ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దండి యాత్రలో పాల్గొన్న వారికి ప్రధానమంత్రి నివాళులు సత్యానిదే జయమని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 10:34AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. 1930వ సంవత్సరం ఇదే రోజు మొదలైన దండి యాత్రలో పాల్గొన్న మహనీయులందరికీ నివాళులు అర్పించారు.

సత్యానిదే గెలుపు అని స్పష్టం చేస్తున్న ఈ కింది సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధాని పంచుకున్నారు.

‘‘సత్యమేవ జయతి నానృతం సత్యేన పన్థా వితతో దేవయాన:

యేనాక్రమన్త్‌రుషయో హ్యాప్తకామా యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్’’.

నిజానిదే ఎల్ల వేళలా పైచేయి అవుతూ ఉంటుందిఅబద్ధం చివరకు మాసిపోతుందిఈ కారణంగారుషులు ఏ మార్గంలో అయితే నడచి బ్రహ్మానందాన్ని పొందడమే కాక పరమ సత్యాన్ని కూడా గ్రహించారో.. ఆ దారినే మనం అనుసరించాలని ఈ సుభాషితం సూచిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘1930వ సంవత్సరంలో ఇదే రోజున దండి యాత్రను మొదలుపెట్టారుదీనిలో పాల్గొన్న మహనీయులందరినీ శ్రద్ధ పూర్వకంగా స్మరించుకొందాం.

సత్యమేవ జయతి నానృతం సత్యేన పన్థా వితతో దేవయాన:

యేనాక్రమన్త్‌రుషయో హ్యాప్తకామా యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2238762) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam