రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భువనేశ్వర్ రాజధాని ప్రాంత రింగు రోడ్డు నిర్మాణానికి బిడ్డర్ల నుంచి ఎన్హెచ్ఏఐకు అపూర్వ స్పందన
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2026 3:06PM by PIB Hyderabad
ఒడిశాలో 111 కి.మీ. పొడవైన ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్) ప్రాజెక్టు నిర్మాణానికి బిడ్డర్ల నుంచి ఎన్హెచ్ఏఐకి అపూర్వ స్పందన లభించింది. మూడు ప్యాకేజీలుగా చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించింది. అన్ని ప్యాకేజీలకు బిడ్డర్ల నుంచి ప్రోత్సాహకరమైన స్పందన లభించింది. ఈ ప్రాజెక్టులోని ప్యాకేజీ-Iకు 23, ప్యాకేజీ-IIకు 25, ప్యాకేజీ IIIకు 16 బిడ్లు వచ్చాయి. అన్ని ప్యాకేజీలకు ఉన్న పోటీని, వీటిపై టెండరుదారులకున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. మార్చి 2026 నాటికి బిడ్లు ఖరారవుతాయని భావిస్తున్నారు. ప్రాజెక్టులు కేటాయించిన వెంటనే పనులు ప్రారంభమవుతాయి. అలాగే 2.5 ఏళ్ల కాల పరిమితిలో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
కేంద్ర మంత్రి వర్గం ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్) ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. రామేశ్వర్ నుంచి టాంగీ వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో 111కి.మీ. పొడవైన రోడ్డును మూడు ప్యాకేజీలుగా ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8,307.74 కోట్లు. సుమారుగా 96 శాతం మేర భూసేకరణ పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీ, వన్యప్రాణి, పర్యావరణ అనుమతులు సైతం పూర్తయ్యాయి.
ప్రాంతీయ అనుసంధానాన్ని, భువనేశ్వర్, కటక్, ఖోర్ధా పట్టణ ప్రాంతాల్లో రద్దీని తగ్గించి రవాణాను ఈ క్యాపిటల్ రీజియన్ రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్) మెరుగుపరుస్తుంది. ఈ నియంత్రిత ప్రవేశం కలిగిన ఈ కారిడార్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. పెద్ద మొత్తంలో ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో సురక్షితమైన, వేగవంతమైన, సుస్థిరమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2225964)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4