రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత-అల్జీరియా రక్షణ సహకారం మరింత విస్తృతం.. న్యూఢిల్లీలో తొలి సంయుక్త కమిషన్ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 1:22PM by PIB Hyderabad

భారత్‌అల్జీరియా దేశాల మధ్య తొలి సంయుక్త కమిషన్ సమావేశం మే 05, 2026న న్యూఢిల్లీలో జరిగిందిఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాలు తమ రక్షణ రంగ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయిముఖ్యంగా శిక్షణసైనిక విన్యాసాలువైద్య సహకారంరక్షణ పరిశ్రమలు వంటి కీలక రంగాల్లో పరస్పర ప్రయోజనాలపై ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చించాయిరక్షణ రంగ కార్యకలాపాలను భవిష్యత్తులో మరింత విస్తరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

 

ఈ సందర్భంగా భారత-అల్జీరియా రక్షణ సహకార అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన నియమావళిపై ఇరు దేశాలు సంతకాలు చేశాయిఈ నియమాలు భవిష్యత్తులో జరిగే సంయుక్త కమిషన్ సమావేశాలకు ఒక మార్గదర్శక ప్రణాళికలా పనిచేస్తాయిఈ కీలక సమావేశానికి భారత్‌ తరపున రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి (అంతర్జాతీయ సహకారంశ్రీ అమితాబ్ ప్రసాద్అల్జీరియా తరపున నౌకాదళ అధిపతి మేజర్ జనరల్ కైద్ నూర్ ఎద్దీన్ సహ-అధ్యక్షులుగా వ్యవహరించారుభారత ప్రతినిధుల బృందంలో త్రివిధ దళాల అధికారులుఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కేంద్ర కార్యాలయంరక్షణ ఉత్పత్తి విభాగండీఆర్‌డీఓసాయుధ దళాల వైద్య సేవలువిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

2024లో రక్షణ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి భారత్అల్జీరియాల మధ్య రక్షణ సంబంధాలు ఊపందుకున్నాయిఇరుపక్షాల ఉన్నత స్థాయి పర్యటనలు ఈ సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చాయిఅల్జీరియా నౌకాదళ అధిపతి పర్యటన భారత్-అల్జీరియా రక్షణ సంబంధాల పురోగతిలో కీలకంగా నిలిచిందిపరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో కలిసి పనిచేయడానికి ఇరుపక్షాల నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది.

ఈ సమావేశానికి ముందుమేజర్ జనరల్ కైద్ నూర్ ఎద్దీన్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారుఈ పర్యటన సందర్భంగా అల్జీరియా ప్రతినిధి బృందం రక్షణ రంగ పరిశ్రమల ప్రతినిధులతో కూడా సమావేశం కానుంది.

***


(రిలీజ్ ఐడి: 2258411) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR