మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘విద్య కోసం ఏఐ, విద్యలో ఏఐ‘ లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అభ్యాస ప్రక్రియను మార్చడంలో కొత్త పాఠ్యప్రణాళిక ఒక విప్లవాత్మక అడుగు: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


3 నుంచి 8వ తరగతి వరకు కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సీబీఎస్ఈ కొత్త పాఠ్యప్రణాళికను ప్రారంభించిన కేంద్ర విద్యామంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 7:41PM by PIB Hyderabad

కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐపై నుంచి  8వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సీబీఎస్ఈ కొత్త పాఠ్యప్రణాళికను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారుకేంద్ర నైపుణ్యాభివృద్ధిపరిశ్రమల స్థాపన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా),  విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరితో పాటు పాఠశాల విద్యసాక్షరత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషిసీబీఎస్ఈ ఛైర్మన్ శ్రీ రాహుల్ సింగ్ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ శ్రీ దినేష్ ప్రకాష్ సక్లానీవిద్యా మంత్రిత్వ శాఖసీబీఎస్ఈకేంద్రీయ విద్యాలయనవోదయ విద్యాలయఎన్‌సీఈఆర్‌టీకి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, 3 నుంచి 8వ తరగతుల వరకు కంప్యూటేషనల్ థింకింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కొత్త పాఠ్యప్రణాళికను ప్రారంభించడం విద్యా సంవత్సరం ఆరంభంలో భవిష్యత్తు అవసరాలకు తగిన అభ్యాసం వైపు ఒక విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారుఈ చొరవ పాఠశాల వ్యవస్థలో వ్యవస్థీకృత ఏఐ విద్యను భారీ స్థాయిలో అధికారికంగా ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారుఈ పాఠ్యప్రణాళికకు అనుగుణంగా క్రమబద్ధమైన మాడ్యూల్స్సమగ్రమైన ఉపాధ్యాయ కరదీపికలుపటిష్టమైన విద్యార్థి మూల్యాంకన విధానాలు ఉన్నాయనిఇవి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే సరైన అవగాహన కల్పిస్తూరేపటి తరం అభ్యాసకులకు బలమైన పునాది వేస్తాయని ఆయన వివరించారు.

విద్య కోసం ఏఐవిద్యలో ఏఐ‘ (ఏఐ ఫర్ ఎడ్యుకేషన్ఏఐ ఇన్ ఎడ్యుకేషన్దార్శనికతకు అనుగుణంగాఈ చొరవ యువతలో విమర్శనాత్మక ఆలోచనడిజైన్ ఓరియంటేషన్ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం ద్వారా మెరుగైన అభ్యాసం వైపు ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని మంత్రి తెలిపారుసాంకేతికత ఆధారిత కంప్యూటింగ్‌లో భారత నాయకత్వానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తున్న తరుణంలోఈ పాఠ్యప్రణాళిక డిజిటల్ భవిష్యత్తును అర్థం చేసుకోవడానికిదానిని తీర్చిదిద్దడానికి విద్యార్థులకు శక్తినిస్తుందని శ్రీ ప్రధాన్ స్పష్టం చేశారు.

దూరదృష్టితో కూడిన ఈ పాఠ్యప్రణాళికను రూపొందించినందుకుసాంకేతికతతో కూడిన విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)లను శ్రీ ప్రధాన్ అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూమారుతున్న ప్రపంచానికే కాకుండామనం ఊహించలేని విధంగా మారబోయే భవిష్యత్తు కోసం కూడా నేటి విద్య యువతను సిద్ధం చేయాలని అన్నారుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే విజ్ఞాన సముపార్జననిర్ణయాలు తీసుకోవడం,  ఆర్థిక వ్యవస్థల పనితీరును మారుస్తోందనిఅందువల్ల మన పిల్లలు సాంకేతికతను కేవలం వినియోగించేవారిగా కాకుండాదానిని ఆలోచనాత్మకంగా సృష్టించేవారుగాబాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారుచిన్న వయస్సు నుంచే కంప్యూటేషనల్ థింకింగ్‌ను పరిచయం చేయడం ద్వారా నిరంతరం నేర్చుకుంటూఅస్థిరతను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూఅడ్డంకులను అవకాశాలుగా మార్చుకోగల ఒక తరానికి మనం పునాది వేస్తున్నామని ఆయన తెలిపారుఇది కేవలం విద్యా సంస్కరణ మాత్రమే కాదుమానవ సామర్థ్యంపై జాతీయ పెట్టుబడి అని ఆయన అన్నారుజాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 దార్శనికతకు అనుగుణంగాభారతీయ అభ్యాసకులను రేపటి ఉద్యోగాలకే కాకుండాప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే ఆలోచనలువ్యవస్థలు,  పరిష్కారాలను రూపొందించేవారిగా సిద్ధం చేయడం దీని ఉద్దేశమని ఆయన వివరించారు

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యఅక్షరాస్యత విభాగం పర్యవేక్షణలోపాఠశాల విద్యార్థులలో ఏఐ పట్ల సంసిద్ధతను పెంపొందించడానికి కంప్యూటేషనల్ థింకింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యప్రణాళికను సీబీఎస్ఈ అమలు చేస్తోందిఈ పాఠ్యప్రణాళికను 2026-27 విద్యా సంవత్సరం నుంచి  నుంచి  8వ తరగతి వరకు అమలు చేస్తారుకంప్యూటేషనల్ థింకింగ్ నైపుణ్యాలపై దృష్టి సారించడం ద్వారా విద్యార్థులను ఏఐ సన్నద్ధ అభ్యాసకులుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యంకంప్యూటేషనల్ థింకింగ్ నైపుణ్యాల ద్వారా పెంపొందే ఏఐ-సంసిద్ధత విద్యార్థులలో తార్కిక ఆలోచనసమస్యల పరిష్కారంప్యాటర్న్ రికగ్నిషన్ వంటి సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే కాకుండా వారు రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పాత్ర,  వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందిఈ పాఠ్యప్రణాళిక కంప్యూటేషనల్ థింకింగ్డిజిటల్ అక్షరాస్యత,   సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం వంటి అంశాల్లో బలమైన పునాదులు వేయడంతో పాటుఆవిష్కరణలువిమర్శనాత్మక ఆలోచన,  నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రాముఖ్యతకంప్యూటేషనల్ థింకింగ్,   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం ఆవశ్యకత

విద్యార్థులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న డిజిటల్ పౌరులుగా తీర్చిదిద్దడంలో సీటీఏఐలను పరిచయం చేయడం అత్యంత కీలకం.

  • ఏఐకి పునాదికృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలను అర్థం చేసుకోవడానికిభవిష్యత్తులో వాటిని రూపొందించడానికి అవసరమైన మేధోపరమైన బలంఆలోచనా విధానాన్ని కంప్యూటేషనల్ థింకింగ్ అందిస్తుంది.

  • విజ్ఞాన వికాసంఇది తార్కిక ఆలోచనవ్యవస్థీకృత సమస్య పరిష్కారంనమూనాలను గుర్తించే సామర్థ్యాల వంటి ముఖ్యమైన మానవ సామర్థ్యాలను పెంపొందిస్తుంది.

  • భవిష్యత్తుకు సిద్ధం చేయడంచిన్న వయస్సు నుంచే వీటిపై అవగాహన కల్పించడం వల్ల ఆధునిక పని ప్రపంచంలో ఎంతో అవసరం అయిన డేటాను సమర్థవంతంగా ఉపయోగించే సామర్థ్యంసాంకేతికతను నైతికంగా అన్వయించే నైపుణ్యం లభిస్తాయి

  • సమగ్ర అభివృద్ధిఇది విద్యలో వివిధ అంశాల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందిగణితంసైన్స్హ్యుమానిటీస్ వంటి వివిధ సబ్జెక్టులను అనుసంధానించడం ద్వారా విజ్ఞానం అనేది వేర్వేరు విభాగాలుగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుందని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ఎన్ఈపీఎన్‌సీఎఫ్ 2023తో అనుసంధానం

జాతీయ విద్యా సంస్కరణలకు పూర్తి అనుగుణంగా ఈ పాఠ్యప్రణాళిక రూపుదిద్దుకుంది.

ఎన్ఈపీ 2020 దార్శనికతపాఠశాల విద్యలో కృత్రిమ మేధమెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలను అనుసంధానించడం ద్వారాఈ రంగాలలో భారత్ ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలపాలనే లక్ష్యాన్ని ఇది నెరవేరుస్తుంది.

ఎన్‌సీఎఫ్-ఎస్ఈ 2023తో అనుసంధానంఈ పాఠ్యప్రణాళికలోని అభ్యాస ప్రమాణాలను (లక్ష్యాలుసామర్థ్యాలుఫలితాలుపాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక (నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్) 2023) సూచించిన నిబంధనల నుంచి తీసుకున్నారు

దశల వారీ అమలుఎన్‌సీఎఫ్ సిఫార్సుల మేరకుపై తరగతులలో ఏఐని నేర్చుకోవడానికి అవసరమైన పునాదిగాఈ పాఠ్యప్రణాళిక మొదట కంప్యూటేషనల్ థింకింగ్ ను పరిచయం చేస్తుంది.

విధానం బోధనా పద్ధతి

ఈ బోధనా విధానాన్ని ఆటపాటలతో కూడిన అనుభవాధారితంగా రూపకల్పన చేశారు

  • కార్యాచరణ ఆధారితంప్రత్యేకమైన వర్క్‌షీట్‌లుసరదా గణిత క్రీడలుపజిల్స్ప్రత్యక్ష సాధనల ద్వారా అభ్యాస ప్రక్రియ సాగుతుంది.

  • సమస్యల పరిష్కారంపై దృష్టిఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూపెద్ద సమస్యలను చిన్న భాగాలుగా ఎలా విభజించాలోచార్ట్‌లురేఖాచిత్రాల వంటి దృశ్య రూపాలను ఎలా విశ్లేషించాలో నేర్పిస్తారు.

  • సామూహిక అభ్యాసంసమస్యలను సామూహికంగా పరిష్కరించడానికి ఈ పాఠ్యప్రణాళిక తోటి విద్యార్థులతో చర్చలుగ్రూప్ వారీ లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తుంది.

మూల్యాంకనం

బట్టీ పట్టడం నుంచి నిరంతరసామర్థ్యాధారిత పద్ధతుల ఆధారంగా మూల్యాంకనం ఉంటుంది

  • ఇంటరాక్టివ్ సాధనాలువీటిలో కంప్యూటేషనల్ థింకింగ్ పజిల్స్‌తో కూడిన రాత పరీక్షలుపరస్పర చర్చలతో కూడిన బృదాల వారీ కార్యకలాపాలువిద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి 'టీచర్ అబ్జర్వేషన్ జర్నల్వంటి పద్ధతులు ఉన్నాయి.

  • గుణాత్మక దృష్టివిద్యార్థి తన విజ్ఞానాన్ని ఎలా అన్వయిస్తున్నాడుఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తున్నాడు అనే సామర్థ్యాన్ని అంచనా వేయడమే దీని ప్రధాన లక్ష్యం.

 

***


(రిలీజ్ ఐడి: 2248105) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Urdu , English