సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
రెంకే కమిషన్ సిఫార్సుల అమలు
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 11:46AM by PIB Hyderabad
విముక్త తెగలు, సంచార, పాక్షిక సంచార తెగల సమస్యల అధ్యయనానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2005 మార్చిలో రెంకే కమిషన్ (విముక్త, సంచార, పాక్షిక సంచార తెగల జాతీయ సంఘం)ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ జూలై 2008లో నివేదికను సమర్పించింది.
కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, విముక్త, సంచార, పాక్షిక సంచార తెగల (ఎన్సీడీఎన్టీ) కోసం మూడేళ్ల కాలపరిమితితో జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎన్సీడీఎన్టీ సిఫార్సు మేరకు ఫిబ్రవరి 2019లో విముక్త, సంచార, పాక్షిక సంచార తెగల అభివృద్ధి, సంక్షేమ బోర్డు ఏర్పాటైంది.
ఈ సామాజిక వర్గాల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం.. విముక్త, సంచార తెగల ఆర్థిక సాధికారత పథకం(సీడ్)ని 2022లో ప్రారంభించారు. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ సీడ్ పథకానికి రూ.200 కోట్లను కేటాయించారు.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్. వర్మ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2226529)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14