ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: గుజరాత్‌లో జరిగిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 11 JAN 2026 2:29PM by PIB Hyderabad

జై సోమనాథ్.

జై సోమనాథ్.

ప్రజాదరణ కలిగిన గౌరవ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ఉత్సాహవంతుడైన యువ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు జితుభాయ్ వాఘానిఅర్జున్‌భాయ్ మోద్వాడియాడాక్టర్ ప్రద్యుమ్న వాజాకౌశిక్ భాయ్ వేకారియా.. పార్లమెంటు సభ్యుడు రాజేష్‌భాయ్ఇతర విశిష్ట అతిథులుసోదరీసోదరులారా.. ఈ రోజు దేశ నలుమూలలకు చెందిన లక్షలాది మంది ప్రజలు మనతో అనుసంధానమై ఉన్నారు.. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘సోమనాథుడికి విజయం కలుగుగాక’!!

మిత్రులారా

ఈ క్షణం అసాధారణమైనది.. ఈ వాతావరణం అసాధారణమైనది.. ఈ వేడుక అసాధారణమైనదిఒకవైపు దేవాది దేవుడైన మహాదేవుడు.. మరోవైపు సముద్రపు అనంతమైన కెరటాలు ఉన్నాయిసూర్యకిరణాలుపవిత్ర మంత్రాల ప్రతిధ్వనిభక్తి ప్రవాహంఈ దైవిక వాతావరణంలో సోమనాథుని భక్తులందరూ ఉండటం ఈ సందర్భాన్ని దైవికమైనదిగాఅద్భుతమైనదిగా మార్చిందిసోమనాథ్ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడిగా నాకు ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో చురుకుగా సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానుదయచేసి వెనుక నుంచి వస్తున్న శబ్దాన్ని ఆపండి.

72 గంటల పాటు నిరంతర ఓంకార నాదం, 72 గంటల పాటు నిరంతరాయంగా మంత్రోచ్ఛారణలు జరిగాయినిన్న సాయంత్రం వేద గురుకులాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులతో కలిసి వెయ్యి డ్రోన్‌లు సోమనాథ్ వెయ్యేళ్ల చరిత్రను ప్రదర్శించడాన్ని నేను స్వయంగా వీక్షించానుఈ రోజు మంత్రాలుస్తోత్రాలతో మనోహరమైన 108 గుర్రాల వీరోచిత ఊరేగింపులు ఆలయానికి చేరుకున్నాయిఇందులో ప్రతిదీ మంత్రముగ్ధులను చేసిందిఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.. కాలం మాత్రమే దీనిని భద్రపరచగలదుఈ వేడుక గర్వంగౌరవంవైభవంజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుందిఇది వైభవోపేతమైన వారసత్వాన్నిఆధ్యాత్మిక సారాన్నిఅనుభవంలోని ఆనందాన్నిసామూహిక అనుబంధాన్నిఅన్నింటికీ మించి ఆ మహాదేవుని ఆశీస్సులను కలిగి ఉందిరండి.. నాతో కలిసి అనండి.. నమః పార్వతీ పతయే... హర హర మహాదేవ్!

మిత్రులారా

నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా మనస్సు పదేపదే అడుగుతోంది.. సరిగ్గా వెయ్యి సంవత్సరాల క్రితం మీరు కూర్చున్న ఇదే ప్రదేశంలో వాతావరణం ఎలా ఉండి ఉంటుందిఈ రోజు ఇక్కడ ఉన్నవారుమీ పూర్వీకులుమన పూర్వీకులు ప్రాణాలను సైతం పణంగా పెట్టారువిశ్వాసం కోసంభక్తి కోసంమహాదేవుని కోసం వారు సర్వస్వాన్ని త్యాగం చేశారువెయ్యి సంవత్సరాల క్రితం ఆ దురాక్రమణదారులు విజయం సాధించినట్లు భావించారుకానీ వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ రోజు సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారతదేశానికి ఉన్న నిజమైన బలాన్నిశక్తిని మొత్తం సృష్టికి చాటిచెబుతోందిఈ ప్రభాస్ పటాన్ పవిత్ర భూమిలోని ప్రతి మట్టి రేణువు పరాక్రమానికిధైర్యానికివీరత్వానికి నిదర్శనంగా నిలుస్తోందిసోమనాథుని ఈ రూపం కోసం లెక్కలేనంత మంది శివ భక్తులులెక్కలేనంత మంది సాంస్కృతిక ఆరాధకులులెక్కలేనంత మంది సంప్రదాయ వాహకులు ప్రాణాలను అర్పించారుఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా సోమనాథుని రక్షణ కోసంఆలయ పునర్నిర్మాణం కోసం జీవితాలను అంకితం చేసి ఆ మహాదేవునికి సర్వస్వాన్ని సమర్పించిన ప్రతి వీరుడికివీర మహిళకు ముందుగా భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను.

సోదరీసోదరులారా

ఈ ప్రభాస్ పటాన్ క్షేత్రం కేవలం శివుని నివాసం మాత్రమే కాదు.. దీని పవిత్రత శ్రీకృష్ణ పరమాత్మతో కూడా ముడిపడి ఉందిమహాభారత కాలంలో పాండవులు కూడా ఈ పవిత్ర స్థలంలోనే తపస్సు చేశారుఅందుకే భారత్‌కు ఉన్న లెక్కలేనన్ని దృక్కోణాలకు నమస్కరించే ఒక గొప్ప అవకాశం ఈ సందర్భంసోమనాథ్ స్వాభిమానం వెయ్యేళ్ల ప్రయాణాన్ని మనం స్మరించుకుంటున్న తరుణంలోనే 1951లో ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తికావడం యాదృచ్ఛికమే అయినాసంతోషాన్ని కలిగించేదేసోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది కేవలం వెయ్యేళ్ల క్రితం జరిగిన విధ్వంసాన్ని గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు… ఇది వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన వేడుకఇది భారతదేశ ఉనికిఆత్మగౌరవానికి సంబంధించిన పండుగ కూడాఎందుకంటే ప్రతి అడుగులోనూప్రతి కీలక ఘట్టంలో సోమనాథ్‌కుభారత్‌‍కు మధ్య మనం అద్భుతమైన సరిపోలికలను చూడొచ్చుసోమనాథ్‌ను ధ్వంసం చేయడానికి ఎలాగైతే పదేపదే ప్రయత్నాలుకుట్రలు జరిగాయో అదే విధంగా విదేశీ ఆక్రమణదారులు శతాబ్దాల తరబడి భారతదేశాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారుఅయినప్పటికీ సోమనాథ్ నశించలేదు.. భారతదేశం కూడా అంతరించిపోలేదుఎందుకంటే భారత్దేశంలోని విశ్వాస కేంద్రాలు ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి.

మిత్రులారా

ఒక్కసారి ఆ చరిత్ర గురించి ఆలోచించండిసరిగ్గా వెయ్యి సంవత్సరాల క్రితం 1026 సంవత్సరంలో మహ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ్ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడుసోమనాథ్ ఉనికిని తుడిచిపెట్టేసినట్లు అతను భావించాడుకానీ కొన్ని సంవత్సరాల లోపే సోమనాథ్ పునర్నిర్మాణమైంది. 12వ శతాబ్దంలో కుమారపాల రాజు ఆలయానికి అద్భుతమైన పునరుద్ధరణ పనులను చేపట్టారు. 13వ శతాబ్దం చివరలో అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్లీ సోమనాథ్‌పై దాడి చేసే సాహసం చేశాడుఖిల్జీ సైన్యాలకు వ్యతిరేకంగా జలోర్ పాలకుడు వీరోచితంగా పోరాడారని చెబుతారువెంటనే 14వ శతాబ్దం ప్రారంభంలో జునాగఢ్ రాజు మరోసారి సోమనాథ్ పవిత్రతను పునరుద్ధరించారు. 14వ శతాబ్దం తర్వాతి కాలంలో ముజఫర్ ఖాన్ సోమనాథ్‌పై దాడి చేశాడుకానీ ఆ దాడి కూడా విఫలమైంది

15వ శతాబ్దంలో సుల్తాన్ అహ్మద్ షా.. ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించాడుఆ తర్వాత అతని మనవడు సుల్తాన్ మహమూద్ బెగడ.. సోమనాథ్‌ను మసీదుగా మార్చడానికి ప్రయత్నించాడుఅయినప్పటికీ మహాదేవుని భక్తుల కృషితో ఆ ఆలయం మరోసారి సజీవంగా మారింది. 17-18 శతాబ్దాలలో ఔరంగజేబు యుగం వచ్చిందిఅతను ఆలయ పవిత్రతను భంగపరిచి.. దానిని మసీదుగా మార్చడానికి మళ్ళీ ప్రయత్నించాడుఆ తర్వాత కూడా అహల్యాబాయి హోల్కర్.. కొత్త ఆలయాన్ని నిర్మించి సోమనాథ్‌ను మరోసారి సాక్షాత్కరించేలా చేశారు.

కాబట్టి సోమనాథ్ చరిత్ర... కేవలం విధ్వంసంఓటమికి సంబంధించినది కాదు.. అది విజయంపునర్నిర్మాణానికి సంబంధించిన చరిత్రఇది మన పూర్వీకుల పరాక్రమంవారి త్యాగంఅంకితభావానికి సంబంధించిన చరిత్రదురాక్రమణదారులు వస్తూనే ఉన్నారుమతపరమైన మతోన్మాదపు కొత్త తరాలు దాడులు చేస్తూనే ఉన్నాయికానీ ప్రతి కాలంలోనూ పదేపదే సోమనాథ్ పునఃప్రతిష్ఠ జరిగిందిశతాబ్దాల కాలం పాటు సాగిన ఇటువంటి పోరాటంసుదీర్ఘమైన ప్రతిఘటన.. అంతటి గొప్ప సహనంసృజనాత్మకత..  పునర్నిర్మాణంలో పట్టుదల.. అంతటి శక్తిసంస్కృతిపై అచంచలమైన నమ్మకంభక్తి.. ఇలాంటి ఉదాహరణలు ప్రపంచ చరిత్రలోనే అరుదుచెప్పండి.. మన పూర్వీకుల పరాక్రమాన్ని మనం గుర్తుంచుకోవాలి కదావారి సాహసోపేతమైన పనుల నుంచి మనం స్ఫూర్తి పొందాలి కదాఏ పుత్రుడుఏ వారసుడు సొంత తాతముత్తాతల వీరత్వాన్ని మరిచిపోయినట్లు నటిస్తాడు

సోదరీసోదరులారా

గజనీ నుంచి ఔరంగజేబు వరకు లెక్కలేనంత మంది దురాక్రమణదారులు సోమనాథ్‌పై దాడి చేశారుతమ కత్తులు శాశ్వతమైన సోమనాథుడిని జయించగలవని వారు నమ్మారుకానీ 'సోమనాథ్అనే పేరులోనే 'సోమ'..  అంటే అమరత్వాన్ని ప్రసాదించే అమృతం ఉందని ఆ మతోన్మాదులు గ్రహించలేకపోయారువిషాన్ని సేవించినప్పటికీ అమరత్వంతో విరాజిల్లడం అనే తత్వాన్ని ఇది తెలియజేస్తోందిదానిలో సదాశివ మహాదేవుని చైతన్య శక్తి నిబిడీకృతమై ఉందిఆయన శుభకరుడు మాత్రమే కాదు.. 'ప్రచండ తాండవః శివః'లో వ్యక్తమయ్యే శక్తికి మూలకారకుడు కూడా.

సోదరీసోదరులారా

సోమనాథ్‌లో కొలువై ఉన్న మహాదేవుడిని 'మృత్యుంజయఅంటే మృత్యువును జయించినవాడుకాల స్వరూపుడు అని కూడా పిలుస్తారుయతో జాయతే పాల్యతే యేన విశ్వంతమిశం భజే లీయతే యత్ర విశ్వంఅంటే ఈ విశ్వం ఆయన నుంచి పుట్టింది.. ఆయన ద్వారానే పోషణ పొందుతోంది.. చివరికి ఆయనలోనే లీనమవుతుంది

మనం ఇది నమ్ముతాం:

త్వమేకో జగత్ వ్యాపకో విశ్వరూప్

అంటే శివుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు

అందుకే మనం ప్రతి అణువులోనూప్రతి శిలలోనూ శంకరుడిని చూస్తాంఅలాంటప్పుడు శంకరుని లెక్కలేనన్ని రూపాలను ఎవరైనా ఎలా నాశనం చేయగలరుజీవుడిలో కూడా శివుడిని చూసేవాళ్లం మనంమా విశ్వాసాన్ని ఎవరైనా ఎలా కదిలించగలరు?

మిత్రులారా

సోమనాథ్‌ను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మతోన్మాదులు నేడు చరిత్రలోని కొన్ని పేజీలకే పరిమితమైపోయారు అనేది కాలం చెబుతోందిఅయినప్పటికీ సోమనాథ్ ఆలయం నేటికీ అనంతమైన సముద్ర తీరాన సమున్నతంగా నిలబడి ఎత్తైన ధర్మ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తోంది. ‘చంద్రశేఖరమ్ ఆశ్రయే మమ కిమ్ కరిష్యతి వై యమఃఅంటేనేను చంద్రశేఖరుడైన శివుని ఆశ్రయంలో ఉన్నాను.. సాక్షాత్తు ఆ కాలమే నన్ను ఏమీ చేయలేదు’ అని సోమనాథ్ శిఖరం ప్రకటిస్తున్నట్లు అనిపిస్తుంది

మిత్రులారా

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కేవలం చారిత్రక వైభవాన్ని ఉత్సవంగా చేసుకోవటమే కాదు.. ఇది భవిష్యత్తు కోసం ఒక శాశ్వత ప్రయాణానికి జీవం పోసే మాధ్యమం కూడామన అస్తిత్వాన్నిఉనికిని బలోపేతం చేసుకోవడానికి మనం ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలిమీరు గమనిస్తే.. ఏ దేశానికైనా కొన్ని వందల సంవత్సరాల పురాతన వారసత్వం ఉంటే దానిని ఆ దేశం తన గుర్తింపుగా ప్రపంచానికి చాటుకుంటుందికానీ భారత్‌ దగ్గర సోమనాథ్ వంటి వేల ఏళ్ల నాటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయిఈ ప్రదేశాలు మన శక్తికిపట్టుదలకుసంప్రదాయానికి చిహ్నాలుగా నిలిచాయిదురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బానిసత్వ మనస్తత్వం కలిగిన వారు ఈ వారసత్వం నుంచి తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారుఈ చరిత్రను తుడిచిపెట్టడానికి దురుద్దేశపూరితమైన ప్రయత్నాలు జరిగాయి

సోమనాథ్ రక్షణ కోసం దేశం ఎలాంటి త్యాగాలు చేసిందో మనకు తెలుసురావల్ కన్హద్‌దేవ్ వంటి పాలకుల కృషివీర్ హమీర్జీ గోహిల్ పరాక్రమంవెగ్దా భీల్ శౌర్యం.. ఇలా ఎందరో వీరులు సోమనాథ్ ఆలయ చరిత్రతో ముడిపడి ఉన్నారుఅయినప్పటికీ విచారకరంగా వారికి తగిన గుర్తింపు ఎప్పుడూ లభించలేదుబదులుగా కొంతమంది చరిత్రకారులురాజకీయ నాయకులు.. దండయాత్రల చరిత్రను మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించారుమతపరమైన మతోన్మాదాన్ని కేవలం దోపిడీగా చిత్రీకరిస్తూ పుస్తకాలు రాశారుకానీ సోమనాథ్‌పై ఒక్కసారి మాత్రమే దాడి జరగలేదు.. పదేపదే దాడులు జరిగాయిదాడులు కేవలం దోపిడీ కోసమే అయితే వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన మొదటి పెద్ద దోపిడీ తర్వాతే అవి ఆగిపోయేవికానీ అది నిజం కాదుసోమనాథుని పవిత్ర విగ్రహాన్ని అపవిత్రం చేశారుఆలయ రూపురేఖలను పదేపదే మార్చారుసోమనాథ్ కేవలం దోపిడీ కోసమే ధ్వంసం అయిందని మనకు బోధించారుద్వేషంఅణచివేతఉగ్రవాదంతో నిండిన క్రూరమైన చరిత్రను మన నుంచి దాచిపెట్టారు

మిత్రులారా

తన మతం పట్ల నిజమైన విశ్వాసం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి మతోన్మాదాన్ని సమర్థించరుఅయినప్పటికీ బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఎల్లప్పుడూ ఇటువంటి మనస్తత్వానికి మోకరిల్లారుభారతదేశం బానిసత్వ శృంఖలాల నుంచి విముక్తి పొందిన తర్వాత సోమనాథ్‌ను పునర్నిర్మించాలన్న ప్రతిజ్ఞ సర్దార్ పటేల్ చేసినప్పుడు కూడా ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. 1951లో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారుఆ సమయంలో సౌరాష్ట్రకు చెందిన అత్యంత ప్రసిద్ధ పాలకుడైన మన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ గారు ముందుకొచ్చారుభూసేకరణ నుంచి భద్రతా ఏర్పాట్ల వరకు ఆయన జాతీయ గౌరవాన్ని అన్నింటికంటే మిన్నగా భావించారుఆ కాలంలో జామ్ సాహెబ్.. సోమనాథ్ ఆలయం కోసం లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారుట్రస్ట్ మొదటి అధ్యక్షుడిగా గొప్ప బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

సోదరీసోదరులారా

సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు విచారకరంగా నేటికీ మన దేశంలో చురుకుగా ఉన్నాయిభారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు నేడు కత్తులకు బదులుగా ఇతర దుర్మార్గపు రూపాలను దాల్చుతున్నాయిఅందుకే మనం మరింత అప్రమత్తంగా ఉండాలిమనల్ని మనం మరింత బలోపేతం చేసుకోవాలిమనం ఐక్యంగా ఉండాలి.. కలిసికట్టుగా నిలబడాలిమనల్ని విభజించాలని చూసే ప్రతి శక్తిని ఓడించాలి.

మిత్రులారా

మనం మన విశ్వాసంతోమన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడు.. మన వారసత్వాన్ని గర్వంతోఅప్రమత్తతతో కాపాడుకున్నప్పుడు మన నాగరికత పునాదులు మరింత బలోపేతం అవుతాయిఅందుకే ఈ వెయ్యి సంవత్సరాల ప్రయాణం రాబోయే వెయ్యి సంవత్సరాల కోసం మనల్ని సిద్ధం కావడానికి స్ఫూర్తినిస్తుంది

మిత్రులారా

రామమందిర ప్రాణప్రతిష్ఠ వంటి చారిత్రాత్మక సందర్భంలో.. రాబోయే వెయ్యి సంవత్సరాల కోసం భారత్‌ ముందు నేను ఒక ఉదాత్తమైన దార్శనికతను పెట్టాను. 'దైవం నుంచి దేశం వరకుఅనే దృక్పథంతో ముందుకు సాగడం గురించి నేను మాట్లాడానునేడు భారతదేశపు సాంస్కృతిక పునరుజ్జీవనం కోట్లాది మంది పౌరులలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందినేడు ప్రతి భారతీయుడు అభివృద్ధి చెందిన భారతదేశం‌పై విశ్వాసం కలిగి ఉన్నాడునేడు 140 కోట్ల మంది భారతీయులు భవిష్యత్ లక్ష్యాల పట్ల దృఢ సంకల్పంతో ఉన్నారుభారత్‌ తన వైభవాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుందిపేదరికంపై మనం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తాంమనం అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను అధిరోహిస్తాంమొదట ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతర్వాత ఆపై ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలిఈ మార్గం ఇప్పుడు సిద్ధంగా ఉందిసోమనాథ్ ఆలయ శక్తి ఈ సంకల్పాలకు ఆశీస్సులను అందిస్తోంది

మిత్రులారా

నేటి భారతదేశం వారసత్వం నుంచి అభివృద్ధి వైపు స్ఫూర్తితో ముందుకు సాగుతోందిసోమనాథ్‌లో అభివృద్ధివారసత్వం రెండూ కలిసి సాకారమవుతున్నాయిఒకవైపు సోమనాథ్ ఆలయ సాంస్కృతిక విస్తరణసోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయ స్థాపనమాధవ్‌పూర్ మేళా చైతన్యం.. ఇవన్నీ మన వారసత్వాన్ని బలోపేతం చేస్తున్నాయిగిర్ సింహాల సంరక్షణ ఈ ప్రాంతానికి ఉన్న సహజ ఆకర్షణను పెంపొందిస్తోందిమరోవైపు ప్రభాస్ పటాన్‌లో అభివృద్ధికి సంబంధించిన కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయికేశోద్ విమానాశ్రయ విస్తరణ వల్ల దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికులు నేరుగా సోమనాథ్‌కు చేరుకోగలుగుతారుఅహ్మదాబాద్-వెరావల్ వందే భారత్ రైలు ప్రారంభం కావడంతో యాత్రికులుపర్యాటకుల ప్రయాణ సమయం తగ్గిందిఈ ప్రాంతంలో తీర్థయాత్ర సర్క్యూట్ అభివృద్ధి కూడా కొనసాగుతోందిఈ విధంగా నేటి భారతదేశం కేవలం విశ్వాసాన్ని స్మరించుకోవడమే కాకుండా.. మౌలిక సదుపాయాలుఅనుసంధానతసాంకేతికత ద్వారా భవిష్యత్తు కోసం దానిని శక్తిమంతం చేస్తోంది.

మిత్రులారా

మన నాగరికత అందించే సందేశం ఎన్నడూ ఇతరులను ఓడించడం కాదు.. జీవితాన్ని సమతుల్యంగా ఉంచుకోవడంమన సంప్రదాయంలో విశ్వాస మార్గం ద్వేషానికి దారితీయదుమన బలం విధ్వంసం చేసే అహంకారాన్ని మనకు ఇవ్వదు. ‘సృజన మార్గం సుదీర్ఘమైనది కావచ్చు.. కానీ అది శాశ్వతమైనదిఅమరమైనది’ అని సోమనాథ్ మనకు నేర్పిందికత్తి మొనతో హృదయాలను ఎన్నటికీ గెలవలేంఇతరులను తుడిచిపెట్టి ముందుకు సాగాలని చూసే నాగరికతలు కాలక్రమంలో కలిసిపోతాయిఅందుకే భారతదేశం ఇతరులను ఓడించి గెలవాలని ప్రపంచానికి బోధించలేదు.. హృదయాలను గెలుచుకుని ఎలా జీవించాలో నేర్పిందిఈ ఆలోచనే నేడు ప్రపంచానికి ఎంతో అవసరంసోమనాథ్ వెయ్యేళ్ల గాథ మొత్తం మానవాళికి ఇదే పాఠాన్ని అందిస్తోంది

కాబట్టి మనం అభివృద్ధి దిశగా ముందుకు సాగడానికి మన గతాన్నివారసత్వాన్ని విస్మరించకుండా మన లక్ష్యాలను మరువకుండా ఒకరికొకరు తోడుగా భుజం భుజం కలిపిహృదయాలను మేళవించి అడుగులు వేద్దాం అనే సంకల్పం తీసుకుందాంమన చైతన్యాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను ఆహ్వానిద్దాంసోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వంటి పండుగల నుంచి స్ఫూర్తి పొంది పురోగతి మార్గంలో వేగంగా పయనిద్దాంప్రతి సవాలును అధిగమించి మన లక్ష్యాలను చేరుకుందాంఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమవుతుందిఈ వెయ్యేళ్ల ప్రయాణాన్ని దేశవ్యాప్తంగా స్మరించుకోవాలిమన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలిఈ కొత్త 75 ఏళ్ల కీలక ఘట్టాన్ని ఉత్సవంలా జరుపుకోవాలిఈ వేడుకలను మే 2027 వరకు కొనసాగించాలిప్రతి ఒక్కరిని మేల్కొల్పుదాంమేల్కొన్న దేశపు కలలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగనిద్దాంఈ ఆకాంక్షతో మరోసారి నా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

హర హర మహాదేవ్!

జై సోమనాథ్.

జై సోమనాథ్.

జై సోమనాథ్.

 

***


(रिलीज़ आईडी: 2213632) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam