బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ధన్‌బాద్‌ ఐఐటి (ఐఎస్ఎం) లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్,


వర్చువల్ రియాలిటీ మైన్ సిమ్యులేటర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి

ఆవిష్కరణ, సుస్థిరతపై ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్ విద్యార్థులతో ముచ్చటించిన కేంద్రమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 DEC 2025 9:33PM by PIB Hyderabad

జార్ఖండ్‌లో  రెండు రోజుల పర్యటన సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ఈ రోజు ఐఐటి (ఐఎస్ఎంధన్‌బాద్‌లో జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద ఏర్పాటు అయిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారువర్చువల్ రియాలిటీ మైన్ సిమ్యులేటర్ (వీఆర్ఎంఎస్ను కూడా ఆయన ప్రారంభించారుఅనంతరం నిర్వహించిన ముఖాముఖిలో ఐఐటి (ఐఎస్ఎంధన్‌బాద్ విద్యార్థులతో ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.

కేంద్ర మంత్రి ప్రారంభించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈకీలక ఖనిజాలలో పరిశోధనపరిశ్రమ-స్థాయి పరిష్కారాల కోసం జాతీయ స్థాయి ఆధార కేంద్రంగా పనిచేస్తుందిఇది ముఖ్యంగా కీలక ఖనిజాల అన్వేషణతవ్వకంశుద్ధిపునర్వినియోగంపునఃఉపయోగ వ్యర్థాల నుంచి సంపద (వేస్ట్-టు-వెల్త్వంటి అంశాలపై  దృష్టి సారిస్తుందిపరిశ్రమలోని ప్రముఖ సంస్థలతో పాటు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంసెంట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యంతో కూడా పనిచేస్తుందిఅలాగే ఐఐటి గాంధీనగర్ఐఐటి బీహెచ్‌యూసీపీఐ (యూకేనుంచి మౌలిక వసతుల మద్దతు తీసుకుంటుంది

ఐఐటి (ఐఎస్ఎంధన్‌బాద్ ఆధ్వర్యంలోకోల్ ఇండియాదాని అనుబంధ సంస్థలైన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ల సహకారంతో అభివృద్ధి చేసిన వర్చువల్ రియాలిటీ మైన్ సిమ్యులేటర్ (వీఆర్ఎంఎస్దేశంలో బొగ్గు గనుల భద్రతఉత్పాదకత కోసం రూపొందించిన తొలి వీఆర్  ఆధారిత గని సిమ్యులేటర్‌. 360 డిగ్రీల ఇమ్మర్సివ్ వర్చువల్ రియాలిటీ థియేటర్‌తో కూడిన ఈ వీఆర్ఎంఎస్ వాస్తవ గని డేటాను ఉపయోగిస్తుందిభారీ పరికరాల నిర్వహణకీలకమైన భద్రతా ప్రమాణాలతో 20 పైగా శిక్షణ మాడ్యూళ్లను అందిస్తుందిఆపరేటర్ల నుంచి సీనియర్ మేనేజర్ల వరకు అన్ని స్థాయిల ఉద్యోగులకు దృశ్య ఆధారిత అంచనా,  నిర్ధారణను వీఆర్ఎంఎస్ అందిస్తుందిఇది శిక్షణ సమయాన్ని సగానికి తగ్గిస్తుందనిఅదే సమయంలో మెరుగైన భద్రతా సంసిద్ధతను అందిస్తుందని అంచనా.

క్యాంపస్ జీవితంసంస్కృతిలో ఎప్పటినుంచో ఒక భాగంగా విద్యార్థులు నిత్యం సమావేశమయ్యే సుప్రసిద్ధ,  పురాతన ఆర్డీ చౌక్ వద్ద కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి స్నేహపూర్వక వాతావరణంలో ఐఐటీ (ఐఎస్ఎంధన్‌బాద్ విద్యార్థులుయువ పరిశోధకులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు

తేనీటితో మొదలైన వారి సంభాషణ సుహృద్భావ వాతావరణంలో అర్థవంతమైన చర్చలుఆలోచనల స్వేచ్ఛా మార్పిడికి అనువైన వాతావరణాన్ని సృష్టించింది.

విద్యార్థులు తమ విద్యా ప్రయాణాలుపరిశోధనల పట్ల ఆసక్తివృత్తి పరమైన ఆకాంక్షలను మంత్రితో పంచుకున్నారుగనుల రంగంలో సాంకేతికతఆవిష్కరణల మారుతున్న పాత్రకీలక ఖనిజాలలో అవకాశాలుసుస్థిరతపరిశుభ్రమైన ఇంధనంపరిశోధన ఆధారిత దేశీయ పరిష్కారాల అవసరం వంటి అంశాలు వారి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి

సంప్రదాయ పాత్రల పరిమితిని దాటి ఆలోచించాలనితమని తాము జాతీయ అభివృద్ధికి తోడ్పడేవారుగానూగనులుఇంధన రంగాలలో సమస్యల పరిష్కార కర్తలుగానూ భావించుకోవాలని శ్రీ కిషన్ రెడ్డి విద్యార్థులను ప్రోత్సహించారు.

యువతతో నిరంతరం అనుసంధానం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూభారత వ్యూహాత్మక రంగాల భవిష్యత్తును ఆసక్తిఆత్మవిశ్వాసంనూతన ఆవిష్కరణల పట్ల తపన కలిగిన యువతే తీర్చిదిద్దుతుందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారుఈ ఇష్టాగోష్టి సమావేశం సులభంగా చేరుకోవడంసంభాషణవిశ్వాసంపై ఆధారపడ్డ నాయకత్వ దృక్పథాన్ని ప్రతిబింబించిందికొత్త తరం ఆశయాలతో ప్రభుత్వం నేరుగా మమేకమైనప్పుడే అర్థవంతమైన పురోగతి సాధ్యమవుతుందనే నమ్మకాన్ని మరింత దృఢం చేసింది.

అంతకుముందుశ్రీ కిషన్ రెడ్డి తన ప్రసంగంలో విజ్ఞాన సృష్టిపరిశోధనఆవిష్కరణల ద్వారా భారత గనుల రంగం భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కీలక పాత్రను వివరించారుఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎంకేవలం గనుల రంగ నిపుణులను తయారుచేసే ఒక ప్రధాన సంస్థ మాత్రమే కాదనిఅది ఈ రంగానికి అవసరమైన ఆవిష్కరణలకునూతన సాంకేతిక దృక్పథానికి మూల స్తంభం వంటిదని ఆయన పేర్కొన్నారు.

గనుల రంగం ప్రస్తుతం ఒక చారిత్రక మలుపులో ఉందనిఇక్కడ సాంకేతికతకీలక ఖనిజాలుసుస్థిరతజాతీయ భద్రత కలిసి ఆత్మనిర్భర్ భారత్‌ లక్ష్యాన్ని నడిపిస్తున్నాయని శ్రీ రెడ్డి పేర్కొన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం సమాచార సాంకేతికతఆవిష్కరణలు,  పరిశోధన ఆధారిత వృద్ధి దిశగా బలమైన ప్రోత్సాహాన్ని పొందుతోందని ఆయన అన్నారుపరిశోధనఅభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూజాతీయ స్థాయిలో పరిశోధనఅభివృద్ధి  పెట్టుబడులను భారత్ గణనీయంగా పెంచిందనిపేటెంట్ దరఖాస్తుల్లో ప్రపంచంలోనే ఆరో స్థానంలో నిలిచిందనిడీప్-టెక్ఆవిష్కరణల వ్యవస్థలో వేగవంతమైన విస్తరణను చూస్తోందని ఆయన పేర్కొన్నారుగనుల రంగంలో సమాచార సాంకేతికతను వినియోగించి నిరంతర పర్యవేక్షణసామర్థ్యాన్ని పెంపొందించడానికి,  పారదర్శకతభద్రతను బలోపేతం చేయడానికి సహాయపడుతున్న కోల్ సేతుకోయిలా శక్తి డ్యాష్‌బోర్డ్ఇంటిగ్రేటెడ్ కమాండ్కంట్రోల్ సిస్టమ్స్ వంటి పథకాల ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు

 

***


(రిలీజ్ ఐడి: 2208009) సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी