గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక, వ్యూహాత్మక ఖనిజాల ఏడో విడత వేలాన్ని ప్రారంభించనున్న గనుల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2026 11:49AM by PIB Hyderabad

కీలకవ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఏడో విడత వేలాన్ని 2026 మార్చి 23న కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ప్రారంభిస్తారుసహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబేతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికీఖనిజ భద్రతకూ కీలక ఖనిజాలు కీలకమైనవిప్రపంచం వేగంగా శుద్ధ ఇంధనంఅధునాతన సాంకేతికతల దిశగా మళ్లుతున్న నేపథ్యంలో.. లిథియంగ్రాఫైట్అరుదైన మూలకాలు (ఆర్ఈఈ), టంగ్‌స్టన్వెనేడియంటైటానియంఇతర అరుదైన లోహ ఖనిజాలకు డిమాండు విశేషంగా పెరిగిందిఅవి పరిమితంగా లభిస్తుండడంఅదీ కొన్ని నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లోనే దొరుకుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నాయి.

వాటి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం.. 2023 ఆగస్టు 17న గనులుఖనిజాల (అభివృద్ధినియంత్రణచట్టం 1957 (ఎంఎండీఆర్ చట్టం)ను సవరించి, 24 ఖనిజాలను కీలకవ్యూహాత్మక ఖనిజాలుగా ప్రకటించిందిఈ ఖనిజాల కోసం మైనింగ్ లీజులుఉమ్మడి (కాంపోజిట్లైసెన్సులను వేలం వేసే అధికారాన్ని ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుందిఈ వేలంపాటల ద్వారా సమకూరే ఆదాయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతుంది.

గనుల మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ఆరు విడతల వేలంపాటలను విజయవంతంగా నిర్వహించిందిఇందులో భాగంగా ఇప్పటికే 46 కీలకవ్యూహాత్మక ఖనిజ బ్లాకులను వేలం వేసిందిబలమైన పారిశ్రామిక భాగస్వామ్యానికీదేశ ఖనిజ రంగంపై పెరుగుతున్న విశ్వాసానికీ ఇది నిదర్శనం.

ఇదే వేగాన్ని కొనసాగిస్తూ ఏడో విడతలో మైనింగ్ లీజుఉమ్మడి లైసెన్సుల కింద పలు రాష్ట్రాల్లోని 19 బ్లాకులను మంత్రిత్వ శాఖ వేలం వేయబోతోందిశుద్ధ ఇంధనంఅధునాతన సాంకేతికతలుఎరువులువ్యూహాత్మక పరిశ్రమల వంటి రంగాలకు అవసరమైన వివిధ ఖనిజ నిక్షేపాలు ఈ బ్లాకుల్లో ఉన్నాయి.

పారదర్శకతసమర్థతఖనిజ బ్లాకుల్లో కార్యకలాపాలు వేగంగా సాగడం కోసం వేలం విధానాన్ని విశేషంగా బలోపేతం చేసిందిపనితీరు హామీల సమర్పణముందస్తు చెల్లింపుఆసక్తి వ్యక్తీకరణ లేఖల జారీ వంటి వేలం అనంతర కాలపరిమితులను... ఖనిజాల (వేలంరెండో సవరణ నియమాలు- 2025 సహా ఇటీవలి సంస్కరణలు క్రమబద్ధీకరించాయిఅంతేకాకుండా ఖనిజాల (వేలంసవరణ నియమాలు- 202బ్యాంకు గ్యారెంటీలకు ప్రత్యామ్నాయంగా బీమా హామీ బాండ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టాయిదీంతో వేలందార్లకు మరింత సౌలభ్యం లభిస్తుంది.

ఆరోహణలో వెలను పెంచుతూ సాగే (అసెండింగ్ ఫార్వర్డ్ ఆక్షన్పారదర్శకమైనరెండు దశల ప్రక్రియ ద్వారా.. వేలాన్ని నిర్వహిస్తారుదీనిప్రకారం గని నుంచి తరలించిన ఖనిజం విలువపై అత్యధిక శాతాన్ని ప్రతిపాదించిన వారిని వేలంలో విజేతగా నిర్ణయిస్తారు.

 

*** 


(రిలీజ్ ఐడి: 2243578) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी