బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు రంగాభివృద్దిపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల చింతన్ శివిర్ నిర్వహణ


అమలు వేగం పెంచేందుకు చింతన్ శివిర్ ఫలితాలను అన్ని స్థాయిలకూ చేర్చాలన్న బొగ్గు శాఖ మంత్రి

प्रविष्टि तिथि: 06 JAN 2026 6:18PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి అధ్యక్షతనకేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే సహ-అధ్యక్షతన, 2026 జనవరి 5, 6వ తేదీల్లో గురుగ్రామ్ లోని మానెసర్ లో రెండు రోజుల పాటు చింతన్ శివిర్ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ చింతన్ శివిర్‌లో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్‌‌దత్అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపిందర్ బ్రార్శ్రీ సనోజ్ కుమార్ ఝాకోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్అన్ని బొగ్గులిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థల సీఎండీలతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారుబొగ్గు రంగంలోని అగ్రశ్రేణి నాయకత్వం.. సాధారణ పరిపాలనా పనులకు పరిమితం కాకుండా సంస్కరణలుపనితీరుసంస్థాగత మార్పులపై దృష్టి సారించిఫలితాలనిచ్చే చర్చల్లో పాల్గొనే అవకాశాన్ని ఈ వేదిక కల్పించింది.

బొగ్గు రంగంలో కొనసాగుతున్న సంస్కరణల పురోగతి సమీక్షభారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతఅభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించటానికి వ్యూహాత్మక వేదికగా చింతన్ శివిర్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి కీలక ప్రసంగమిస్తూస్వచ్ఛ ఇంధన వనరుల వైపు భారత్ వేగంగా పయనిస్తున్నప్పటికీదేశ ఇంధన భద్రతలో బొగ్గు ఇప్పటికీ అత్యవసరమైన మూలాధారమన్నారుబొగ్గు ద్వారా స్థిరంగానిరంతర విద్యుత్ పంపిణీ జరుగుతుందనిఉక్కుసిమెంట్ వంటి కీలక పరిశ్రమలకు ఇది ఎంతగానో సహకరిస్తుందని చెప్పారుదేశ ఆర్థిక వృద్ధినిజాతీయాభివృద్ధిని కొనసాగించటంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక సంవత్సరం 2024-25ను చరిత్రాత్మక ఘట్టంగా కేంద్రమంత్రి అభివర్ణించారుఈ సమయంలో 1,047 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేసిచరిత్రలోనే గరిష్ఠ రికార్డును సాధించిందని వెల్లడించారునిరంతర ఉత్పత్తి సామర్థ్య పెంపుమెరుగైన పనితీరుబొగ్గు సరఫరా వ్యవస్థలోని పటిష్టమైన సమన్వయానికి ఈ విజయం నిదర్శనమన్నారు.

బొగ్గు రంగానికి సంబంధించిన సంస్కరణలన్నీ ఒకే విధంగాప్రామాణీకరణ ప్రాతిపదికన జరగాలని శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారుదీనివల్ల అన్ని బొగ్గు సంబంధిత పీఎస్‌యూల్లో ఒకే రకమైన విధానాలుస్పష్టమైన ప్రమాణాలుఅంచనా వేయదగిన ఫలితాలు ఉంటాయన్నారుమెరుగైన ప్రణాళికపర్యవేక్షణ ద్వారా యంత్రాల వినియోగం పెంచేందుకుఆస్తుల ఉత్పాదకతను మెరుగుపరచటానికినిర్వహణ లోపాలు తగ్గించేందుకు ఒక నిర్దిష్టమైనకాలపరిమితితో ప్రణాళికను రూపొందించాలని కోరారుభద్రత విషయంలో రాజీ పడకుండా కఠినమైన భద్రతా నిబంధనలుపటిష్టమైన పర్యవేక్షణజవాబుదారీతనం అవసరమని మంత్రి స్పష్టం చేశారుఅసలు ప్రమాదాలే జరగకూడదన్న లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారుకార్యాచరణ వృద్ధితో పాటుబొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఆరోగ్యంవిద్యఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తూ సమాజ సంక్షేమ కార్యక్రమాలను విస్తరించాలని చెప్పారుపర్యావరణం పట్ల బొగ్గు రంగానికున్న బాధ్యతను గుర్తుచేస్తూ.. క్రమబద్ధమైన అడవుల పెంపకంపర్యావరణ పునరుద్ధరణ ప్రాముఖ్యతను కేంద్రమంత్రి వివరించారుసమతుల్యబాధ్యతాయుతమైన అభివృద్ధికి హామీ ఇస్తూమైనింగ్ ప్రక్రియల్లో పర్యావరణహిత పద్ధతులను అనుసరించాలని సూచించారు.

దేశీయ ఉత్పత్తిలో స్థిరమైన వృద్ధిమెరుగైన రవాణా సౌకర్యాల వల్ల బొగ్గు దిగుమతులుముఖ్యంగా వివిధ అవసరాలకు చేసే దిగుమతులు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారుఫలితంగావిదేశీ మారక ద్రవ్యం భారీగా ఆదా అయిందని తెలిపారుదేశీయ అవసరాలకు భద్రత కల్పిస్తూనేబొగ్గు ఎగుమతి దిశగా భారత్ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారుభారత ఉత్పత్తి సామర్థ్యంనాణ్యతలో మెరుగుదలసరఫరా వ్యవస్థ బలోపేతంపై పెరుగుతున్న నమ్మకానికి ఈ మార్పు ఒక నిదర్శనమని తెలిపారు.

కీలకమైన విధానపరకార్యాచరణ ప్రాధాన్యతలను వివరిస్తూకొన్ని ముఖ్యమైన అంశాలను కేంద్రమంత్రి వెల్లడించారుఇంధన భద్రతను కాపాడటంలాజిస్టిక్స్సరఫరా వ్యవస్థసామర్థాన్ని బలపరచటంబొగ్గు నాణ్యతను పెంచటంసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను పటిష్టం చేయటం అత్యంత ఆవశ్యకమని తెలిపారుచింతన్ శివర్ చర్చల ఫలితాలు అన్ని స్థాయిలకూ చేరటం ద్వారా పనుల అమలు సమన్వయంతోవేగంగా జరుగుతుందని మంత్రి సూచించారుబొగ్గు రంగ పీఎస్‌యూలు కేవలం చర్చలకు పరిమితం కాకుండాఫలితాలపై దృష్టి సారించాలని.. ఉత్పాదకతభద్రతసుస్థిరతఆవిష్కరణలుసహజ భాగస్వామ్యం వంటి అంశాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించాలని కోరారుబొగ్గు రంగంలోని మార్పుల్లో తదుపరి దశ.. స్థిరమైన పనితీరుకొలవదగిన ఫలితాల ఆధారంగా ఉండాలని చెప్పారు.

కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ప్రసంగిస్తూ.. దీర్ఘకాలికఫలితాల ఆధారిత పరిపాలనసమష్టి దార్శనికతకు మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ చింతన్ శివిర్ ప్రతిబింబిస్తుందని తెలిపారుభారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని విస్తరిస్తూపర్యావరణహిత లక్ష్యాల దిశగా పయనిస్తున్నప్పటికీఇంధన స్థిరత్వంవిశ్వసనీయతను అందించటంలో బొగ్గు రంగం ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారువినియోగదారుల అవసరాలను తీర్చేందుకుబొగ్గు నాణ్యతను మెరుగుపరించేందుకు వాషరీ సామర్థ్యాలను బలపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీ దూబే సూచించారుప్రతి గనికి బ్లాక్ పర్యవేక్షణ నిమిత్తం అధికారిని కేటాయించటం ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించవచ్చనితద్వారా సకాలంలో పనుల అమలుక్రమశిక్షణనిర్దేశిత ప్రమాణాల అనుసరణ సాధ్యమవుతుందని చెప్పారుఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను సహాయ మంత్రి వివరించారువేగవంతమైన యాంత్రీకరణఅడ్డంకులు లేని రవాణా ద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుందనినష్టాలు తగ్గుతాయనిబొగ్గు రంగంలోనూ పోటీతత్వం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు లభ్యత మెరుగుపడిందనిబొగ్గు దిగుమతులు తగ్గటం ద్వారా విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా తగ్గిందనిలాజిస్టిక్స్ సామర్థ్యం పెరగటం వంటి అంశాలను శ్రీ దూబే ప్రధానంగా ప్రస్తావించారుఅంతేకాకస్వయం వినియోగకమర్షియల్ బొగ్గు గనుల నుంచి సహకారం పెరుగుతుందని తెలిపారుకార్యకలాపాల సామర్థ్యంభద్రతా ప్రమాణాలుబొగ్గు కార్మికులకు అందించే సేవలను మెరుగుపరచటంలో డిజిటల్ వేదికలుసాంకేతిక పరిష్కారాల పాత్రను స్పష్టం చేశారువేగంస్థాయిస్థిరత్వంపై బొగ్గు రంగ పీఎస్‌యూల సీఎండీలునాయకత్వ బృందాలు దృష్టి సారించాలనితద్వారా సంస్కరణల మార్పులు క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలను అందిస్తాయని తెలిపారు.

బొగ్గు రంగంలో స్పష్టమైన విధానాలుసంస్థాగత సంస్కరణలుఅనుకూలమైన వ్యవస్థలు ఉన్నత దశకు చేరుకున్నాయని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్‌దత్ అన్నారుఅమలుక్రమశిక్షణకొలవదగిన ఫలితాలపైనే మనం దృష్టి సారించాలని సూచించారుఅధికార వికేంద్రీకరణఆమోద సరళీకరణసులభతర ప్రక్రియలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని చెప్పారుఇలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యంఆశించిన స్థాయిలో పని జరగకపోవటం వంటి వాటికి తావుండదని తెలిపారు.

భవిష్యత్తులో వేగంజవాబుదారీతనం కీలకమని కార్యదర్శి స్పష్టం చేశారునిర్దేశించిన లక్ష్యాలుసమయపాలనఫలితాలకు ప్రతి సీఎండీసీనియర్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత వహించాలన్నారుకేవలం ఆలోచనల ద్వారా కాకనిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయటంక్షేత్రస్థాయిలో ప్రభావం ఆధారంగా పనితీరును అంచనా వేయనున్నట్లు చెప్పారుఫలితాలే ప్రధానమనే ధోరణితో అన్వేషణగనుల నిర్వహణలాజిస్టిక్స్ సమన్వయంప్రాజెక్టుల అమలును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారుసాంకేతికతను అందిపుచ్చుకోవటం తప్పనిసరని శ్రీ దత్ తెలిపారుడిజిటల్ వ్యవస్థలురియల్ టైమ్ మానిటరింగ్ఏఐ ఆధారిత వేదికలుడేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవటం బొగ్గు రంగంలోని అన్ని విభాగాల్లో ప్రామాణికంగా మారాలని చెప్పారు.

పర్యావరణ బాధ్యతగనుల పునరుద్ధరణసుస్థిరతసామాజిక జవాబుదారీతనం వంటివి అదనపు అంశాలు కాదనిఅవి కార్యాచరణ నైపుణ్యంలో అంతర్భాగమని చెప్పారువీటిని ప్రణాళికఅమలు దశల్లోనే తప్పనిసరిగా చేర్చాలని సూచించారుచింతన్ శివిర్.. కేవలం సంస్కరణల చర్చా వేదికగా మాత్రమే మిగిలిపోకూడదనిసంస్కరణల ఆధారిత పనితీరును ప్రదర్శించే సంస్కృతికి నాంది కావాలని కాంక్షించారుఅమలుకొలవదగిన ఫలితాలపై బలమైన దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ చింతన్ శివిర్ కార్యక్రమంలో బొగ్గు రంగానికి సంబంధించిన కీలకమైన కార్యాచరణవ్యూహాత్మక అంశాలపై వరుసగా చర్చలు నిర్వహించారుకోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ బిసాయిరాం పర్యవేక్షణలో ప్రతిపాదిత సంస్కరణలు అనే అంశంపై సెషన్ జరిగిందిమార్కెట్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు రంగాన్ని బలోపేతం చేయటంపనితీరును మెరుగుపరచటం వంటి సంస్కరణల అజెండాపై ఈ సెషన్ దృష్టి సారించిందిసంస్కరణల ద్వారా స్థిరమైన పనితీరును అందించేలా వ్యవస్థలను ప్రాథమికంగా మార్చాలని ప్రసంగాల ద్వారా స్పష్టం చేశారువినియోగదారులకు అనుకూలమైన నిబంధనలతో ఈ ఒప్పందాలను మార్చటంబొగ్గు నాణ్యతసరఫరాలో స్థిరత్వం ఉండేలా స్పష్టమైన కేపీఐలను నిర్ణయించటంపక్షపాతాన్ని తగ్గించేందుకుస్కోరింగ్‌ను ప్రామాణీకరించేందుకులోపాలను గుర్తించేందుకువివాదాలు లేకుండా టెండర్ ప్రక్రియ ముగించేందుకు ఏఐని వినియోగించటం వంటి కీలక చర్యలు తీసుకున్నారుబొగ్గు రంగంలో వ్యవస్థాగత మార్పులుపాలనాపరమైన సంస్కరణలపై ఈ సమావేశం దృష్టి సారించిందిసమర్థవంతమైన పునరావాస ప్రక్రియవాటాదారుల నిర్వహణకు ప్రత్యేకంగా భూసేకరణ కేడర్ ఏర్పాటును ప్రతిపాదించారుఆమోద ప్రక్రియల్లో స్పష్టతకుపనిని సులభతరం చేసేందుకు అధికారుల అధికారాలను నవీకరించటంబదిలీ చేయటంపై చర్చించారు.

రిక్రూట్‌మెంట్ నిబందనలను క్రమబద్దీకరించటానికిపరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకునియమాక సమయాన్ని తగ్గించేందుకు ఏకీకృత నియామక మాన్యువల్‌ను తీసుకురానున్నారుకనెక్ట్-ఆటోమేట్-ప్రొటెక్ట్ వ్యవస్థ ద్వారా డిజిటలైజేషన్పరిశోధనఆర్ అండ్ డీ వ్యవస్థను బలోపేతం చేయటంగనుల అన్వేషణప్రణాళికలను ఆధునీకరించటం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారువ్యవస్థల సంస్కరణకార్యకలాపాల మార్పుబొగ్గు రంగంలో మార్కెట్ ఆధారిత పనితీరును మెరుగుపరచటం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యందీని ఆధారంగా కార్యకలాపాల్లో వ్యయ నియంత్రణ అనే అంశంపై జరిగిన మరో సెషన్‌లో బొగ్గు రంగ పీఎస్‌యూల్లో ఉత్పాదకతను పెంచటంఅమలు సామర్థ్యం మెరుగుపడటంపై చర్చించారు.

సీఎంపీడీఐ సీనియర్ నాయకత్వ పర్యవేక్షణలో బొగ్గు అన్వేషణను వేగవంతం చేయటంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగిందిఈ సెషన్‌లో అన్వేషణ కాలపరిమితిని తగ్గించేందుకుభౌగోళిక సన్నద్దతకు అవసరమైన వ్యూహాలపై చర్చించారుగనుల తవ్వకాలను సకాలంలో ప్రారంభించాలన్న అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్సీనియర్ సాంకేతిక అధికారుల సమక్షంలో జరిగిన కీలక సెషన్‌లో చట్టబద్ధమైన అనుమతులను వేగంగా పొందటంఅడ్డంకుల తొలగింపుపై ప్రధానంగా దృష్టి సారించారు.

బొగ్గు నాణ్యత మెరుగుదలభూగర్భ గనుల తవ్వకం సహా వాణిజ్య గనులతో పోటీతత్వం వంటి కీలక అంశాలపై కోల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ సాంకేతిక నాయకత్వం సీఎండీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో తదుపరి సెషన్లు నిర్వహించారుఈ కార్యక్రమంలో బొగ్గు శుద్ధి ప్రక్రియఅధునాతన మైనింగ్ సాంకేతిక పరిజ్ఞానంభద్రతా ప్రమాణాలు సహా మారుతున్న మైనింగ్ పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు రంగ పీఎస్‌యూల పోటీతత్వాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చించారుక్షేత్రస్థాయిలో అడ్డంకులను అధిగమించి అవసరమైన ఆచరణాత్మక పరిష్కారాలను అందించటమే ప్రతి సెషన్ అనంతరం జరిగిన ముఖాముఖి చర్చల సారాంశం.

చింతన్ శివిర్ సందర్భంగారాంచీలో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్‌మెంట్ (ఐఐసీఎంఎగ్జిక్యూటివ్ హాస్టల్‌ను కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జికిషన్ రెడ్డి ప్రారంభించారుబొగ్గు రంగంలోని సీనియర్ అధికారులకుఅధికారుల నివాసశిక్షణా మౌలిక సదుపాయాలను మెరుపరిచే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మించారుబొగ్గుగనుల రంగ వ్యవస్థలో సామర్థ్య పెంపుదలనాయకత్వ వికాసంజ్ఞానాధారిత సంస్థాగత నైపుణ్యాలను పెంపొందించటంలో ఐఐసీఎం పాత్రను ఈ సదుపాయం మరింత బలోపేతం చేస్తుంది.

చింతన్ శివిర్‌లోని చర్చలు.. బొగ్గు రంగ వ్యవస్థ అంతటా క్షేత్ర స్థాయిలో అమలుక్రమశిక్షణతో నిర్వహణస్పష్టమైన ఫలితాల సాధన అవసరాన్ని స్పష్టం చేశాయి.

బొగ్గు రంగంలో వ్యూహాత్మక దిశానిర్దేశంసంస్థాగత మద్దతు అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందిప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని పెంపొందించాలనినిర్ణీత పనులను తప్పనిసరిగా సకాలంలో పూర్తి చేయాలని చెప్పింది.

జనవరి 5వ తేదీన వాణిజ్య బొగ్గు మైనింగ్‌లో పోటీతత్వాన్ని పెంపొందించటంపై ప్రత్యేక ప్రజెంటేషన్చర్చా కార్యక్రమం జరిగిందికోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో మైనింగ్ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనితీరు ప్రమాణాల నిర్దారణఉత్పాదకత పెంపుదల సహా వ్యూహాత్మక సన్నద్ధతపై విశ్లేషణలను పంచుకున్నారు.

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దేశం స్థిరంగా ముందుకు వెళ్తున్న తరుణంలో దేశీయ ఉత్పత్తి పెంపునిర్వహణలో పటిష్టత సహా పెరుగుతున్న పోటీతత్వంతో బొగ్గు రంగం కీలక ఘట్టానికి చేరుకుందిస్పష్టమైన దిశానిర్దేశంఉమ్మడి బాధ్యతపనితీరుతో జాతీయ ఇంధన భద్రతను పటిష్టం చేయటానికి స్వావలంబనను బలపరచటానికి బొగ్గు రంగం సిద్ధంగా ఉందిభవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకుసుస్థిరమైన ఇంధన రంగంగా రూపాంతరం చెందుతూ భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిలో బాధ్యతాయుతమైన భాగస్వామిగా ఈ రంగం సహకారం అందిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2212271) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी