రైల్వే మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం వేగవంతం
ఒకే నెలలో పునర్నిర్మాణం పూర్తి కానున్న మరో 8 స్టేషన్లు.. మొత్తం 180కి చేరిన అమృత్ భారత్ స్టేషన్ల సంఖ్య
తాజాగా పునర్నిర్మించిన స్టేషన్ల జాబితాలో కేరళలోని అంగమాలి ఫర్ కాలడి, ఫెరోక్, నిలంబూర్ రోడ్, త్రిపుణితుర.. మధ్యప్రదేశ్లోని చింద్వారా.. తమిళనాడులోని మాంబలం.. ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలు జంక్షన్.. తెలంగాణలోని రామగుండం స్టేషన్లు
దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన స్టేషన్ భవనాలు, షెల్టర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వేచి ఉండే గదులు, మరుగుదొడ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, పార్కింగ్, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, ఇతర ప్రయాణికుల- సరుకు రవాణా సౌకర్యాలతో భారత్లో రైలు ప్రయాణ అనుభవాన్ని మారుస్తున్న అమృత్ భారత్ స్టేషన్లు
స్థూల బడ్జెట్ కేటాయింపుల్లో 97 శాతం వినియోగంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రాజెక్ట్ల అమలు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్న రైల్వే శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 4:40PM by PIB Hyderabad
భారతీయ రైల్వేల స్థూల బడ్జెట్ కేటాయింపుల వినియోగం ఈ కింది విధంగా ఉంది:
|
ఆర్థిక సంవత్సరం
|
స్థూల బడ్జెట్ కేటాయింపులు (రూ. కోట్లలో)
|
వినియోగం(శాతంలో)
|
|
2024-25
|
2,52,200
|
100 శాతం
|
|
2025-26
|
2,52,200
|
~ 97 శాతం
(09.03.2026 నాటికి)
|
ఇటీవలి సంవత్సరాల్లో ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాన్ని భారతీయ రైల్వే గణనీయంగా పెంచుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 32,300 కోట్లుగా ఉన్న రైల్వే స్థూల బడ్జెట్ కేటాయింపులు.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8 రెట్లు పెరిగి రూ. 2,52,200 కోట్లకు చేరుకుంది. ఇది రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడింది.
దీర్ఘకాలిక దృక్పథంతో రైల్వే స్టేషన్లను పునర్నిర్మించడం కోసం 'అమృత్ భారత్ స్టేషన్' పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కోసం ఇప్పటివరకు 1,337 స్టేషన్లను గుర్తించారు. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 180 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు పనులు పూర్తయిన స్టేషన్ల జాబితా:
అల్నావర్, అంబ్ అందౌరా, అంబికాపూర్, ఆమ్గావ్, ఆనంద్పూర్ సాహిబ్, అనారా, అంగమాలి ఫర్ కాలడి, అయోధ్య ధామ్, బాదామి, బాగల్కోట్, బైజినాథ్ పాప్రోలా, బలరాంపూర్, బంటవాలా, బారాభూమ్, బారామతి, బరేలీ సిటీ, బారిపడ, బార్మర్, బార్పాలి, బేగంపేట, బెయోహారి, భానుప్రతాప్పూర్, భిలాయ్, భింద్, బిజ్నోర్, బిమల్గఢ్, బొమ్మిడి, బుందీ, చందా ఫోర్ట్, చలకుడి, చంగనస్సేరి, చెన్నై పార్క్, చింద్వారా, చిదంబరం, చించ్పోక్లి, చిన్న సేలం, చిరాయింకీజ్, కటక్, డాకోర్, డెరోల్, దేశ్నోక్, దేవ్లాలీ, ధార్వాడ్, ధులే, డోంగర్గఢ్, ఫతేహాబాద్, ఫతేపూర్, ఫతేపూర్ షెకావతి, ఫెరోక్, గడగ్, గంగాపూర్ సిటీ, గొడ్డ, గోధ్రా జంక్షన్, గోగామేరి, గోకాక్ రోడ్, గోలా గోకర్నాథ్, గోమతీ నగర్, గోవర్ధన్, గోవింద్ గఢ్, గోవింద్పురి, గోవింద్పూర్ రోడ్, హఫీజ్పేట, హైబర్గావ్, హల్దియా, హపా, హర్పాల్పూర్, హత్రాస్ సిటీ, హోడల్, ఈద్గా ఆగ్రా జంక్షన్, ఇజ్జత్నగర్, జైసల్మేర్, జామ్ జోధ్పూర్, జామ్ వంతలీ, జాయ్చండీ పహార్, జున్నార్ దేవ్, కాకినాడ టౌన్, కళ్యాణి ఘోష్పరా, కామాఖ్యగురి, కనలుస్ జంక్షన్, కరైకుడి జంక్షన్, కరమ్ సాద్, కరీంనగర్, కట్నీ సౌత్, కేడ్గావ్, ఖైర్తాల్, ఖంబాలియా, ఖలీలాబాద్, కొప్పల్, కోసంబా జంక్షన్, కులిత్తురై, కుట్టిప్పురం, లాసల్గావ్, లింబ్డి, లోహర్దగా, లోనంద్ జంక్షన్, మాహె, మహువా, మైలానీ, మండల్ గఢ్, మండవర్ మహ్వా రోడ్, మధుపూర్, మాంబలం, మనపారై, మండి డబ్వాలీ, మంగళగిరి, మన్నార్గుడి, మతుంగ, ఎం.సి.ఎస్. ఛతర్పూర్, మిథాపూర్, మొరప్పూర్, మోర్బి, ముక్త్సార్, మునీరాబాద్, మురి జంక్షన్, ముర్తిజాపూర్ జంక్షన్, నైన్పూర్ జంక్షన్, నందురా, నర్మదాపురం (హోషంగాబాద్), నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ జంక్షన్, నిడదవోలు జంక్షన్, నిలంబూర్ రోడ్, ఓఖా, ఓర్చా, పాలిటానా, పనాగఢ్, పంకి ధామ్, పరేల్, పర్లాకిమిడి, పిర్పైంటి, పిస్కా, పోఖ్రాయన్, పొల్లాచ్చి జంక్షన్, పోలూరు, పోర్బందర్, రాజ్గఢ్, రాజ్మహల్, రాజులా జంక్షన్, రామగుండం, రాంఘాట్ హాల్ట్, రాయనపాడు, సహారన్పూర్ జంక్షన్, సాహిబ్జాదా అజిత్ సింగ్ మొహాలీ, సాహెబ్గంజ్, సామాఖ్యాలి, సామల్పట్టి, సాంచి, శంకర్పూర్, సావ్దా, సియోని, షాహద్, షాజాపూర్, షోలవందన్, షోరనూర్ జంక్షన్, శ్రీధామ్, సిద్ధార్థ నగర్, సిహోర్ జంక్షన్, సియురి, శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ (గద్వాల్), శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు, సెయింట్ థామస్ మౌంట్, సూళ్లూరుపేట, సురైమాన్పూర్, స్వామినారాయణ్ చప్పియా, తాల్చేర్, తమ్లుక్, థావే, తిరువారూర్ జంక్షన్, తిరువణ్ణామలై, త్రిపుణితుర, తుని, ఉఝాని, ఉర్కురా, ఉత్రాన్, వడకర, వడాలా రోడ్, విదిశ, వృద్ధాచలం జంక్షన్, వాడకాంచేరి, వరంగల్.
ఇతర స్టేషన్లలో అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని స్టేషన్లలో జరుగుతున్న పనుల పురోగతి వివరాలు ఇలా ఉన్నాయి:
జలోర్ లోక్సభ నియోజకవర్గం:
· జలోర్ స్టేషన్: స్టేషన్ భవనం, భవన ప్రవేశం (పోర్చ్), మరుగుదొడ్లు, ప్రవేశ లేదా నిష్క్రమణ ద్వారాలు, ప్రహరీ గోడ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతం(సర్సులేటింగ్ ఏరియా), ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
· మార్వార్ భీన్మల్ స్టేషన్: స్టేషన్ భవనం, భవన ప్రవేశం (పోర్చ్), ఒకటో నంబర్ ప్లాట్ఫాం ఉపరితలం, షెల్టర్, మరుగుదొడ్లు, ప్రవేశ లేదా నిష్క్రమణ ద్వారాలు, ప్రహరీ గోడ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) పనులు చేపట్టారు.
· పిండ్వారా స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్ఫాం షెల్టర్ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతం, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఛత్తీస్గఢ్:
· భిలాయ్ పవర్ హౌస్ స్టేషన్: రెండో ప్రవేశ ద్వారం వద్ద కొత్త స్టేషన్ భవనం, ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవన ఆధునికీకరణ, ప్లాట్ఫాంల అప్గ్రేడింగ్, వేచి ఉండే ప్రదేశాలను మెరుగుపరచటం, ప్రయాణికుల సంచార ప్రాంతం అభివృద్ధి, పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవనానికి సంబంధించి చివరి దశ పనులు, ప్లాట్ఫాంలపై విద్యుత్ దీపాల మెరుగుదల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
· దల్లిరాజహరా స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణ, వేచి ఉండే ప్రాంతాలు, మరుగుదొడ్లు, ప్లాట్ఫాంల అప్గ్రేడింగ్, మైకుల ద్వారా సమాచారం అందించే వ్యవస్థ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతం మెరుగుదల, సుందరీకరణ, కళా, సాంస్కృతిక అలంకరణ పనులు, సూచిక బోర్డులు, ప్లాట్ఫాంలపై విద్యుద్దీపాల పనులు చేపట్టారు.
· రాయ్పూర్ జంక్షన్ స్టేషన్: రెండో ప్రవేశ ద్వారం వైపు ఉన్న పైపులైన్లు, కేబుల్స్ వంటివి తొలగించటం (యుటిలిటీ షిఫ్టింగ్).. వాటిని వేరే చోటుకు తరలించే పనులు పూర్తయ్యాయి. రెండో ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవన నిర్మాణ పనులు, ప్రధాన- రెండో ప్రవేశ ద్వారాల వద్ద బహుళ అంతస్థుల పార్కింగ్ సౌకర్యం, సర్వీస్ భవనాలు, రెండో ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సంచార ప్రాంతం అభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
· సరోనా స్టేషన్: కొత్తగా రెండో ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవనం, ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవన ఆధునికీకరణ, ప్లాట్ఫాంల అప్గ్రేడింగ్, వేచి ఉండే ప్రాంతాల మెరుగుదల, ప్రయాణికుల సంచార ప్రాంతం అభివృద్ధి, పార్కింగ్, ప్రజా సమాచార వ్యవస్థలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవనం చివరి దశ పనులు, సుందరీకరణ(ల్యాండ్స్కేపింగ్), కళా- సాంస్కృతిక అలంకరణ పనులు, ప్లాట్ఫాంలపై విద్యుత్ దీపాల మెరుగుదల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఢిల్లీ:
· నరేలా స్టేషన్: ప్లాట్ఫాం షెల్టర్, ప్లాట్ఫాం ఉపరితలం (సర్ఫేసింగ్), ఆధునిక మరుగుదొడ్లు, ప్రయాణికుల సంచార ప్రాంతం, పార్కింగ్, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతుల పనులు చేపట్టారు.
· సబ్జీ మండి స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, ప్లాట్ఫాం షెల్టర్, ప్లాట్ఫాం ఉపరితలం(సర్ఫేసింగ్), ఆధునిక మరుగుదొడ్లు, ప్రయాణికుల సంచార ప్రాంతం, పార్కింగ్, దివ్యాంగుల వసతులు, లిఫ్ట్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
· తిలక్ బ్రిడ్జ్ స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, ప్లాట్ఫాం షెల్టర్, ప్లాట్ఫాం ఉపరితలం, ఆధునిక మరుగుదొడ్లు, ప్రయాణికుల సంచార ప్రాంతం, పార్కింగ్, దివ్యాంగుల వసతులు, లిఫ్ట్ పనులు చేపట్టారు.
కర్ణాటక:
· బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్: దక్షిణ భాగంలో మళ్లింపు రోడ్డు, ఉత్తర భాగంలో శిక్షణ కేంద్రం.. హాస్టల్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ భవనం పనులు పూర్తయ్యాయి. స్టేషన్ దక్షిణ, ఉత్తర భాగాల భవన నిర్మాణ పనులు.. ప్రయాణికుల సంచార ప్రాంతం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
· చామరాజ నగర్ స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణ, భవన ప్రవేశం, ప్లాట్ఫాం షెల్టర్, ప్లాట్ఫాం ఉపరితలం, వేచి ఉండే హాల్, బుకింగ్ కౌంటర్, ప్రయాణికుల సంచార ప్రాంతం, పార్కింగ్ పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· ఘటప్రభ స్టేషన్: ప్లాట్ఫాం ఉపరితలం, ప్లాట్ఫాం షెల్టర్, ప్రయాణికుల సంచార ప్రాంతం, లిఫ్ట్, ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
· హోసపేట స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణ, ప్లాట్ఫాం షెల్టర్, వెయిటింగ్ హాల్ మెరుగుదల, ఒకటో నంబర్ ప్లాట్ఫాం వద్ద కోచ్ సూచిక బోర్డుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫాం ఉపరితలం, 2/3 నంబర్ ప్లాట్ఫాంల వద్ద కోచ్ సూచిక బోర్డులు, లిఫ్ట్, ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· రాణిబెన్నూరు స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణ, భవన ప్రవేశం, ప్లాట్ఫాం షెల్టర్, ప్లాట్ఫాం ఉపరితలం, వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ప్రయాణికుల సంచార ప్రాంతం, పార్కింగ్, ప్రవేశ ద్వార తోరణం పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
మహారాష్ట్ర (పాల్ఘర్ జిల్లాతో కలిపి):
· పాల్ఘర్ స్టేషన్: 2/3 నంబర్ ప్లాట్ఫాంల వద్ద కొత్త షెల్టర్, ప్లాట్ఫాం ఉపరితలం (సర్ఫేసింగ్), కొత్త కోపింగ్ బ్లాక్స్, 4వ నంబర్ ప్లాట్ఫాం వద్ద టాక్టైల్ టైల్ పనులు పూర్తయ్యాయి. పైపులైన్లు, కేబుల్స్ వంటివి తొలగించటం (యుటిలిటీ షిఫ్టింగ్), 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
· దివా స్టేషన్: తూర్పు వైపున స్టేషన్ భవన ఆధునికీకరణ, ప్రయాణికుల సంచార ప్రాంతం, పార్కింగ్, కొత్త ప్రవేశ ద్వారం, 5/6 - 7/8 నంబర్ ప్లాట్ఫాంల ఎత్తు పెంపు, ఫ్లోరింగ్, 7/8 నంబర్ ప్లాట్ఫాం వద్ద షెల్టర్, కొత్త మరుగుదొడ్ల బ్లాక్, పశ్చిమ వైపున మురుగునీటి శుద్ధి కేంద్రం, కళ్యాణ్ - ముంబయి వైపు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిల మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. కొత్తగా 6 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· ముంబ్రా స్టేషన్: ప్లాట్ఫాం ఉపరితలం మెరుగుదల, ప్రయాణికుల కోసం కూర్చునే ఏర్పాట్లు, కొత్త మరుగుదొడ్ల బ్లాక్, బుకింగ్ కార్యాలయ ఆధునికీకరణ, ప్రయాణికుల సంచార ప్రాంతం, మురుగునీటి శుద్ధి కేంద్రం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. ఎస్కలేటర్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
· టిత్వాలా స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, ప్లాట్ఫాం ఉపరితలం, టికెట్ బుకింగ్ కార్యాలయ మెరుగుదల, మరుగుదొడ్ల బ్లాక్, మురుగునీటి శుద్ధి కేంద్రం, తూర్పు - పశ్చిమ వైపులా ద్విచక్ర వాహనాల పార్కింగ్, అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. కొత్తగా 6 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· విక్రోలి స్టేషన్: పశ్చిమ వైపున స్టేషన్ భవన ఆధునికీకరణ, ప్లాట్ఫాం ఉపరితలం, ప్లాట్ఫాం షెల్టర్, ముంబయి వైపు కొత్త మరుగుదొడ్ల బ్లాక్, కళ్యాణ్ వైపు ఉన్న మరుగుదొడ్ల బ్లాక్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. కొత్త బుకింగ్ కార్యాలయం, తూర్పు - పశ్చిమ వైపులా ప్రయాణికుల సంచార ప్రాంతం, తూర్పు వైపున పార్కింగ్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
· ఇగత్పురి స్టేషన్: కొత్త స్టేషన్ భవనం నిర్మాణ పనులు, ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవన ఆధునికీకరణ, ప్రవేశ ద్వారం, బుకింగ్ కార్యాలయం, మరుగుదొడ్ల బ్లాక్, ప్లాట్ఫాం ఉపరితలం, ప్లాట్ఫాం షెల్టర్, ప్రయాణికుల సంచార ప్రాంతం, మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు పూర్తయ్యాయి. కొత్త స్టేషన్ భవనం చివరి దశ పనులు(ఫినిషింగ్) ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
· సబర్కాంత జిల్లా సహా గుజరాత్:
· హిమ్మత్నగర్ స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, ప్రస్తుత స్టేషన్ భవనం మెరుగుదల, వాటర్ బూత్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · దాహోద్ స్టేషన్: స్టేషన్ భవనం, వరండా, ప్లాట్ఫారం నంబర్ 1 సర్ఫేసింగ్, బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్, వేచి ఉండే గది, చెల్లింపు ఆధారిత మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్ల మెరుగుదల పనులు పూర్తయ్యాయి. 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · లింఖేడా స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, ప్లాట్ఫారం నంబర్ 1, 2 విస్తరణ, ప్లాట్ఫారం ఉపరితలాన్ని మెరుగుపరచడం, ప్లాట్ఫారం నంబర్ 1, 2, 3 వద్ద మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం మెరుగుదల పనులు పూర్తయ్యాయి. సైనేజ్లు, 6 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · అసర్వ స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, వరండా, కొత్త వేచి ఉండే గది, బుకింగ్ కౌంటర్, మరుగుదొడ్డి బ్లాక్ పనులు పూర్తయ్యాయి. కొత్త ప్లాట్ఫారం షెల్టర్, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, దివ్యాంగజన సౌకర్యాలు, కాంకోర్స్ ఏరియా ఫినిషింగ్ పనులు చేపట్టారు.
· · సెహోర్ స్టేషన్: ప్లాట్ఫారం సర్ఫేస్, ప్లాట్ఫారం షెల్టర్, వెయిటింగ్ హాల్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్, సైనేజ్, స్టేషన్ ఇల్యుమినేషన్ పనులు పూర్తయ్యాయి. 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· హిమాచల్ ప్రదేశ్:
· అంబ్ అండౌరా, బైజ్నాథ్ పాప్రోలా స్టేషన్లలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. పాలంపూర్ హిమాచల్, సిమ్లా స్టేషన్లు మాస్టర్ ప్లానింగ్లో ఉన్నాయి.
· మాస్టర్ ప్లానింగ్ దశ ఆప్టిమైజేషన్ అవసరమయ్యే పునరావృత ప్రక్రియ. అటువంటి ఆప్టిమైజేషన్ కోసం కాలపరిమితి, ఇతర వివరాలను ఈ దశలో సూచించలేము.
· ఉత్తర రైల్వేలోని అంబాలా డివిజన్:
· · అంబాలా సిటీ స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, ప్లాట్ఫారం ఉపరితలం, ఏసీ వెయిటింగ్ రూమ్, సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · కల్కా స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, వేచి ఉండే గది, విశ్రాంతి గది, సర్క్యులేటింగ్ ప్రాంతం, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం సర్ఫేసింగ్, లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · యమునానగర్ జగధారి స్టేషన్: స్టేషన్ భవనం, వేచి ఉండే గది, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం సైనేజ్ల మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం సర్ఫేసింగ్, రెండో ప్రవేశ ద్వారం, లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి అభివృద్ధి పనులు చేపట్టారు.
· · పాటియాలా స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, ప్లాట్ఫారం షెల్టర్, వెయిటింగ్ హాల్, రిటైరింగ్ రూమ్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం సర్ఫేసింగ్, రెండో ప్రవేశ ద్వారం, లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి అభివృద్ధి పనులు చేపట్టారు.
· ఉత్తర రైల్వేలోని జమ్మూ డివిజన్:
· · బుద్గాం స్టేషన్: సర్క్యులేటింగ్, పార్కింగ్, అప్రోచ్ రోడ్డు మెరుగుదల పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · గురుదాస్పూర్ స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్ఫారం షెల్టర్, ప్లాట్ఫారం ఉపరితలం మెరుగుదల, వేచి ఉండే గది, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ప్రాంతం, వరండా, లైటింగ్ పనులు పూర్తయ్యాయి. కొత్త ప్లాట్ఫారం నంబర్ 2, బుకింగ్ కమ్ వెయిటింగ్ హాల్, సర్క్యులేటింగ్ ప్రాంతం, పార్కింగ్, ప్రధాన ప్రవేశ ద్వారం, రెండో వైపు ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్: స్టేషన్ భవనం, వరండా, వేచి ఉండే గది, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ప్రాంతం, పార్కింగ్, అప్రోచ్ రోడ్, సైనేజ్, లైటింగ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం షెల్టర్, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్రధాన ప్రవేశ దిశలో ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, లిఫ్ట్, ఎస్కలేటర్, 6 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· జార్ఖండ్:
· · బాల్సిరింగ్ స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్ఫారం షెల్టర్, పార్కింగ్, అప్రోచ్ రోడ్, దివ్యాంగజనుల మరుగుదొడ్డి, టికెట్ కౌంటర్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · బానో స్టేషన్: స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్రోచ్ రోడ్, స్టేషన్ లైటింగ్, ర్యాంప్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం షెల్టర్, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, తాగునీటి బూత్, దివ్యాంగజనుల మరుగుదొడ్డి పనులు చేపట్టారు.
· · గంగాఘాట్ స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్ఫారం షెల్టర్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, అప్రోచ్ రోడ్డు మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, దివ్యాంగజనుల సౌకర్యాల పనులు చేపట్టారు.
· · ఆర్గా స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్ఫారం షెల్టర్, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్, స్టేషన్ లైటింగ్, దివ్యాంగ జనుల మరుగుదొడ్డి మెరుగుదల పనులు పూర్తయ్యాయి. దివ్యాంగ జనుల పార్కింగ్ పనులు చేపట్టారు.
· · తతిసిల్వాయి స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, ప్లాట్ఫారం షెల్టర్, వెయిటింగ్ హాల్, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్, సైనేజ్ల మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· పాలి లోక్సభ నియోజకవర్గం:
· · ఫల్నా స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్లాట్ఫారం షెల్టర్, సర్క్యులేటింగ్ ఏరియా పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · జవాయి బంద్ స్టేషన్: ప్రధాన స్టేషన్ భవనం, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్లాట్ఫారం నంబర్ 1 వద్ద ప్లాట్ఫారం షెల్టర్ పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం నంబర్ 2 వద్ద ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్లాట్ఫారం నంబర్ 1 వద్ద లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · మార్వార్ జంక్షన్ స్టేషన్: ప్రధాన స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ప్రాంతం పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫారం షెల్టర్, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్లాట్ఫారం నంబర్ 1 వద్ద లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.
· · రాణి స్టేషన్: దివ్యాంగజనులకు ప్రధాన, రెండో ప్రవేశద్వారం వద్ద స్టేషన్ భవనం, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్లాట్ఫారం షెల్టర్, సర్క్యులేటింగ్ ఏరియా, స్పర్శ మార్గం పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్ పనులు చేపట్టారు.
· జల్గావ్ లోక్సభ నియోజకవర్గం:
· · అమల్నేర్ స్టేషన్: ప్లాట్ఫారం నంబర్ 1 విస్తరణ, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్లాట్ఫారం నంబర్ 2 వద్ద ప్లాట్ఫారం షెల్టర్, అప్రోచ్ రోడ్ పనులు పూర్తయ్యాయి. ఉత్తరం వైపున కొత్తగా రెండో ప్రవేశ భవనం, కాంకోర్స్తో కూడిన కొత్త భవనం ఫినిషింగ్ పనులు చేపట్టారు.
· · చాలిస్గావ్ స్టేషన్: ప్లాట్ఫారం సర్ఫేసింగ్, ప్లాట్ఫారం షెల్టర్, మరుగుదొడ్ల పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ల్యాండ్స్కేపింగ్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెరుగుదల పనులు చేపట్టారు.
· · పచోరా జంక్షన్ స్టేషన్: రెండో ప్రవేశద్వారం వద్ద కొత్త బుకింగ్ కార్యాలయం, ప్రధాన ప్రవేశద్వారం వైపు ఉన్న బుకింగ్ కార్యాలయం మెరుగుదల, ప్లాట్ఫారం షెల్టర్, ప్లాట్ఫారం సర్ఫేసింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, రెండు వైపులా పార్కింగ్, ప్రహరీ గోడ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మరుగుదొడ్డి బ్లాక్ మెరుగుదల పనులు చేపట్టారు.
· ఇంకా, భారతీయ రైల్వేల్లో స్టేషన్ల అభివృద్ధి / పునరాభివృద్ధి / అప్గ్రేడేషన్ / ఆధునికీకరణ నిరంతర, కొనసాగుతున్న ప్రక్రియగా జరుగుతోంది. ఈ విషయంలో పనులు అవసరానికి అనుగుణంగా చేపట్టుతున్నారు. పరస్పర ప్రాధాన్యం, నిధుల లభ్యతకు లోబడి పనులు చేపడుతున్నారు. స్టేషన్ కేటగిరీ / పరిస్థితి / ట్రాఫిక్ నిర్వహణ మొదలైన వాటి ఆధారంగా స్టేషన్ అభివృద్ధి / పునరాభివృద్ధి / అప్గ్రేడేషన్ / ఆధునికీకరణ జరుగుతుంది.
· ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కోసం గుర్తించిన స్టేషన్ల పేర్లు కింది విధంగా ఉన్నాయి:
· కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖా మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో ప్రశ్నలకు సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.
(రిలీజ్ ఐడి: 2239289)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20