ప్రధాన మంత్రి కార్యాలయం
అక్షయ తృతీయ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
19 APR 2026 10:50AM by PIB Hyderabad
అక్షయ తృతీయ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పవిత్ర పండుగ ప్రజలను సన్మార్గంలో నడిచేందుకూ, దానధర్మాలు చేయడానికి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అక్షయ తృతీయ అందరి జీవితాల్లో సుఖసంతోషాలను, సిరిసంపదలను, ఆయురారోగ్యాలను నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ దానధర్మాలతోపాటు మంచి పనులు చేయడానికీ, సేవా మార్గంలో ముందుకు సాగడానికీ స్ఫూర్తినిస్తుంది. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలను, అదృష్టాన్ని, ఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ అక్షయ (తరగని) ఫలితాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’
(రిలీజ్ ఐడి: 2253625)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9