పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌లోని చత్‌రా జిల్లాలో బీచ్‌క్రాఫ్ట్ సీ90 వీటీ-ఏజేవీ ఎయిర్ అంబులెన్స్‌ దుర్ఘటనపై డీజీసీఏ ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 23 FEB 2026 11:38PM by PIB Hyderabad

‘‘రాంచీ-ఢిల్లీ’’ సెక్టరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 వీటీ-ఏజేవీ ఎయిర్ అంబులెన్స్ 2026 ఫిబ్రవరి 23న జార్ఖండ్‌లోని చత్‌రా జిల్లా కాసరియా పంచాయతీలో కూలిపోయిందిఆ విమానంలో ఇద్దరు సిబ్బంది సహా ఏడుగురు ఉన్నారువిమానం భారతీయ కాలమానం రాత్రి గంటల 11 నిమిషాలకు రాంచీ నుంచి బయల్దేరిందికోల్‌కతాతో సమాచార సంబంధం ఏర్పరుచుకున్న తరువాతవాతావరణం కారణంగా దారితప్పిందిరాత్రి గంటల 34 నిమిషాల సమయంలో విమానం కోల్‌కతాతో రాడార్ సహా సమాచార సంబంధాలను కోల్పోయిందిఅప్పటికి విమానం వారణాసికి ఆగ్నేయంగా దాదాపు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉందిఅంతలో జిల్లా పాలనా యంత్రాంగానికి చెందిన సహాయక బృందం అక్కడికి చేరుకొందిదర్యాప్తు కోసం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీబృందాన్ని రంగంలోకి దింపుతున్నారుమరింత సమాచారాన్ని వీలువెంబడి తెలియజేస్తారు.


(రిలీజ్ ఐడి: 2232315) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी