మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య విక్రయ కేంద్రం

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 3:13PM by PIB Hyderabad

అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో రూ. 24.77 కోట్ల అంచనా వ్యయంతో మత్స్య విక్రయ కేంద్రం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను భారత ప్రభుత్వ మత్స్య విభాగంమత్స్య పశు సంవర్ధకపాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మర్చి 30, 2022న ఆమోదించిందిప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వైపథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.14.86 కోట్ల ఆర్థిక సహాయం అందించనుందిఈ మత్స్య విక్రయ కేంద్రంలో చేపల దిగుమతి సౌకర్యంచేపల వేలానికి ప్రాంగణంవలల మరమ్మతు షెడ్డుచేపలను ఆరబెట్టేందుకు ప్రత్యేక వసతివిశ్రాంతి గదిపడవల పార్కింగ్మరమ్మతునీటి నిల్వసరఫరా సౌకర్యాలుశౌచాలయాలుభూమి చదును చేయటంరహదారులువాహనాల పార్కింగ్డ్రైనేజీరక్షణ గోడవిద్యుత్ సౌకర్యంపచ్చదనం వంటి సౌకర్యాల ఏర్పాటును ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు అప్పగించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందిఈ ప్రాజెక్టు పనుల కోసం జనవరి 21, 2026న ఏజెన్సీ ఐదో సారి టెండర్లను పిలిచిందిప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ దశలో ఉందిటెండర్లు ఖరారైన రోజు నుంచి ఏడాదిలోపు ఈ మత్స్య విక్రయ కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందిసమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్ప్రకారం.. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే సుమారు 1,536 మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరనుంది.

 

లోక్‌సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241322) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी