పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత సుస్థిర పర్యాటక ప్రమాణాలు

प्रविष्टि तिथि: 08 DEC 2025 2:45PM by PIB Hyderabad

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ భారత సమగ్ర సుస్థిర పర్యాటక ప్రమాణాలను ప్రవేశపెట్టిందిఇవి పర్యాటక రంగంలోని మూడు ప్రధాన విభాగాలైన టూర్ ఆపరేటర్లువసతి సదుపాయాలుబ్యాక్ వాటర్స్సరస్సులునదులకు వర్తిస్తాయిఈ ప్రమాణాలను పర్యాటక రంగంలోని భాగస్వాములు ఆమోదించారుమంత్రిత్వ శాఖ ఆమోదించిన టూర్ ఆపరేటర్లు “సురక్షితమైనగౌరవమైన పర్యాటకంసుస్థిర పర్యాటకం” పై నిబద్ధత కలిగి ఉంటామనే ఓ ప్రతిజ్ఞపై సంతకం చేయాలిదీని ద్వారా వారు పర్యావరణంవారసత్వ పరిరక్షణకు అనుగుణంగా సుస్థిర పర్యాటక విధానాలను అమలు చేయాల్సి ఉంటుందిప్రస్తుత పర్యాటక వనరుల వినియోగం స్థానిక సమాజానికి లాభం చేకూర్చేలాభవిష్యత్తులో కూడా సుస్థిరంగా ఉపయోగపడేలా చూడటం దీని ఉద్ధేశంఇప్పటివరకు 2787 వసతి యూనిట్లు, 1633 పర్యాటక సేవా ప్రదాతలు పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందారు.

సుస్థిర పర్యాటకం కోసం మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనలకు అందజేసిందిఈ వ్యూహానికి అనుగుణంగా పర్యాటకులుపర్యాటక వ్యాపారాలు సుస్థిర పర్యాటక పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడానికి ట్రావెల్ ఫర్ లైఫ్ (టీఎఫ్ఎల్కార్యక్రమాన్ని ప్రారంభించారుసుస్థిర పర్యాటకం కోసం జాతీయ వ్యూహం ద్వారా ఎలాంటి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించలేదు.

పర్యాటక మంత్రిత్వ శాఖ– పర్యావరణంఅటవీ,& వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2023-24లో 210 మందికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కార్యాక్రమంపర్యావరణ్ నావిక్ సర్టిఫికేట్ పై 15 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించాయిసుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్ (హర్యానా), యశ్వంత్ సాగర్ డ్యామ్సిర్పూర్ సరస్సు ఇండోర్ (మధ్యప్రదేశ్), భితార్కనికా మడ అడవులు,చిలికా సరస్సు (ఒడిశా)వంటి అయిదు రామ్‌సర్ ప్రదేశాల్లో ఈ కార్యాక్రమాలను నిర్వహించింది.స్థానిక సాంస్కృతికసహజ వనరులను పరిరక్షించిమెరుగుపరచడంరామ్‌సర్ ప్రదేశాల్లో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధికి మద్దతివ్వడం ఈ రెండు మంత్రిత్వ శాఖల లక్ష్యం.

పర్యాటక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్ట్ దశలోనే హోటళ్ళు వివిధ పర్యావరణ అనుకూల చర్యలను తప్పనిసరిగా అనుసరించాలివాటిలో మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్ టీపీ), వర్షపు నీటి సేకరణ వ్యవస్థవ్యర్థాల నిర్వహణ వ్యవస్థకాలుష్య నియంత్రణశీతలీకరణఎయిర్ కండిషనింగ్ కోసం నాన్-క్లోరోఫ్లోరోకార్బన్ (సీఎఫ్ సీపరికరాలను ప్రవేశపెట్టడంశక్తినీటి సంరక్షణ కోసం చర్యలు మొదలైనవి ఉన్నాయిదేశంలో స్థిరమైనబాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలుస్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యంతో పర్యాటక గమ్యస్థానాల సమగ్ర అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్ పథకాన్ని స్వదేశ్ దర్శన్ 2.0గా పునరుద్ధరించారు. ‘‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్‘‘ అనేది స్వదేశ్ దర్శన్ 2.0 కింద ఉన్న ఉప పథకంపర్యాటక వ్యవస్థలో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడంపర్యాటక గమ్యస్థానాలను స్థిరమైనబాధ్యతాయుతమైనవిగా మార్చడమే ఈ పథకం లక్ష్యం.

 

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


(रिलीज़ आईडी: 2200665) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil