ప్రధాన మంత్రి కార్యాలయం
దండి యాత్రలో పాల్గొన్న వారికి ప్రధానమంత్రి నివాళులు సత్యానిదే జయమని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 10:34AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. 1930వ సంవత్సరం ఇదే రోజు మొదలైన దండి యాత్రలో పాల్గొన్న మహనీయులందరికీ నివాళులు అర్పించారు.
సత్యానిదే గెలుపు అని స్పష్టం చేస్తున్న ఈ కింది సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధాని పంచుకున్నారు.
‘‘సత్యమేవ జయతి నానృతం సత్యేన పన్థా వితతో దేవయాన:
యేనాక్రమన్త్రుషయో హ్యాప్తకామా యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్’’.
నిజానిదే ఎల్ల వేళలా పైచేయి అవుతూ ఉంటుంది. అబద్ధం చివరకు మాసిపోతుంది. ఈ కారణంగా, రుషులు ఏ మార్గంలో అయితే నడచి బ్రహ్మానందాన్ని పొందడమే కాక పరమ సత్యాన్ని కూడా గ్రహించారో.. ఆ దారినే మనం అనుసరించాలని ఈ సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘1930వ సంవత్సరంలో ఇదే రోజున దండి యాత్రను మొదలుపెట్టారు. దీనిలో పాల్గొన్న మహనీయులందరినీ శ్రద్ధ పూర్వకంగా స్మరించుకొందాం.
సత్యమేవ జయతి నానృతం సత్యేన పన్థా వితతో దేవయాన:
యేనాక్రమన్త్రుషయో హ్యాప్తకామా యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2238762)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam