జల శక్తి మంత్రిత్వ శాఖ
‘సుజలం భారత్’లో మాస్టర్ ట్రయినర్స్కు శిక్షణను నిర్వహించిన డీడీడబ్ల్యూఎస్..
సుజల్ గావ్ ఐడీ, జిల్లా సాంకేతిక విభాగాలతో డిజిటల్ జల పరిపాలనను వేగవంతం చేసిన ప్రభుత్వం
గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలకు కీలక డిజిటల్ సార్వజనిక మౌలిక సదుపాయం.. ‘సుజల్ గావ్ ఐడీ’
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 7:18PM by PIB Hyderabad
దేశంలో 81 శాతానికన్నా ఎక్కువ గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ (జేజేఎమ్) సేవలను ప్రస్తుతం అందిస్తున్నారు. దీంతో, ఈ మిషన్ క్రమంగా తన దృష్టిని మౌలిక సదుపాయాల కల్పన దశ నుంచి ఇక గ్రామీణ ప్రాంతాలకు నీటిని గొట్టపు మార్గం ద్వారా సరఫరా చేసే వ్యవస్థలను ప్రమాణాల మేరకు నిర్వహించడం, మరమ్మతు, పర్యవేక్షణల వైపునకు మళ్లిస్తోంది. ఈ దిశగా, జల శక్తి శాఖలోని తాగు నీరు, పారిశుధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) సుజలం భారత్ డేటాబేస్, మొబైల్ అప్లికేషన్ వేదికపై మాస్టర్ ట్రయినర్లకు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఎస్సీఓపీఈ భవన సముదాయంలో 2026 ఫిబ్రవరి 12న చేపట్టింది. దీంతో పాటు జిల్లా సాంకేతిక విభాగ (డిస్ట్రిక్ట్ టెక్నికల్ యూనిట్.. డీటీయూ) ప్రణాళికలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
సుజలం భారత్ డేటాబేస్ (ఆర్పీడబ్ల్యూఎస్ఎస్ మాడ్యూల్)పైనా, మొబైల్ అప్లికేషన్పైనా డీడీడబ్ల్యూఎస్ అధికారులు ఒక ప్రజెంటేషన్ను ఇచ్చారు. ఇది ‘మూలంలో నుంచి ఇంటి వరకూ’ గ్రామీణ నీటి సరఫరా పథకాలకు సంబంధించిన ఒక సంపూర్ణ, జియో-ట్యాగ్ను కలిగి ఉండే డిజిటల్ రిజిస్టర్ని అందిస్తుంది. దీంతో బలమైన సార్వజనిక మౌలిక సదుపాయాలకు పునాది ఏర్పడుతుంది. పథకాన్ని ఏకీకరించడం, విశిష్ట సుజలం భారత్, సుజల్ గాఁవ్ ఐడీని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్లాట్ఫారమ్ మౌలిక సదుపాయాల్నీ, నిర్వహణ కార్యకలాపాల్నీ, నీటి నాణ్యతనీ, సేవలకు సంబంధించిన సమాచారాన్నీ సంధానిస్తుంది. ఫలితంగా క్రియాత్మక సాముదాయిక భాగస్వామ్యంతో పాటు మెరుగైన పారదర్శకత, జవాబుదారుతనం, పరిపాలనకు మార్గం సుగమం అవుతుంది.
సుజల్ గావ్ ఐడీ: గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ఒక ఏకీకృత డిజిటల్ రిజిస్ట్రీని రూపొందించడం
ఉదయం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆర్పీడబ్ల్యూఎస్ఎస్ మాడ్యూలు, సుజల గావ్ ఐడీ రూపకల్పనలతో పాటు సుజలం భారత్ యాప్.. వీటి ఆచరణీయ సాంకేతిక నిర్వహణాంశాలపైన దృష్టిని కేంద్రీకరించారు. ఆర్పీడబ్ల్యూఎస్ఎస్ ఐడీని తయారు చేయడానికి సంబంధించిన సాంకేతిక శిక్షణను ఎన్ఐసీ అధికారులు అందించారు. జేజేఎమ్ 2.0 డ్యాష్బోర్డులో ఐడీ రూపకల్పన తాలూకు పూర్తి ప్రక్రియను వివరించారు. తరువాత ప్రశ్నలు- జవాబుల కార్యక్రమాన్ని నిర్వహించారు.
తదనంతరం, సుజలం భారత్ మొబైల్ అప్లికేషనుకు సంబంధించిన సమగ్ర శిక్షణను చేపట్టారు. దీనిలో జియో-రిఫరెన్సింగ్ ప్రక్రియలు, గ్రామీణ నీటి సరఫరా కేంద్రాలను సుజలం భారత్ వేదికపై ఏకీకరించడమెలాగన్నది తెలియజేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్చలలో చురుకుగా పాల్గొని, నిర్వహణ, సాంకేతిక అంశాలపై వివరణలను కోరాయి.
రాష్ట్రాలు ఇప్పటికే మాడ్యూల్లో డేటాను పొందుపరచడంతో పాటు యాప్ ద్వారా కేంద్రాల జియో-ట్యాగింగును మొదలుపెట్టాయి. ఇది గ్రామీణ తాగు నీటి మౌలిక సదుపాయాల ఏకీకరణ, జీఐఎస్తో ముడిపెట్టిన డిజిటల్ అసెట్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసే దిశగా కీలక ప్రగతిని సూచిస్తోంది.
జిల్లా సాంకేతిక విభాగాలు: ఉపయోగం ఆధారిత, సేవా ప్రధాన నమూనా వైపు మళ్లడం
మధ్యాహ్న కార్యక్రమాల్లో భాగంగా జిల్లా సాంకేతిక విభాగం (డీటీయూ) ప్రణాళికపై శ్రద్ధ తీసుకున్నారు. ఇది జల్ జీవన్ మిషన్ విస్తారిత దశలో భాగంగా ఒక వ్యూహాత్మక సంస్థాగత సంస్కరణకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నది. డాడీడబ్ల్యూఎస్ అధికారులు డీటీయూపై ఒక సమగ్ర ప్రజెంటేషన్ను ఇచ్చారు.
జేజేఎం ప్రారంభ దశలో సార్వజనీన కుటుంబ నల్లా కనెక్షన్లను అందుకోవడానికి సత్వరం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అదే సమయంలో, తరువాతి దశకు వచ్చేసరికి దీర్ఘకాలిక పనితీరు, స్థిరత్వం, విశ్వసనీయ సేవల అందజేతపై దృష్టి సారించారు. డీటీయూను జిల్లా స్థాయి గ్రామీణ నీటి నిరన్వహణ తాలూకు సాంకేతిక వెన్నెముకగా లక్షించారు. ఇది జిల్లా జల, పారిశుధ్య మిషన్ (డీడబ్ల్యూఎస్ఎమ్)కు సంబంధించిన విస్తారిత సాంకేతిక శాఖలా పనిచేస్తుంది. ఈ ఫ్రేంవర్కు సంబంధిత విభాగాలతోనూ, నిపుణత కలిగిన సంస్థలతోనూ సమన్వయం నెలకొల్పుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే పీహెచ్ఈడీ అధికారులు, నీటి నాణ్యత సిబ్బంది, సాంకేతిక సలహాదారుల వ్యవస్థ ద్వారా సాంకేతిక పర్యవేక్షణను ఇది సమర్ధిస్తుంది.
డిజిటల్ పరిపాలన యంత్రాంగాల్ని స్వీకరించడం డీటీయూ ప్రణాళికలో ఓ కీలకాంశంగా ఉంది. దీనిలో అన్ని గ్రామీణ నీటి సరఫరా పథకాల్నీ సుజలం భారత్ జీఐఎస్-లింక్డ్ డిజిటల్ అసెట్ రిజిస్ట్రీలో సంధానించడంతో పాటు జల సేవా ఆంకలన్ (జేఎస్ఏ)కు నాయకత్వం వహించడం భాగంగా ఉంటాయి. ఈ ఫ్రేంవర్కు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వ్యవస్థలో వైఫల్యాల్ని తగ్గించడానికి డిజిటల్ ట్విన్స్, ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్, నివారణ ప్రధాన నిర్వహణ వ్యూహాల వంటి డిజిటల్ ఉపకరణాలను ఉపయోగించడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. జల సేవా ఆంకలన్లో డీటీయుల పాత్ర, బాధ్యతలను గురించి ఎన్పీఎంయూ-పీహెచ్ఈ, ఎన్జేజేఎమ్ బృందం నాయకుడు శ్రీ అబ్సార్ ఖాన్ వివరంగా తెలిపారు. జేఎస్ఏ ఫార్మాట్ విస్తృత వివరణనూ అందించారు. దీని తరువాత ప్రశ్నలూ, జవాబుల కార్యక్రమాన్ని చేపట్టారు.
భారత్ పూర్తి స్థాయిలో డిజిటలీకరించిన, సేవల అందజేతలో సమర్థమైన జల సంబంధిత మౌలిక సదుపాయాల అనుబంధ విస్తారిత వ్యవస్థ దిశగా పురోగమిస్తున్న తరుణంలో, ఏ జనావాసాన్నీ పట్టించుకోకుండా ఉండరాదని ప్రభుత్వం నిబద్ధతను వ్యక్తం చేస్తోందని డీడీడబ్ల్యూఎస్ సంయుక్త కార్యదర్శి (నీరు) శ్రీమతి స్వాతి మీనా నాయక్ స్పష్టం చేశారు. ఆమె కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రతి ఒక్క బస్తీకీ ఎల్జీడీ కోడ్తో ముడిపడి ఉండే ఒక విశిష్ట డిజిటల్ గుర్తింపును కేటాయిస్తారనీ, అది అన్ని పథకాలకూ ఆధారభూతంగా ఉండే ‘సుజల్ గ్రామ్ ఐడీ కి మదర్ ఐడీ’ని ఏర్పరుస్తుందనీ తెలిపారు. ఇది ఉన్నత పనితీరు కల డీటీయూ వ్యవస్థను ఉపయోగించుకొని రాష్ట్రం స్థాయిలో ఖచ్చితమైన, పురోగామి డిజిటల్ ట్విన్ ఆధారిత సిమ్యులేషనుకు మార్గాన్ని సుగమం చేస్తుందన్నారు. భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను సంధానించి విద్యుత్తు కంపెనీలు విశ్వసనీయతలోనూ, నిర్వహణ సామర్థ్యంలోనూ, ముందస్తు అంచనాతో కూడిన మరమ్మతులలోనూ ఉన్నత ప్రమాణాల్ని అందుకోగలుగుతాయని ఆమె వివరించారు. ఈ మార్పు సేవ స్థాయుల దక్షతను దాదాపు 100 శాతానికి పెంచుతుందనీ, ఇంజినీర్లకు అత్యాధునిక ఉపకరణాల హంగులను కల్పిస్తుందనీ, పారదర్శక, డేటా ఆధారిత నీటి సేవల అందజేత దిశగా దేశ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందనీ ఆమె ఉద్ఘాటించారు.
సీనియర్ అధికారులు జిల్లా స్థాయిలో వృత్తిపరంగా సాంకేతిక సహాయ వ్యవస్థల ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ అభిప్రాయాల్ని పంచుకొన్నారు. మరికొందరు సీనియర్ అధికారులు కూడా ప్రసంగించారు. తరువాత చర్చా కార్యక్రమం ముగిసింది.
2047 కల్లా వికసిత్ భారత్ ఆశయ సాధనను దృష్టిలో పెట్టుకొని సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడం
కార్యక్రమం ముగింపులో, ఎన్జేజేఎమ్ డీడీడబ్ల్యూఎస్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టరు శ్రీ కమల్ కిశోర్ సొవాన్ ప్రసంగించారు. 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అనుగుణంగా శాశ్వత గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలను అందించడంలో డిజిటల్ పారదర్శకత, సంస్థాగత పటిష్ఠీకరణ, సేవల స్థాయిపై ఆధారపడి ఉండే నిర్వహణలకు పెద్ద పీట వేయాలని శ్రీ సొవాన్ స్పష్టం చేశారు. డిజిటల్ నీటి నిర్వహణను బలోపేతం చేయడంపై జేజేఎమ్ దృష్టిని కేంద్రీకరిస్తోందనీ, మరమ్మతుల కోసం గొట్టపు మార్గాలను మూసివేయడం కావచ్చు... లేదా అంతర పథక అనుసంధానాలు కావచ్చు, లేదా ఆర్థిక సర్దుబాట్లు కావచ్చు.. ‘మూలం నుంచి నల్లా వరకూ’ సేవల సంపూర్ణ వ్యవస్థలో డేటా చోదకశక్తిగా ఉండే దృష్టికోణాన్ని జిల్లాలు అనుసరించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు. మ్యాపింగ్, మూలానికి సంబంధించిన వివరాలు, నిర్వహణకు సంబంధించిన సమస్యలను విస్పష్ట సమాచారాన్ని అందించడంతో పాటు కాలానుగుణమైన దిద్దుబాటు చర్యలను కూడా చేపడితే ప్రతి ఒక్క కార్యకలాపాన్నీ సమంజసంగా, పారదర్శకంగా, దీర్ఘకాలం పాటు పథకం కొనసాగేలా చూడాలని తెలిపారు. నివారణ ప్రధాన వ్యవస్థలకు సంస్థాగత రూపాన్నివ్వడంతో పాటు క్షేత్ర బృందాలు, సాంకేతిక విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం ద్వారా ‘మూలం మొదలు ఇంటి నల్లా వరకూ’ సేవలలో అంతరాయాలను తగ్గించవచ్చని వివరించారు. దీంతో గ్రామీణ నీటి సరఫరా సేవలపై ప్రజలకు నమ్మకం బలపడుతుందన్నారు. జిల్లా కలెక్టరుకు డీటీయూ ఇన్ఛార్జి అధికారి రిపోర్టు చేస్తారనీ, డీటీయూ పనితీరునూ, తాగు నీటి సేవల అందజేతనూ క్రమం తప్పకుండా ప్రతి నెలా సమావేశాల్ని నిర్వహించి సమీక్షిస్తారనీ శ్రీ సొవాన్ వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడమే కాక పరస్పరం పంచుకోవాల్సిందిగా మాస్టర్ ట్రయినర్లందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం, జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలో ఫిబ్రవరిలో కనీసం ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దీనిలో భాగంగా ఉంటుంది.
శిక్షణ కార్యక్రమంలో పీహెచ్ఈడీ ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది, రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నామినేషన్ను పొందిన సలహాదారులు పాల్గొంటారు. వారు ఇకపై రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో మాస్టర్ ట్రయినర్, రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తారు. దీంతో శిక్షణ కాలంలో తాము సంపాదించిన జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, సంస్థాగతీకరించడానికి మార్గం సుగమం అవుతుంది.
సుజల్ గావ్ ఐడీ, జిల్లా సాంకేతిక విభాగం ప్రణాళిక వంటి కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా, దేశమంతటా గ్రామీణ తాగు నీటి సేవల అందజేతలో డిజిటల్ పరిపాలననీ, జవాబుదారుతనాన్నీ, దీర్ఘకాలిక స్థిరత్వాన్నీ ఈ విభాగం బలోపేతం చేయనుంది.
****
(రిలీజ్ ఐడి: 2227617)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8