రంగంలో మహిళల ఆత్మగౌరవాన్నీసమ్మిళితత్వాన్నీనాయకత్వ అవకాశాల్నీ మేం ప్రోత్సహిస్తున్నాంవీటి ఫలితంగా ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం 2020వ సంవత్సరం తరువాత అనూహ్యస్థాయిలో దాదాపు 340 శాతం మేర వృద్ధి చెందింది’’ అని శ్రీ  సర్బానంద సొనోవాల్ అన్నారు. ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చురుకైన నాయకత్వంలోనౌకావాణిజ్య రంగంలో తీసుకువస్తున్న ఈ మార్పులు హిందూ మహాసముద్ర ప్రాంతానికి సంబంధించి మరింత సమ్మిళితత్వంతో కూడినదృఢమైనభవిష్య అవసరాలను పరిగణనలోకి తీసుకొని సన్నద్ధమై ఉండే సిబ్బందిని తీర్చిదిద్దడానికి తోడ్పడుతున్నాయి’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
మహిళల భాగస్వామ్యంలో నమోదైన ఈ వృద్ధి భారత విస్తృత నౌకావాణిజ్య దార్శనికతలో భాగమని కేంద్ర మంత్రి అన్నారుఇది ఆర్థిక అభివృద్ధిని సామాజిక సాధికారత కల్పనతో జోడిస్తోందని ఆయన చెప్పారుభద్రతనీఅనుసంధానాన్నీసుస్థిరతనీ పెంపొందింపచేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలతో పాటుభారత నౌకావాణిజ్య హంలో ‘‘మానవీయ కోణం’’ కూడా కీలక పాత్రను పోషిస్తోందని ఆయన తెలిపారు.
‘‘
హిందూ మహాసముద్రం కేవలం భౌగోళిక ప్రాంతం కాదు.. ప్రపంచానికి ఓ జీవరేఖ’’ అని శ్రీ సొనోవాల్ వర్ణించారు. ‘‘ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరావాణిజ్యంసరఫరా వ్యవస్థల పరంగా దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి చూస్తే బలమైన సహకారంఆటుపోట్లను తట్టుకోగలిగే ధీరత్వంతో పాటు సమ్మిళితత్వం ఎంతైనా అవసరం’’ అని ఆయన అన్నారు.
భారత నౌకావాణిజ్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని శ్రీ సోనోవాల్ స్పష్టం చేశారువీటిలో.. ‘సాగర్’ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్‌), ‘మహాసాగర్’ వంటి ప్రణాళికలు భాగంగా ఉన్నాయనీప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే కాకుండా సమానాభివృద్ధికి పూచీపడడం కూడా ఈ కార్యక్రమాల లక్ష్యమనీ మంత్రి అన్నారు.
2025-27 
మధ్య కాలానికి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏఅధ్యక్ష బాధ్యతల్ని నిర్వహిస్తున్న భారత్.. పదో ‘హిందూ మహాసముద్ర చర్చ కార్యక్రమాన్ని’ ఏర్పాటు చేసింది. ‘‘మారుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని’’ ఈ కార్యక్రమానికి ఇతివృత్తంగా ఎంపిక చేశారుఈ వేదిక నౌకావాణిజ్య రంగ భద్రతబ్లూ ఎకానమీవిపత్తుల కాలంలో రిస్క్ మేనేజ్‌మెంట్‌తో పాటు మహిళలకు సాధికారత కల్పన అంశాలపై చర్చించాల్సిందిగా మంత్రులనూవిధాన రూపకర్తలనూవిద్యారంగ నిపుణులనూపారిశ్రామిక రంగ ప్రముఖులనూ ఆహ్వానించింది.
ఐఓఆర్ఏకి అధ్యక్షత వహిస్తున్న భారత్.. ‘‘నూతన ఆవిష్కరణబాహాటత్వందృఢత్వంఅనుసరణీయత’’ అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తోందిదీనిలో భాగంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పనను ఒక కీలకవిస్తృత ప్రాధాన్యం కలిగిన రంగంగా గుర్తించింది.
ఈ ప్రాంతంలో ‘‘భద్రత ప్రదాత’’గా భారత్ పోషిస్తున్న పాత్రను కూడా శ్రీ సొనోవాల్ వివరించారుమానవతాపూర్వక సహాయాన్ని అందించడంనౌకావాణిజ్య సంబంధిత నిఘావైపరీత్యాల వేళ ప్రతిస్పందన పూర్వక చర్యలను చేపట్టడం వంటి అంశాలను ఆయన గుర్తు చేశారునౌకావాణిజ్యంలో సవాళ్లను ఏ ఒక్క దేశమో ఒంటరిగా ఎదుర్కోజాలదని మంత్రి అన్నారుఈ విషయంలో పారదర్శకతఅంతర్జాతీయ చట్టాల్ని గౌరవించడం ప్రాతిపదికలుగా ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
‘‘
సురక్షితమైనభద్రమైనసుస్థిరమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రోత్సహించే దిశగా భాగస్వామ్య దేశాలన్నిటితోనూ కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని శ్రీ సొనోవాల్ అన్నారు.
హిందూ మహాసముద్ర చర్చా కార్యక్రమాన్ని (ఇండియన్ ఓషన్ డైలాగ్..ఐఓడీ) 2014లో ప్రారంభించారుఇది ఐఓఆర్ఏ కు చెందిన ప్రధానమైన ‘ట్రాక్ 1.5 వేదిక’గా నిలుస్తోందిఈ వేదిక కీలక ప్రాంతీయ అంశాలపై చర్చోపచర్చలు చేయడానికి మంత్రులనూవిధాన రూపకర్తలనూవిద్యారంగ నిపుణులనూపారిశ్రామిక రంగ ప్రముఖులనూ ఆహ్వానిస్తోందిఐఓఆర్ఏలో 23 సభ్య దేశాలతో పాటుచర్చల్లో పాల్గొనేందుకు 12 మంది ఇతర భాగస్వాములు కూడా ఉన్నారుహిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆర్థిక సహకారంసుస్థిర ప్రాతిపదిక కలిగివుండే అభివృద్ధి అంశాలపై ఐఓఆర్ఏ దృష్టిని కేంద్రీకరిస్తుందిదీనిలో ‘బ్లూ ఎకానమీ’తో పాటు మహిళల ఆర్థిక సాధికారతను ఒక కీలక ప్రాధాన్యాంశంగా గుర్తించారుపదో చర్చా కార్యక్రమాన్ని 2026 మే నెల 7, 8వ తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారుదీనిలో నౌకావాణిజ్య భద్రతబ్లూ ఎకానమీవిపత్తుల వేళల్లో రిస్క్ మేనేజ్‌మెంట్వాతావరణ మార్పుమహిళలకు సాధికారత కల్పన అంశాలపై ప్రత్యేక సదస్సుల్ని నిర్వహిస్తున్నారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2259057) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi , Assamese