రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారులపై భద్రతను, భాగస్వామ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు వాణిజ్య వాహన సేవల వేదికలతో ఎన్హెచ్ఏఐ అవగాహన ఒప్పందం
జాతీయ రహదారులపై భద్రత, సామర్థ్యం, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచేలా వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం, సాంకేతిక ఆధారిత పరిష్కారాల కోసం అగ్రిగేటర్ వేదికలను ఉపయోగించుకొనేందుకు వీలు కల్పిస్తున్న ఎంవోయూ
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 6:01PM by PIB Hyderabad
వాణిజ్య వాహన డ్రైవర్లకు, ఫ్లీట్ ఆపరేటర్లకు ‘రవాణా సౌలభ్యాన్ని’ మెరుగుపరిచే లక్ష్యంతో ఎన్హెచ్ఏఐ సహకారమందిస్తోన్న ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) సంస్థ వాణిజ్య వాహన సేవల వేదికలతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాణిజ్య వాహన డ్రైవర్లకు, ఫ్లీట్ ఆపరేటర్లకు భద్రతను, సామర్థ్యాన్ని, వినియోగదారు అనుభవాన్ని పెంపొందించేలా విభిన్న వ్యవస్థల మధ్య సమన్వయానికి, సాంకేతిక ఆధారిత పరిష్కారాలను ఉపయోగించుకొనేందుకు ఎంవోయూ వీలు కల్పిస్తుంది. ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఐహెచ్ఎంసీఎల్ సీఎండీ శ్రీ విశాల్ చౌహాన్, ఎన్హెచ్ఏఐ, ఐహెచ్ఎంసీఎల్కు చెందిన ఉన్నతాధికారులు, అయిదు సేవా వేదికలు - వీల్స్ఐ టెక్నాలజీ ఇండియా, బ్లాక్బక్, ట్రక్సప్ సొల్యూషన్స్, ట్రక్సువిధ – సర్వోదయ ఇన్ఫోటెక్, సాఫ్రన్ నేవిగేటర్స్ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ రహదారులపై సురక్షితమైన, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ విధానాలను పాటించిన డ్రైవర్లకు ‘విశిష్ట సారథి’ పురస్కారాన్ని ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2238284)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9