ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

కంప్యూటింగ్ సౌలభ్యం నుంచి ఆవిష్కరణ సామర్థ్యం దిశగా పరివర్తనను చాటిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 సదస్సు


· ‘ఏఐ సన్నద్ధత: కంప్యూటింగ్ నుంచి కార్యదక్షత దిశగా...’ శీర్షికన సదస్సు... అందుబాటులో ఉన్న జీపీయూలను భారీగా, మార్కెట్ సన్నద్ధంగా నిలపడంపై ప్రధానంగా చర్చలు

· కంప్యూటింగ్ సదపాయంతోపాటు మార్పును అందిపుచ్చుకోవడమూ కీలకమే... అప్పుడే చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో వేగంగా ఏఐ వినియోగం: ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ స్టార్టప్ హబ్ సీఈవో డాక్టర్ పనీర్ సెల్వం

· ఏఐలో పోటీతత్వాన్ని పెంపొందించేలా.. తెలివైన పెట్టుబడులూ, అందుబాటులో ఉండే ప్రయోగాత్మక వాతావరణమూ, బలమైన పరిశోధన - అభివృద్ధి వ్యవస్థల దిశగా పిలుపునిచ్చిన నిపుణులు

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 5:02PM by PIB Hyderabad

జనరేటివ్ ఏఐ ప్రస్తుతం ప్రయోగాత్మక దశ నుంచి భారీ స్థాయి ఉత్పాదక విస్తరణ దిశగా అడుగులు వేస్తోందిఈ క్రమంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ‘ఏఐ సన్నద్ధతకంప్యూటింగ్ నుంచి కార్యదక్షత దిశగా’ అనే అంశం ఇతివృత్తంగా నిర్వహించిన సదస్సు ఒక కీలకమైన అంశంపై దృష్టి సారించిందిజీపీయూల లభ్యతను వాస్తవిక ఆవిష్కరణ సామర్థ్యంగా ఎలా మార్చాలన్న అంశంపై ఇందులో ప్రధానంగా చర్చ సాగిందిచాలావరకూ పెద్దగా దృష్టి సారించకపోయినాఇదొక నిర్ణయాత్మక ప్రశ్నకేవలం గరిష్ట కంప్యూటింగ్ ప్రదర్శన వెంటే పరుగులు తీయకుండా... అవస్థాపన వ్యవస్థను రూపొందించుకోవడంసాఫ్ట్‌వేర్ వాతావరణంనిర్దిష్ట ఏఐ పనితీరుతోపాటు మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలను రూపొందించుకునే దిశగా స్పష్టమైన మార్పు ఈ చర్చలో కనిపించింది.

ఇండియా ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న దేశీయ అంకుర సంస్థలుడెవలపర్ల ముందున్న సవాలు కేవలం హార్డ్‌వేర్ లభ్యత మాత్రమే కాదని వక్తలు పేర్కొన్నారుఏం నిర్మించాలి.. దానిని ఎలా ఆప్టిమైజ్ చేయాలి.. ఎప్పటికప్పుడు దాన్ని ఎలా విస్తరించాలన్నదే అసలైన సవాలని వారు అభిప్రాయపడ్డారుప్రస్తుతం జీపీయూ ఎంపిక అనేది మెమరీ నిర్మాణంఅంతర్గత అనుసంధాన సామర్థ్యంవ్యయ నియంత్రణవిస్తరణ పద్ధతులపై ఆధారపడి ఉందన్నారుఈ నేపథ్యంలో ఏఐ సన్నద్ధత... కేవలం ప్రాసెసింగ్ శక్తికి సంబంధించింది మాత్రమే కాదనీసాంకేతిక నిర్ణయాధికారమూ సంస్థాగత మార్పులపై కూడా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఎలక్ట్రానిక్స్ఐటీ మంత్రిత్వ శాఖ స్టార్టప్ హబ్ సీఈవో డాక్టర్ ఎంపన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మన దేశంలో ఏఐ వినియోగం పెరగాలంటే కేవలం కంప్యూటింగ్ శక్తిసాంకేతిక సామర్థ్యం ఉంటే సరిపోదని.. మార్పునకు అనుగుణంగా వ్యవస్థలను సిద్ధం చేయడం కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారుముఖ్యంగా చిన్నమధ్య తరహా పరిశ్రమలుపాత తరం వ్యాపార సంస్థలు ఈ సరికొత్త సాంకేతికతను స్వీకరించే క్రమంలో సవాళ్లను అధిగమించాలంటే ఈ మార్పు అనివార్యమని అభిప్రాయపడ్డారుఆయన మాట్లాడుతూ గతంలో సాఫ్ట్‌వేర్ ముందుగా పెద్ద సంస్థల ద్వారా వినియోగంలోకి వచ్చి.. తర్వాతే సామాన్యుల వ్యక్తిగత వినియోగానికి వచ్చేదన్నారుఅయితేఇప్పుడు అందుకు భిన్నంగా అత్యంత ఆసక్తికరమైన మార్పు మనకు కనిపిస్తోందన్నారుఆ విధంగా అది శక్తిమంతమైనదికంప్యూటింగ్ నుంచి కార్యాచరణ సమర్థత (కేపబిలిటీవరకు... కృత్రిమ మేధ దిశగా సంసిద్ధతపై చర్చల్లో మరో ‘సి’మార్పులను అందిపుచ్చుకోవడం (చేంజ్ మేనేజ్మెంట్కూడా భాగం కావాల్సిన అవసరం ఉందని పన్నీర్ సెల్వం అన్నారుదాదాపుగా ఒక రిటైల్ శక్తిగా మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. వ్యాపార సంస్థలుముఖ్యంగా చిన్నమధ్యతరహా పరిశ్రమలుఅంకుర సంస్థలు ఈ అవకాశాన్ని గుర్తించాల్సిన ప్రాథమిక ఆవశ్యకత ఉందన్నారుఅయితేదేశంలోని పాత తరం వ్యాపార సంస్థల విషయానికి వస్తే.. అక్కడ చిన్నమధ్య తరహా సంస్థలు ఎక్కువగా యజమాని-ప్రొప్రైటర్ లేదా కుటుంబ నిర్వహణలో ఉంటాయి కాబట్టివాటికి ఎదురయ్యే సవాళ్లు విభిన్నమైనవిగా ఉంటాయని వివరించారు.

డేటాసెంటర్ జీపీయూ ఈఎంఈఏఐ – ఏపీఈజే విభాగం ఏఐ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ తిమోతీ రాబ్సన్ మాట్లాడుతూ... ఒక సానుకూల వ్యవస్థ వికాసాన్ని వేగవంతం చేయడంలో తెలివైన పెట్టుబడులూసులభంగా అందుబాటులో ఉండే ప్రయోగాత్మక వాతావరణమూ అత్యంత ప్రధానమైనవని స్పష్టం చేశారు. ‘‘భారీ పెట్టుబడులకు ముందు.. సాంకేతికతనుమార్కెట్‌లోకి ప్రవేశ మార్గాన్ని సంస్థలు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కీలకంప్రవేశానికి గల అవరోధాలను తగ్గించడం ద్వారా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాందేవ్ క్లౌడ్ వంటి కార్యక్రమాల ద్వారాఉచిత కంప్యూట్ అవర్స్ ద్వారా.. డెవలపర్లు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా పరీక్షలు చేసుకునేలా మేం వీలు కల్పిస్తున్నాంతక్కువ వ్యయంతో కూడిన పరిష్కారాలను (టీసీవోఅందించడం ద్వారా.. అంకుర సంస్థల వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలనూఆర్థిక సామర్థ్యాన్నీ ఏఎండీ అందిస్తోంది’’ అని ఆయన వివరించారు.

ఏఎండీ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాలుప్రజా విధానాల విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ థామస్ జకారియా మాట్లాడుతూ.. కృత్రిమ మేధలో అంతర్జాతీయ నేతృత్వాన్ని నిర్ణయించడంలో పరిశోధనల విస్తృతిఆవిష్కరణ వ్యవస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ‘‘ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న దేశాలను గమనిస్తే.. బలమైన పరిశోధన అభివృద్ధి వ్యవస్థఆవిష్కరణలు పునాదిగా ఉండడం వల్లే అవి ఆ స్థాయికి చేరుకున్నాయని నేను భావిస్తున్నానుప్రతి విషయాన్నీ ప్రశ్నిస్తూ.. అది సరైనదాకాదా అని ధ్రువీకరించుకునే వ్యక్తులు అక్కడ ఉండడమే దీనికి కారణంకొత్త ఆలోచనలను స్వీకరించివాటిని నూతన కంపెనీలుగా మార్చడానికి ఎప్పటికప్పుడు ఆవిష్కరణ ప్రయోగాలను (ఇన్నొవేషన్ ల్యాబ్స్మొదలుపెడుతూ ఉండాలికొత్త ఆలోచనలుఅవకాశాలు ఉన్న వ్యక్తులే ఈ సరికొత్త సాంకేతికతలను ముందుకు నడుపుతున్నారుఅయినప్పటికీ అంతిమంగా సంస్థలుప్రభుత్వ రంగం అందిపుచ్చుకుంటే అవి పురోగమిస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘కేవలం కంప్యూటింగ్ శక్తి వల్ల మాత్రమే కాదు.. బలమైన పరిశోధన వ్యవస్థలుఅంకుర సంస్థల భాగస్వామ్యంమార్కెటు స్పష్టత ద్వారామౌలిక సదుపాయాలను ఆవిష్కరణలుగా రూపుదిద్దగల సామర్థ్యమే కృత్రిమ మేధ రంగంలో అంతర్జాతీయ అగ్రస్థానానికి ప్రాతిపదిక’’ అన్న స్పష్టమైన సందేశాన్ని ఈ సదస్సు అందించిందిభారత్ తన సొంత కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూజాతీయ వేదికల ద్వారా దానిని అందరికీ అందుబాటులోకి తెస్తున్న తరుణమిదివాస్తవిక కార్యాచరణతోపాటుఅంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సాధనాలుగా ఈ సామర్థ్యాలను ఎంత ప్రభావవంతంగా వినియోగించుకుంటామన్నదే తదుపరి దశకు మూలాధారం.  

 

***


(రిలీజ్ ఐడి: 2232309) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada