సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రాచీన వస్తువుల అక్రమ వ్యాపార నిరోధం
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 1:51PM by PIB Hyderabad
జాతీయ ప్రాధాన్యం కలిగిన కట్టడాల్లో ఆరు చోరీ కేసులు బయటపడ్డాయి. నాలుగు కేసుల్లో దొంగతనానికి గురైన వస్తువులను తిరిగి రాబట్టారు. (వివరాలు ఒకటో అనుబంధ పత్రంలో). అన్ని కేసులలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దొంగతనానికి గురైన వస్తువులేవీ దేశం బయటకు తరలిపోలేదు. పైన ప్రస్తావించిన పురాతన వస్తువుల విషయంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) మూల్య నిర్ధారణ పనిని చేపట్టలేదు.
సాంస్కృతిక సంపద అక్రమ వ్యాపారాన్ని అడ్డుకొనే దిశగా అవసరమైన అన్ని చర్యల్నీ ప్రభుత్వం చేపడుతుంది. పహరా రక్షణ సిబ్బందికి అదనంగా, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులతో పాటు కేంద్ర పారిశ్రామిక భద్రత దళ సిబ్బందిని కూడా ఆయా కట్టడాలు, స్థలాలు, మ్యూజియాల్లో అవసరమైన మేరకు విధుల్లో నియమించారు. ఏ పురావస్తు దొంగతనం జరిగినట్లు తెలిసినా, ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో పాటు చోరీ చేసిన ప్రాచీన వస్తువు జాడ కనుగొనడానికీ, ఆ వస్తువును దేశం బయటకు దొంగచాటుగా రవాణా చేయకుండా అడ్డగించడానికీ కస్టమ్ ఎగ్జిట్ మార్గాలు కాపు కాయడం సహా నేర నియంత్రణ సంస్థలకు ‘లుక్ అవుట్ నోటీసు’ను జారీ చేస్తారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే దిశగా ప్రజల్లో జాగృతిని పెంచే ప్రయత్నాల్ని నిరంతరంగా చేపడుతున్నారు.
ఒకటో అనుబంధ పత్రం
గత అయిదు సంవత్సరాల్లో జాతీయ ప్రాధాన్యం కలిగిన కట్టడాల్లో చోరీకి గురైన ప్రాచీన వస్తువుల వివరాలు
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
ప్రాచీన వస్తువులు చోరీకి గురైన కట్టడాలు, స్థలాల పేర్లతో పాటు అవి ఉన్న ప్రాంతం పేర్లు
|
చోరీకి లోనైన వస్తువు పేరు
|
దొంగతనం జరిగిన సంవత్సరం
|
స్థితి
|
|
1.
|
ఆంధ్రప్రదేశ్
|
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో గోలింగేశ్వర ఆలయ సముదాయం
|
నంది శిల్పం
|
2021
|
తిరిగి స్వాధీనం చేసుకున్నారు
|
|
2.
|
ఉత్తరాఖండ్
|
అల్మోడా జిల్లా ద్వారాహాట్లోని భైరవ్, మృత్యుంజయ్ ఆలయ సముదాయం
|
శివ లింగం
|
2021
|
తిరిగి స్వాధీనం చేసుకున్నారు
|
|
3.
|
జార్ఖండ్
|
హజారీబాగ్ జిల్లాలో సీతాగఢా పురావస్తు తవ్వకాల స్థలం
|
భూమిస్పర్శ ముద్రలో ఉన్న బుద్ధుని శిల్పాలు రెండు
|
2021
|
తిరిగి స్వాధీనం చేసుకున్నారు
|
|
4.
|
కర్నాటక
|
మండ్య జిల్లా మారెహళ్లిలోని లక్ష్మీనరసింహ ఆలయంలో గణపతి అమ్మ ఉపాలయం
|
గణపతి శిలా విగ్రహం
|
2022
|
-
|
|
5.
|
బీహార్
|
పాట్నా జిల్లా విక్రమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దతియానా గ్రామం
|
విష్ణు ప్రతిమ
|
2022
|
-
|
|
6.
|
తమిళనాడు
|
కన్యాకుమారి జిల్లా విలావన్కోడ్లోని పార్వతీపురంలో గల పార్థసారథి, కృష్ణ ఆలయాలు
|
విష్ణు విగ్రహం
|
2024
|
తిరిగి స్వాధీనం చేసుకున్నారు
|
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభలో ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2227050)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10